-
అడవిలో తప్పిపోయిన బాలుడ్ని కాపాడిన ఫారెస్ట్ అధికారులు
-
చిట్టడివి..చీకటి.. ఓ చిన్నారి కథ
పోరుమామిళ్ల: ఏడేళ్ల బాలుడు ఇంటికి బయలుదేరాడు. ఊరు దారి విడిచి అడవి దారి పట్టాడు. చిట్టడవిలో చిక్కుకుపోయాడు. చీకట్లో బిక్కుబిక్కుమంటూ తెల్లార్లు గడిపాడు. బిడ్డ కోసం తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రంతా అడవిలో వెతుకులాడినా ఫలితం లేదు. తెల్లవారిన తర్వాత తప్పిపోయిన పశువుల కోసం వెతుకుతున్న వారి కంట పడ్డాడు. సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. 14 గంటల గ్రామస్తుల ఉత్కంఠకు తెరదించాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలంలో కవలకుంట్ల పంచాయతీలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... కవలకుంట్ల పంచాయతీ బుచ్చంపల్లెకు చెందిన మతకాల వెంకటసుబ్బయ్య, సీతామహాలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సుమంత్(7) ఒకటవ తరగతి చదువుతున్నాడు. వెంకటసుబ్బయ్య గేదెలు మేపుకుంటూ, సీతామహాలక్ష్మి కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం బడి నుంచి వచ్చిన సుమంత్ తల్లి కట్టెపుల్లలకు వెళుతుంటే తనూ వెళ్లాడు. సమీపంలో అడవికి దగ్గరలో తండ్రి గేదెలు మేపుతుండగా అమ్మతో చెప్పి నాన్న దగ్గరకు వెళ్లాడు. చీకటి పడుతుందని, నీవు ఈ దారిలో ఇంటికి వెళ్లు అని వెంకటసుబ్బయ్య కొడుక్కు చెప్పి..తాను చెట్లు, పొదల్లో మేస్తున్న గొడ్లను తోలుకొస్తానని దారి చూపించి వెళ్లాడు. బుడ్డోడు సరేనని నాన్న చూపించిన దారిలో బయలుదేరాడు. పొరపాటున కొండదారి పట్టాడు. అలా నాలుగైదు కిలోమీటర్లు వెళ్లేసరికి బాగా చీకటిపడింది. కనుచూపు మేరలో ఊరు కనిపించలేదు. కేకలు వేసినా పలికే దిక్కు లేదు. బిక్కు బిక్కు మంటూ అలాగే ఓ పొద దగ్గర కూలబడిపోయాడు. చీకటి పడ్డా బిడ్డ ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. కనపడిన వారందరినీ అడిగారు. ఆచూకీ లభించలేదు. విషయం ఊరంతా పాకిపోయింది. ఓ యాభై మంది పిల్లాడిని వెతికేందుకు అడవికి బయలుదేరారు. పోలీసులు, ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందడంతో వారూ వెతకడానికి వెళ్లారు. తెల్లారేంతవరకు పిల్లాడి ఆచూకీ దొరకలేదు. పశువుల కోసం వెతుకుతుండగా... ఈ నేపథ్యంలో బుధవారం పొద్దుపొడవక ముందే కవలకుంట్లకు చెందిన ఏసయ్య, శాంతయ్యలు తప్పిపోయిన తమ గొడ్లను వెతికేందుకు అడవి దారి పట్టారు. అలా వారు వెళుతుండగా ఆరు గంటల ప్రాంతంలో పొద దగ్గర బాలుడి ఏడుపు విని అటు వెళ్లడంతో సుమంత్ కనిపించాడు. విచారిస్తే విషయం అర్థమయింది. బాలుడిని ఎత్తుకొని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఊరి దారి పట్టారు. దారిలో ఉండగానే ఫారెస్టు సిబ్బంది, గ్రామస్తులు ఎదురయ్యారు. సుమంత్ను చూసి ఫారెస్టు సిబ్బంది వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి పిల్లాడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. 14 గంటలు ఎంతో టెన్షన్ పెట్టినా చివరాఖరుకు కథ సుఖాంతమయింది. -
ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా..?
రిమ్మనపూడి (పామర్రు): ‘వెచ్చని నీ పొత్తిళ్లలో ఉండాల్సిన నేను ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా.. చలి గాలులకు నా చిట్టి ప్రాణం తట్టుకోలేక పోతోందమ్మా.. వీధి కుక్కలు ఎక్కడ వచ్చి పీక్కు తింటాయోనని భయంగా ఉందమ్మా.. ఆకలేసి గుక్కపెట్టి ఏడుస్తున్నా నీకు వినిపించడం లేదా అమ్మా.. ఏడ్చీ ఏడ్చీ గొంతు తడారిపోతోందమ్మా.. పొదల్లో నన్ను ఎవరెవరో వచ్చి చూస్తున్నారు కానీ నీవు రావడంలేదు ఏమిటమ్మా..’ అన్నట్టుంది ఆ పసిగుడ్డు పరిస్థితి. పామర్రు మండలం రిమ్మనపూడి శివారు అంకామ్మగుంట గ్రామం శివారులో చెట్ల పొదల నుంచి చంటిపాప ఏడుపు విన్న స్థానికులు ఆడ శిశువును గుర్తించారు. వెంటనే పామర్రు ఎస్ఐ పండుదొరకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి రోజుల వయస్సు శిశువుగా గుర్తించి ఐసీడీఎస్ అధికారుల ద్వారా మచిలీపట్నంలోని శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ముళ్లపొదల నుంచి ఏడుపులు.. అసలేం జరిగింది..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తొమ్మిది నెలలు మోసి, పాలిచ్చి పెంచిన తల్లి..కుమారులకు భారమైంది. రెండు కాళ్లు కదపలేక వృద్ధాప్యంతో బాధపడుతున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపకుండా ముళ్లపొదల్లో పారవేసి వదిలించుకున్నారు. మనసున్న కొందరు మహిళలు ఆ మార్గంలో వెళుతూ గమనించి ఆదుకోగా ప్రభుత్వ ఆస్పత్రిలో అనాథలా గడుపుతోంది. వివరాలు.. తిరుళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం కున్నమంజేరి గ్రామానికి చెందిన కొందరు మహిళలు సమీపంలోని చెరువుకు వెళుతుండగా మార్గమధ్యంలోని ముళ్లపొదల నుంచి మహిళ ఏడుపులు, మూలుగుల శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా రెండు కాళ్లు అచేతన స్థితిలో సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు పడిఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారంతా కలిసి వృద్ధురాలిని ముళ్లపొదల్లో నుంచి మోసుకొచ్చి పోలీసుల సమాచారం ఇచ్చారు. ఆమెను అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనలి చెక్కోడుకు చెందిన ఆ వృద్ధమహిళ కాంతిమతి పోలీసులకు తనగోడు చెప్పుకున్నారు. తనకు భర్త రాధాకృష్ణన్, రవి, శంకర్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుమారులిద్దరూ కూలీపనులకు వెళుతుంటారు. కుమారులు తనను సరిగా చూసుకునేవారు కాదు. తనను పోషించడం భారంగా భావించారు. చిన్నకుమారుడు శంకర్ మాయమాటలతో గురువారం రాత్రి మోటార్సైకిల్పై తీసుకొచ్చి జనసంచారం లేని ప్రాంతంలోని ముళ్లపొదల్లో తోసివేసి వెళ్లిపోయాడని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. వృద్ధురాలు కాంతిమతి కుటుంబం గురించి మరిన్ని వివరాలు చెప్పలేకపోవడంతో సమాచారం రాబట్టేందుకు పోలీసులు శ్రమపడుతున్నారు. పూర్తి సమాచారం రాబట్టిన తరువాత కుమారులపై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయిస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మనసు మార్చుకుని కుమారులు వస్తారు, అక్కున చేర్చుకుంటారని ఆ అమాయక తల్లి ఆశగా ఎదురుచూస్తోంది. చదవండి: దోషం పోతుందని బిడ్డను బలిచ్చిన తల్లి కేసులో కొత్త విషయాలు దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి -
శిశువును పొదలో పడేసేందుకు యత్నం
సాక్షి, డోన్(కర్నూలు): పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. రెండు నెలల పసిగుడ్డు.. అనారోగ్యంతో మృతిచెందితే.. మానవత్వం మరిచి ముళ్లపొదల్లో పారవేసిన తల్లిదండ్రుల ఉదంతం ఇది. బనగానపల్లె మండలం లింగదొడ్డి గ్రామానికి చెందిన రాజు,లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుతూరు అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. దీంతో వారు నేరుగా మృత శిశువును రైలులో డోన్కు తీసుకొచ్చి పట్టణ శివారులోని లెప్రసీ కాలనీలో ముళ్లపొదల్లో పడవేశారు. దీన్ని గమనించిన ద్రోణాచలం సేవాసమితి సభ్యులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఐలు సురేష్, నరేష్ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి మృత శిశువును ఖననం చేస్తామనే హామీతో వదిలివేశారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement