-
రానిటిడిన్ ఔషధంలో కేన్సర్ కారకాలు
సాక్షి, హైదరాబాద్ : ఛాతిలో, కడుపులో మంట ఇలా ఏదైనా సమస్య వస్తే వైద్యులకు చెప్పకుండానే అనేక మంది ‘రానిటిడిన్’ మందు లను వాడేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ తోనూ, ప్రిస్కిప్షన్ లేకుండానే ఈ మం దును ఔషధ దుకాణాల్లో ఇస్తున్నారు. కానీ రానిటిడిన్లో ప్రమాదకరమైన ఎన్– నైట్రొసో డైమిథైలమైన్ (ఎన్డీఎంఏ) కొద్ది మోతాదులో ఉందని, దీంతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) తాజాగా ప్రకటించింది. దీంతో కెనడా, సింగపూర్, ఈజిప్ట్, బహ్రెయిన్ సహా పలుదేశాలు ఈ మందును నిషేధించాయి. హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ఈ ఔషధంతో కూడిన మాత్రలను తయారు చేస్తాయి. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఇప్పటికే కొన్ని దేశాలకు ఎగుమతి చేయగా.. ఎఫ్ఏడీ ప్రకటనతో ఆ సరుకును వెనక్కి తెప్పిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దేశంలోనూ ఈ ఔషధంతో కూడిన మాత్రలను నిషేధించాలని ఫార్మసిస్టులు కోరుతున్నారు. దేనికి వాడుతున్నారంటే.. రానిటిడిన్తో దేశంలో అనేక అంతర్జాతీయ బహుళ ఫార్మా కంపెనీలు రెండు మూడు ప్రధాన మైన బ్రాండ్ల పేరుతో ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. రానిటిడిన్–150 ఎంజీ మాత్ర హిస్టమైన్–2 బ్లాకర్ అని పిలిచే ఒక ఔషధ సమూహాన్ని కలిగి ఉంది. ఈ ఔషధం కడుపులో ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కడుపు, పేగు లోపల పూతలా చికిత్స అందిస్తుంది. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ వ్యాధి, జోలింగర్–ఎల్లిసన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు కడుపులో అధిక ఆమ్ల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అలాగే డియోడినల్ అల్సర్లు వచ్చినప్పుడు రానిటిడిన్–150 ఎంజీ మాత్ర ఉపయోగిస్తారు. చిన్న పేగు పూతల స్వల్పకాలిక చికిత్స కోసం ఉపయోగిస్తారు. కడుపు పూతలకు స్వల్పకాలిక చికిత్స కోసం రానిటిడిన్–150 ఎంజీ వాడుతారు. పూతల బారిన పడిన తర్వాత నిర్వహణ చికిత్సగా ఉపయోగిస్తారు. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ వ్యాధి నివారణకు కూడా రానిటిడిన్–150 ఎంజీని వాడతారు. ఎరోసివ్ ఈసోఫాగిటిస్ వచ్చినప్పుడు కూడా ఈ మాత్ర వాడతారు. కడుపు నుంచి సుదీర్ఘ ఆమ్లం రిఫ్లక్స్ కారణంగా ఆహార గొట్టం క్షీణిస్తే చికిత్స చేసేందుకు ఈ మాత్ర ఉపయోగిస్తారు. అలాగే జోలింగర్–ఎల్లిసన్ సిండ్రోమ్ వచ్చినప్పుడు కడుపులో ఆమ్ల స్రావం అరుదుగా ఉన్న అరుదైన పరిస్థితుల లక్షణాల ఉపశమనానికి ఈ మాత్రను ఉపయోగిస్తారు. హైపర్ సీక్రెటరీ కండీషన్లో చికిత్సకు ఉపయోగిస్తారు. భారత్లో ప్రతి ముగ్గురిలో ఒకరు.. కడుపులో మంట, ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి పరిస్థితులను అనేకమంది ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించడానికి రానిటిడిన్ మూలనామం కలిగిన అనేక బ్రాండ్లతో కంపెనీలు తయారు చేస్తున్నాయి. అవన్నీ కూడా ప్రజలకు సుపరిచితం. భారత్లో ప్రతి ముగ్గురిలో ఒకరు వీటిని ఉపయోగిస్తున్నారని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు సంజయ్రెడ్డి తెలిపారు. భారత్లో ఈ మందును నిషేధించాలని కోరారు. -
మరణంలోనూ వీడని బంధం
సాక్షి, అన్నానగర్: కేన్సర్తో బాధపడుతున్న భర్తను రక్షించుకోలేక పోతున్నాననే ఆవేదనతో భార్య సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుంది. కాగా అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి భర్త మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నై మందవెలి సెయింట్ మేరీస్ రోడ్డుకి చెందిన ఉమామహేశ్వరి (46), ఈమె భర్త ప్రకాష్ వరదన్ (50). దంపతులకు కేశవన్ (19) అనే కుమారుడు ఉన్నాడు. ఎనిమిది నెలల కిందట ప్రకాష్ వరదన్కి కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. పలు ఆపరేషన్లు చేసినప్పటికీ కేన్సర్ నుంచి కోలుకోలేకపోయాడు. కేన్సర్ నయం అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రకాష్వరదన్ కొన్ని రోజులే మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. దీంతో ఉమామహేశ్వరి భర్తను ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూసుకునేది. ఈ స్థితిలో బుధవారం వేకువజామున ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పిన ఉమామహేశ్వరి తిరిగి రాలేదు. తన కుమారుడు కేశవన్ సెల్ఫోన్కు ఆమె ఆడియో మెసేజ్ పంపింది. ఇందులో తండ్రిని బాగా చూసుకోవాలని, తాను భర్త లేకుండా జీవించలేనని పేర్కొంది. దీనిపై కేశవన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎలియట్స్ సముద్రతీరంలో ఉమామహేశ్వరి మృతదేహం ఒడ్డుకు చేరింది. ఇలాఉండగా అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి ప్రకాష్వరదన్ మృతి చెందాడు. ఒకే రోజున కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో విషాదం నెలకొంది. -
క్యాన్సర్లను నివారించే ఎండుద్రాక్ష!
కిస్మిస్ లేదా ఎండుద్రాక్ష అని పిలిచే ఈ డ్రైఫ్రూట్స్ రుచికరమే కాదు... ఆరోగ్యకరం కూడా. 100 గ్రాముల ఎండుద్రాక్షలో 249 క్యాలరీలతో పాటు పీచుపదార్థాలు, ఎన్నో రకాల లవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండుద్రాక్షతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... ►ఎండుద్రాక్షలో (ద్రాక్షలో మాదిరిగానే) రెస్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. నొప్పి, మంటను తగ్గించడంతో పాటు క్యాన్సర్లను నివారించే శక్తి దీనికి ఉంటుంది. ముఖ్యంగా అది మెలనోమా, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది ∙ఎండుద్రాక్ష అనేక రకాల ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ►కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడంతో పాటు గుండెజబ్బులను (కరోనరీ ఆర్టరీ డిసీజ్ను) రాకుండా కాపాడుతుంది ∙రక్తనాళాలను సన్నబార్చే ఏంజియోటెన్సిన్ అనే హార్మోన్ను స్రావాలను తగ్గించి పక్షవాతాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఇలా ఏంటియోటెన్సిన్ను తగ్గించడం వల్ల హైబీపీ కూడా నివారితమవుతుంది. ∙రక్తనాళాలను విప్పారేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లను పెరిగేలా చేయడం వల్ల రక్తనాళాలు సన్నబారవు. దాంతో గుండెజబ్బులతోపాటు పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ►ఎండుద్రాక్షలో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఐరన్ పాళ్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత (అనీమియా) ఉన్నవారికి రక్తవృద్ధి చేస్తుంది ∙100 గ్రాముల ఎండుద్రాక్షలో 749 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీని నివారించడంతో పాటు గుండెజబ్బులను, పెరిఫెరల్ వాస్కులార్ డిసీజ్ను నివారించడానికీ తోడ్పడుతుంది ∙థయామిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లేవిన్, పాంటథోనిక్ యాసిడ్ వంటి బి–కాంప్లెక్స్కు సంబంధించిన విటమిన్ అంశాలు ఉండటం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. -
జపాన్ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్కు చెందిన ‘ఇసాయి’ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇసాయి అభివృద్ధి చేస్తున్న క్యాన్సర్ ఏజెంట్ ఈ7777పై వాణిజ్యపరమైన హక్కులను (ఆసియా, జపాన్ కాకుండా) డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేసింది. కానీ ఎంత మొత్తానికి ఈ హక్కులను కొనుగోలు చేసింది కంపెనీ తెలియచేయలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
ఆరోగ్యమస్తు
పోస్టల్ బ్యాలెట్ల కొనుగోలు.. ప్రభుత్వ ఉద్యోగిపై కేసు
వడ్డెరల మద్దతు వైఎస్సార్ సీపీకే
No Headline
చంద్రబాబు బూటకపు హామీలు నమ్మొద్దు
ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండండి
సంక్షేమ పథకాలు వైఎస్సార్ సీపీకే సాధ్యం
బాలినేనికి బ్రహ్మరథం
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement