-
తిరుపతిలో కేన్సర్ ఆసుపత్రికి భూమిపూజ
-
ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్డులో ఆదివారం ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఓటీ కాంప్లెక్స్, సర్జికల్ ఆంకాలజి బ్లాక్, ఎంఐసీయూ, డిజిటల్ మామోగ్రఫి, కన్సల్టేషన్ రూమ్స్, రేడియేషన్ ఆంకాలజి బ్లాక్, మెడికల్ ఆంకాలజి వార్డు, సిటీ స్కాన్, బ్రాచీథెరపీ, లైనియర్ యాక్సిలేటర్ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ప్రారంభించారు. ప్రైవేటు ఆసుపత్రులతోనూ అభివృద్ధి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహిస్తుందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ త్వరలో రూ.120కోట్లతో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం కాబోతుందని చెప్పారు. మెరుగైన క్యాన్సర్ చికిత్స కోసం గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ వెళ్లేవారని, ఇప్పుడు కర్నూలులోనే ఆ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరం మెడికల్ హబ్గా మారబోతుందన్నారు. ఒమెగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహనవంశీ మాట్లాడుతూ రాయలసీమలో మొట్టమొదటిసారిగా అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సను తాము అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి, డాక్టర్ బి. రవీంద్రబాబు, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ కె. సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీబీనగర్ నిమ్స్ను ఏం చేద్దాం?
వైద్య కళాశాలా?.. క్యాన్సర్ ఇన్స్టిట్యూటా? మూడు ప్రతిపాదనలతో సీఎం వద్దకు ఫైలు తాజా బడ్జెట్లో రూ.కోటితో సరిపెట్టిన వైనం సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న బీబీనగర్ నిమ్స్పై మళ్లీ సందిగ్ధం నెలకొంది. 150 ఎకరాల విస్తీర్ణం గల ఈ క్యాంపస్ను,అందులో నిర్మించిన భవనాలను వైద్య కళాశాలకు అప్పగించాలా..? క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు కేటాయించాలా..? లేక ముందుగా అనుకున్నట్టు జనరల్ ఆస్పత్రినే కొనసాగించాలా..? అనే దానిపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలు ఇప్పటికే సీఎం కేసీఆర్కు చేరినట్టు సమాచారం. ఈ భవనాలను ఏం చేయాలనే అంశంపై పూర్తి నిర్ణయాధికారాన్ని సీఎంకే వదిలేసినట్టు సమాచారం. తాజా బడ్జెట్లో దీనికి పెద్దగా కేటాయింపులు జరపకపోవడం వెనుక ఇదే కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓపీకి అంతా సిద్ధమైనా.. బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తులు నిమ్స్ భవనం పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. దివంగత సీఎం వైస్ రాజశేఖరరెడ్డి 2009లో దీనికి శంకుస్థాపన చేశారు. ఇటీవలే ఓపీ భవనం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కాకపోయినా తొలిదశలో భాగంగా ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలు, అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులు, ప్రాథమిక అవసరాల కోసం 700 మంది నర్సింగ్, పారామెడికిల్, నాన్ పారామెడికల్ స్టాఫ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. తీరా ప్రారంభ సమయంలో దీనిపై సీఎం కేసీఆర్కు మూడు ప్రతిపాదనలు అందాయి. తాజా ప్రతిపాదనలు ఇలా.. ప్రస్తుతం రెడ్హిల్స్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. దీన్ని బీబీనగర్కు తరలించి క్యాన్సర్తో బాధపడుతున్న వారికి అక్కడే వైద్యసేవలు అందించాల నే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. లేదంటే తెలంగాణకు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి ఈ క్యాంపస్ను కేటాయించడం వల్ల గ్రామీణ విద్యార్థులకు వైద్యవిద్యను దగ్గర చేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని యోచిస్తోంది. ఈ రెండు కాకపోతే స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా జిల్లాలో మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఏదేమైనా సకాలంలో సేవలు అందుబాటులోకి వస్తే భువనగిరి డివిజన్తోపాటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా బీబీనగర్ నిమ్స్పై ఇంకా ఓ నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గుచేటని పీసీసీ నాయకుడు చామల ఉదయ్ చందర్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఆస్పత్రి భవనాన్ని వెంటనే ప్రారంభించి, స్థానికులకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement