-
రంకేసిన గుంటూరు జిల్లా ఎద్దులు
సాక్షి, సత్రశాల (రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం సమీపంలోనున్న అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య, భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో గుంటూరు జిల్లా ఎద్దులు రంకేశాయి. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో భాగంగా 6వ రోజు గురువారం రెండు పళ్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొత్తం 12 జతల గిత్తలు పాల్గొన్నాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన అరిగెల కార్తీక్ నాయుడు, రమ్యనాయుడు గిత్తలు 4,800 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ.20వేలను కైవసం చేసుకున్నాయి. నకరికల్లు మండలం కుంకనగుట్ల గ్రామానికి చెందిన బల్లగిరి వెంకటేశ్వర్లు ఎడ్లు 4,690.2 అడుగుల దూరం లాగి 2వ బహుమతి రూ.15 వేలను దక్కించుకున్నాయి. ఫిరంగిపురం మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన యేరువ శ్రీనివాసరెడ్డి, అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన నెట్టం గీతా చౌదరి కంభైడ్ ఎడ్లు 4,658.5 అడుగుల దూరం లాగి 3వ బహుమతి రూ.10వేలను కైవసం చేసుకున్నాయి. చేబ్రోలు మండలం తోటపాలెం గ్రామానికి చెందిన రామినేని రత్తయ్య ఎడ్లు 4,642.11 అడుగుల దూరం లాగి 4వ బహుమతి రూ.8 వేలను గెలుచుకున్నాయి. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన రాయ రామిరెడ్డి గిత్తలు 4,553 అడుగుల దూరం లాగి 5వ బహుమతి రూ.5 వేలను దక్కించుకుంది. పోటీలను అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య, భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రం అధ్యక్ష ఉపాధ్యక్షులు గుంటా పుల్లారెడ్డి, పులి ఓబుల్రెడ్డి, కమిటీ సభ్యులు యర్రెద్దు శ్రీనివాసరెడ్డి, గొట్టం రవీంద్రారెడ్డి, పత్తి కోటిరెడ్డి, దొండేటి వెంకటేశ్వరరెడ్డి, చింతా శివారెడ్డి, చేర్రెడ్డి కోటిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, మందలపు వెంకటరెడ్డి పర్యవేక్షించారు. కొండు వెంకట్రామిరెడ్డి, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ విభాగంలో రూ.20వేలను భాస్కర్రెడ్డి, రూ.15వేలను శ్రీనివాసరెడ్డి, రవీంద్రారెడ్డి, రూ.10వేలను లింగారెడ్డి, రూ.8వేలను అంజిరెడ్డి, రూ.5వేలను భాస్కర్రెడ్డి అందజేశారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఎడ్ల పందేలు
పర్చూరు, న్యూస్లైన్: వైఎస్సార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఆదివారం నూతలపాడు గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతమైన నూతలపాడులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పార్టీ స్థానిక నాయకుడు పావులూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సభలో రవికుమార్ మాట్లాడారు. నూతలపాడు జూనియర్ కళాశాలలో గొట్టిపాటి నరసింహారావు(నరసయ్య) ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను ఆదివారం ఉదయం గొట్టిపాటి రవికుమార్, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ప్రారంభించారు. అనంతరం నరసయ్య 50వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసయ్య సతీమణి పద్మ, కుమార్తె లక్ష్మి పాల్గొన్నారు. సభా వేదికపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, గొట్టిపాటి నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నరసయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. సభలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ఒంగోలు జాతి పశుసంపదపై మక్కువతో గతంలో మార్టూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించినట్లు తెలిపారు. అప్పట్లో 250 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయని గుర్తుచేశారు. తర్వాత అనివార్య కారణాల వల్ల పోటీలు నిర్వహించలేకపోయామన్నారు. వైఎస్సార్ పేరున భవనం శ్రీనివాసరెడ్డి పోటీలు నిర్వహించడం అభినంద నీయమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు సక్రమం గా అమలవుతాయని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రస్తుత పాలకులు రాష్ట్రాన్ని ఏ విధంగా బ్రష్టు పట్టించారో ప్రతి ఒక్క పౌరుడూ గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. తన అన్న కుమారుడు భరత్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ.. ‘నాన్న పుట్టినరోజున ఆయనకు ఇష్టమైన ఎడ్లపోటీలు నిర్వహించడం ఆనందంగా ఉంద’ని అన్నారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలవాలని కోరారు. పోటీల నిర్వాహకుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నరసయ్య జయంతి రోజున రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా సభ్యులు వల్లభరెడ్డి సుబ్బారెడ్డి, జూనియర్ కళాశాల యాజమాన్య ప్రతినిధి భవనం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్రా శేషగిరిరావు, తాటి వెంకట్రావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మనుబోతు వెంకటరెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు తోకల కృష్ణమోహన్, బండారు ప్రభాకరరావు, పఠాన్ కాలేషావలి, కోట విజయభాస్కరరెడ్డి, ధూలిపాళ్ళ వేణుబాబు, దండా చౌదరి, యద్దనపూడి, పర్చూరు మండలాల యూత్ అధ్యక్షులు తమ్మా అమ్మిరెడ్డి, ఆకుల హేమంత్, నూతలపాడు సర్పంచ్ సుమలత, నూతలపాడు, ఆదిపూడి, పూనూరు సహకార సంఘాల అధ్యక్షులు కుర్రి బాపిరెడ్డి, యర్రం లక్ష్మారెడ్డి, పావులూరి వాసు, పార్టీ నాయకులు యర్రం నాగిరెడ్డి, వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొసనా రాంప్రసాద్, గాజుల రమేష్, దరువూరి వీరయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement