-
‘మీ సేవ’లో చోరీ
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మీ సేవ కేంద్రం, కన్నాపురం రోడ్డులోని సొసైటీ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు చొరబడి ఇనుప బీరువా తాళాలను పగులగొట్టి నగదు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి.. బుట్టాయగూడెం మీ సేవ కేంద్రంలో దొంగలు ప్రవేశించి రూ.3,500 నగదు అపహరించినట్టు నిర్వాహకులు ఉడతా లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సొసైటీలో తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు ఇనుప బీరువాను పగులగొట్టి రూ.9,500 నగదు దొంగిలించినట్టు కార్యదర్శి కరాటం నాగంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ షేక్ హిమామ్ సంఘటనా స్థలాలను పరిశీలించారు. అర్ధరాత్రి వేళ చోరీలు జరిగి ఉండవచ్చని అన్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సాధికార సర్వే 90 శాతం పూర్తి
కేఆర్ పురం (బుట్టాయగూడెం): జిల్లాలో ప్రజా సాధికారిక సర్వే 90 శాతం పూర్తయ్యిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. కేఆర్ పురం ఐటీడీఏలో బుధవారం సర్వేపై జంగారెడ్డిగూడెం డివిజన్లోని మండలాల తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సిగ్నల్ లేకపోవడం వల్ల 10 నుంచి 13 శాతం సర్వే మిగిలి ఉందన్నారు. దీనిని కూడా ఈనెల 13వ తేదీ సాయంత్రంలోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూరు శాతం సర్వే పూర్తిచేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఏ గ్రామాల్లో సిగ్నల్ అందడం లేదు, ఎన్ని గ్రామాల్లో, ఎంత మందికి సర్వే చేయాల్సి ఉందనే విషయాలపై నివేదిక తయారుచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్, ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
బుట్టాయగూడెం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంట ర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నాగులగూడెంకు చెందిన కొవ్వాసి బుచ్చిరాజు, చోడెం నరసింహరాజు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి రామారావుపేట సెంటర్ వైపు వస్తున్నారు. అలాగే జైనవారిగూడెంకు చెందిన కోర్సా రాంబాబు కూడా ద్విచక్రవాహనంపై రామారావు పేట సెంటర్ వైపు వస్తుండగా, ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. వీరిలో చోడెం నరసింహరాజు, కోర్సా రాంబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement