-
నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన
-
నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 9.30 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. పెనుమాక, ఎర్రబాలెం మీదుగా రైతులను పలకరించుకుంటూ వెళ్లి బేతపూడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడే మీడియాతోనూ మాట్లాడతారని అభిమాన సంఘం నేతలు చెప్పారు. -
బాబు నైజమేంటో తెలుస్తోంది: ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అన్నాహజారే వంటివారు ఆందోళనలు చేస్తుండడంతోపాటు మరోవైపు దీనిపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు ఆ చట్టాన్ని రైతులపై ప్రయోగిస్తానని చెప్పడాన్నిబట్టే ఆయన వైఖరేంటో తెలిసిపోతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సైతం భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో రాజధాని గ్రామాల రైతులపై ఈ చట్టం ప్రయోగించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్పై పార్లమెంటులో స్పష్టత వచ్చేవరకైనా దీనిని ఆపివేయాలన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడితే.. తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. అవసరమైతే తమపార్టీ రైతులపక్షాన కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. ల్యాండ్పూలింగ్ విధానంలో ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన భూమి, అక్కడనున్న ప్రభుత్వ భూములన్నీ కలపి దాదాపు 40 వేల ఎకరాల వరకు అవుతున్నాయని, అలాంటప్పుడు అదనంగా రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాల్సిన అవసరమేంటని ఆర్కే ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఆ 40 వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని సూచించారు. వైఎస్సార్సీపీ రైతులపక్షాన ఉండి పోరాడబట్టే ప్రభుత్వం భూసమీకరణ గడువు ముగిసే సమయంలో అదనపు పరిహారాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. రైతులకు ఒక సెంటు పరిహారం కూడా అదనంగా పెంచేది లేదని మంత్రి నారాయణ ఫిబ్రవరి మొదటివారంలో చెప్పారని, ఇప్పుడు సీఎం ప్రకటన చేశారంటే అందుకు తమ పార్టీ ఒత్తిడే కారణమన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం 30 వేలమంది వరకు ఉన్న రైతులకు పరిహారం పెంచింది కానీ... 3 లక్షలమంది కౌలురైతులు, కూలీలకు పరిహారం పెంచలేదని ఆర్కే తప్పుపట్టారు. రాజధాని ఒప్పందం ఎవరితో? రాజధాని నిర్మాణంకోసం సింగపూర్తో ఒప్పందం విషయంలో ఆ దేశ మంత్రి మాటలు, మన సీఎం మాటలు భిన్నంగా ఉంటున్నాయని రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది తమ దేశానికి చెందిన సంస్థలతోనేనని సింగపూర్ మంత్రి చెబుతుంటే, చంద్రబాబు ఇన్నాళ్లూ సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్నట్టు చెబుతూ వచ్చారన్నారు.ఈ విషయంలోనూ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టించిందన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఏపీ పరువు తీశారు టీడీపీ వాళ్ళు..కృష్ణంరాజు సంచలన కామెంట్స్
బెంగాల్ గవర్నర్పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కాంగ్రెస్ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు.. నలుగురి మృతి
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి..
తప్పక చదవండి
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ‘నాగి..నిన్ను కొట్టాలి.. ‘బుజ్జి’ గ్లింప్స్పై ప్రభాస్ రియాక్షన్
- భార్యతో హార్దిక్కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
Advertisement