-
‘పాఠశాలల స్కామ్’ దర్యాప్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రైవేట్ స్కూళ్లకు అక్రమ అనుమతుల స్కామ్లో నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) పోలీసులు దర్యాప్తు పూర్తిచేశారు. నిందితులపై దర్యాప్తు అధికారులు అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించారు. సీసీఎస్ పోలీసులు ఈ చట్టాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఇప్పటివరకు నిందితులుగా తేలిన 9 మందిలో అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులే. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ప్రాసిక్యూషన్కు అనుమతించాలని సర్కారుకు లేఖ రాశారు. గోల్మాల్ ఇలా... ప్రైవేట్ స్కూళ్లు నిర్ణీత కాలానికి అనుమతుల్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పాఠశాలలు అనుమతులు తీసుకుంటూ ఉంటాయి. వీటి ఫైళ్లు డీఈవో కార్యాలయాలతోపాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(ఆర్జేడీఎస్ఈ) కార్యాలయానికి వెళ్తాయి. దరఖాస్తు చేసుకున్న స్కూళ్లు కొంత మొత్తం రుసుమును చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని దరఖాస్తుల్ని హైదరాబాద్ డీఈవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ మన్సూర్ అలీ గోల్మాల్ చేశాడు. ఆయా స్కూళ్ల యాజమాన్యాల నుంచి తీసుకున్న సొమ్మును చలానా రూపంలోకి మార్చకుండా స్వాహా చేశాడు. ఆర్జేడీఎస్ఈ పేరిట నకిలీ అనుమతిపత్రాలు సృష్టించాడు. ఆర్జేడీఎస్ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేసి ప్రస్తుతం మంచిర్యాల డీఈవో ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న మహ్మద్ అబ్దుల్ ఘనీ, ఆర్జేడీఎస్ఈ కార్యాలయం సూపరింటెండెంట్ మహ్మద్ హసన్ సయీద్, డీఈవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ జి.వేణు గోపాల్ సాయంతో వీటిని రూపొందించి పాఠశాలల యాజమాన్యాలకు అందించాడు. ఇవి సరైనవే అని నమ్మిన యాజమాన్యాలు 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకున్నాయి. టెన్త్ పరీక్షల సమయంలో జిల్లాలవారీగా పరీక్షలు రాసేందుకు అనుమతి ఉన్న పాఠశాలల జాబితాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి డీఈవోలు అందిస్తారు. ప్రతి పాఠశాల సైతం తన వద్ద ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్లైన్లో అదే విభాగానికి అప్లోడ్ చేస్తుంది. గత ఏడాది అలా చేసిన సందర్భంలోనే ఈ స్కామ్ బయటపడింది. డీఈవోల నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించిన పరీక్షల విభాగం అందులో లేని స్కూళ్లు సైతం తమ విద్యార్థుల వివరాలను అప్లోడ్ చేసినట్లు గుర్తించింది. విచారణకు ఆర్జేడీ ఆదేశం ప్రైవేట్ స్కూళ్లకు అక్రమ అనుమతుల వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వపరీక్ష విభాగం హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ విచారణ నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన నిందితులపై ఐపీసీతోపాటు అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్లో మన్సూర్, ఘనీ, హసన్, వేణుగోపాల్లను పట్టుకుంది. మహమూద్ అలీ విచారణ నేపథ్యంలోనే 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి 14 స్కూళ్లకు అక్రమంగా ఇచ్చిన ఈఆర్టీని గుంజా శామ్యూల్ జోసఫ్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడైంది. దీంతో శామ్యూల్ను అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. -
డ్రైవర్ చేతివాటం : యజమానికి టోకరా
హైదరాబాద్: యజమానికే టోకరా వేసి రూ.2 లక్షలు స్వాహా చేసిన నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి ఐదు యాపిల్ ఐఫోన్లు, రిస్ట్ వాచీ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డి.రవి బాగ్లింగపల్లిలో నివసించే శైలజా మోహన్ వద్ద డ్రైవర్గా పని చేశాడు. రవి నమ్మకంగా పని చేస్తుండడంతో ఆమె ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలు సైతం అతనితో చేయించేది. దీన్ని ఆసరాగా చేసుకున్న రవి శైలజకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ కోడ్ వివరాలను తీసుకున్నాడు. ఆమె గుర్తింపుకార్డు కాపీని దొంగిలించాడు. జనవరిలో అమెరికాకు వెళ్లిన శైలజ తన సెల్ఫోన్ నంబర్ను డీ యాక్టివేట్ చేశారు. అప్పటికే దురుద్దేశంతో ఉన్న రవి ఆమె గుర్తింపుకార్డు ఆధారంగా డూప్లికేట్ సిమ్కార్డు తీసుకున్నాడు. దీంతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను వినియోగించి ఆన్లైన్లో రూ.2 లక్షల మేర షాపింగ్ చేశాడు. జులైలో తిరిగి వచ్చిన శైలజ ఈ విషయం గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పరిధిలోని సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు రవిని అరెస్టు చేశారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement