-
జాతీయ చాంపియన్ అపూర్వ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేషనల్స్ క్యారమ్స్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. ఎల్ఐసీ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రపంచ చాంపియన్ అపూర్వ మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్గా అవతరించగా... పురుషుల టీమ్ విభాగంలో ఎస్. ఆదిత్య, మొహమ్మద్ అహ్మద్, యు.నరేశ్, వసీమ్, సందీప్, నందులతో కూడిన తెలంగాణ జట్టు విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన 35 ఏళ్ల అపూర్వ మహిళల సింగిల్స్ ఫైనల్లో 25–11, 25–11తో రష్మి కుమారి (పీఎస్పీబీ)పై గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో 18–8, 23–16తో ఖుష్బూ రాణిపై, క్వార్టర్స్లో 25–0, 22–8తో నీలమ్పై, ప్రిక్వార్టర్స్లో 24–9, 25–0తో శ్రుతి (మహారాష్ట్ర)పై గెలుపొందింది. ఈ సందర్భంగా సోమవారం మలక్పేట్లోని సిటీ టవర్స్లో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ యాజమాన్యం జాతీయ చాంపియన్లుగా నిలిచిన అపూర్వ, తెలంగాణ పురుషుల జట్టును ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్, తెలంగాణ క్యారమ్ సంఘం అధ్యక్షులు బీకే హరనాథ్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఏపీ–తెలంగాణ జట్లకు 6 పతకాలు
సాక్షి, హైదరాబాద్: సీఎస్ఐసీఈ జాతీయ క్యారమ్ చాంపియన్షిప్లో ఏపీ–తెలంగాణ జట్టు రాణించింది. సెయింట్ జోసెఫ్ స్కూల్ (మలక్పేట్) ఆధ్వర్యంలో ఆర్ఎఫ్సీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఏపీ–తెలంగాణ జట్లు వివిధ వయో విభాగాల్లో ఆరు పతకాలను గెలుచుకున్నాయి. అండర్–17 బాలికల విభాగంలో విజేతగా నిలిచిన ఏపీ తెలంగాణ జట్టు.... అండర్–14 బాలికల కేటగిరీలో రన్నరప్గా నిలిచింది. అండర్–19 బాలబాలికల, అండర్–17 బాలుర, అండర్–14 బాలుర విభాగాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో ప్రపంచ క్యారమ్ చాంపియన్ అపూర్వ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో సీఐఎస్సీఈ విద్యాధికారి గోడ్విన్ డేనియల్, కార్యదర్శి మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైనల్కు కార్తీక వర్ష, నందిని
సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, వి. ఇందిరాంబ స్మారక తెలంగాణ రాష్ట్ర క్యారమ్స్ చాంపియన్షిప్లో సి. కార్తీక వర్ష (నాసర్ స్కూల్), కె. నందిని (ఏడబ్ల్యూఏఎస్ఏ) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఖైరతాబాద్లో జరుగుతోన్న ఈ టోర్నీలో జూనియర్ బాలికల విభాగంలో టైటిల్పోరుకు అర్హత సాధించిన వీరిద్దరూ మహిళల కేటగిరీలో సెమీఫైనల్లో అడుగుపెట్టారు. సోమవారం జూనియర్ బాలికల సెమీస్ మ్యాచ్ల్లో కార్తీక వర్ష 25–8, 25–0తో సి. దీప్తిపై గెలుపొందింది. మరో మ్యాచ్లో నందిని 25–6, 25–4తో కె. నవిత (ఏడబ్ల్యూఏఎస్ఏ)పై గెలుపొంది కార్తీక వర్షతో ఫైనల్పోరుకు సిద్ధమైంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్ల్లో నందిని 22–14, 21–9తో లక్ష్మి (ఐబీఎమ్)పై, కార్తీక వర్ష 25–0, 25–3తో రమశ్రీ (పోస్టల్)పై, జయశ్రీ 25–0, 25–6 తో పద్మజపై, అపూర్వ (ఎల్ఐసీ) 25–0, 25–1తో మాధవిపై గెలుపొందారు. నేడు జరిగే మ్యాచ్ల్లో జయశ్రీతో వర్ష, అపూర్వతో నందిని తలపడతారు. పురుషుల విభాగంలో శ్రీనివాస్ (ఐఓసీఎల్), నరేశ్ (ఏసీసీఏ), హకీమ్ (బీఎస్ఎన్ఎల్), ఆదిత్య సెమీస్లో అడుగుపెట్టారు. క్వార్టర్స్ మ్యాచ్ల్లో శ్రీనివాస్ 25–9, 13–3తో మొహమ్మద్ అహ్మద్పై, నరేశ్ 17–11, 25–2, 16–13తో అనిల్ కుమార్పై, హకీమ్ 22–9, 25–0తో వసీమ్పై, ఆదిత్య 25–0, 17–20, 25–19తో నవీన్పై గెలిచి ముందంజ వేశారు. -
విజేత భవన్స్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల క్యారమ్ టోర్నమెంట్లో భవన్స్ కాలేజి (సైనిక్పురి) జట్టు చాంపియన్గా అవతరించింది. బద్రుకా కాలేజి (కాచిగూడ) ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. ఫైనల్లో భవన్స్ కాలేజి 2–0తో మఫకంజా (ఎంజే) ఇంజినీరింగ్ కాలేజిపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో భవన్స్ కాలేజి 2–0తో ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ కామర్స్ కాలేజిపై, ఎంజే కాలేజి 2–0తో మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజిపై విజయాలు సాధించి తుది పోరుకు చేరుకున్నాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజి 2–1తో ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కాలేజిని ఓడించింది. బద్రుకా కాలేజి ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ డా.సోమేశ్వర్ రావు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ సెక్రటరీ ప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, టోర్నీ సెక్రటరీ ప్రొఫెసర్ కె.దీప్లా తదితరులు హాజరయ్యారు. -
బద్రుకా కాలేజి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: బద్రుకా కాలేజి ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నిర్వహిస్తోన్న ఇంటర్ కాలేజి పురుషుల క్యారమ్స్ టోర్నమెంట్లో ఆతిథ్య బద్రుకా కాలేజి జట్టు శుభారంభం చేసింది. బద్రుకా కాలేజిలో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో బద్రుకా కాలేజి 2–0తో సెయింట్ మేరీస్ (యూసుఫ్గూడ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో ఎంజే ఇంగ్లీష్ కాలేజి 2–0తో ఎస్పీ కాలేజిపై విజయం సాధిం చింది. అంతకుముందు జరిగిన రౌండ్–1 మ్యాచ్లో ఎంజే ఇంగ్లిష్ కాలేజి 2–0తో సెయింట్ జోసెఫ్ డీసీపై గెలుపొందింది. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ విజయ రామారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో బద్రుకా కాలేజి జనరల్ డైరెక్టర్ ప్రొఫెసర్ టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్ డా.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రౌండ్–1 ఫలితాలు: మాతృశ్రీ ఇంగ్లీష్ కాలేజి 2–0తో ఇస్లామియా ఇంగ్లీష్ కాలేజిపై విజయం. మెస్కో కాలేజి 2–0తో అవంతి డీసీపై విజయం. ఎస్పీ కాలేజి 2–1తో నిజామ్ డీసీపై విజయం. ఓయూ సైన్స్ కాలేజి 2–0తో వసుంధర డీసీపై విజయం. వెస్లీ కాలేజి 2–0తో హెచ్ఎంవీ డీసీపై విజయం. శివ శివాని డీసీ 2–1తో అన్వర్ ఉల్ ఉలూమ్ డీసీపై విజయం. రౌండ్–2 ఫలితాలు ఐఐఎంసీ కాలేజి 2–0తో రైల్వే డీసీపై విజయం. ఓయూ కామర్స్ కాలేజి 2–1తో ఏవీ కాలేజిపై విజయం. భవన్స్ సైనిక్పురి కాలేజి 2–0తో ప్రభుత్వ సిటీ కాలేజిపై విజయం. మాతృశ్రీ ఇంగ్లిష్ కాలేజి 2–1తో మెస్కో కాలేజిపై విజయం. ఓయూ సైన్స్ కాలేజి 2–0తో లయోలా అకాడమీ కాలేజిపై విజయం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement