-
కశ్మీర్లో ఒక అంగుళం జాగాను వదులుకోం
అల్లర్లలో పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల పాత్ర యువతలో దేశభక్తిని చాటేందుకే తిరంగ యాత్ర నిజాం పేరుతో తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దౌర్బాగ్యం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాన్స్రాజ్ గంగారాం అహైర్ మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి : కశ్మీర్లో ఒక అంగుళం జాగాను కూడా వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కుట్రలో భాగమే కాశ్మీర్ అల్లర్లని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాన్స్రాజ్ గంగారాం అహైర్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన తిరంగా యాత్ర బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కశ్మీర్లో రెండు శాతం యువతను ప్రేరేపిస్తున్నాయని, అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్లో 135 మంది స్కూల్ విద్యార్థులను ఉగ్రవాదులు కాల్చి చంపినా కనీసం ఉగ్రవాదంపై అక్కడి ప్రధాని మాట్లాడలేదన్నారు. భారత దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు కశ్మీర్ను వదులుకోరని, ఎట్టిపరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొని తీరుతామన్నారు. కశ్మీర్తో పాటు దేశంలో ఉన్న యువతకు నాదేశం అనే జాతీయ భావాలను, దేశ భక్తిని పెంపొందించడం కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరంగాయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఉగ్రవాదులను అణగదొక్కే శక్తి భారత్కు ఉందని, దేశ సరిహద్దులో భారత సైనికులు తమ కుటుంబాల కన్నా దేశాన్ని ప్రేమిస్తూ పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా సైనికులు పోరాటాలు చేస్తున్నారని, దేశంలోని యువత వారి పోరాటానికి స్ఫూర్తినివ్వాలని అన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన భారతదేశాన్ని దేశంలోని యువత రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను కశ్మీర్కు పంపుతున్నారని అన్నారు. నిజాం పేరుతో తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దౌర్బాగ్యమని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు. రాష్ట్ర అభివృద్ధి, సమగ్రతకు ఈ పరిస్థితి మంచిది కాదన్నారు. దేశంలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉందని, దేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం రాగా సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న జరుపుకుంటున్నా, తెలంగాణలో సెప్టెంబర్ 17ను సైతం జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు పట్టణంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రసహాయ మంత్రి, నాయకులు బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావునామాజి, ప్రధానకార్యదర్శి టి.ఆచారి, కార్యదర్శులు ప్రేమేందర్రెడ్డి, శాంతికుమార్, బిజెపి మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రతంగ్పాండురెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణకు ఎరువుల ఫ్యాక్టరీ
- ముందుకు వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం హన్మకొండ(వరంగల్ జిల్లా): కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఎరువుల ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమేందర్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో మూసి వేసిన కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు మోదీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి కానున్న ఎరువులను కిసాన్ బ్రాండ్తో మార్కెట్లోకి విడుదల చేయనున్నారని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రాంతాన్ని త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహీర్, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి రామగుండం సందర్శించనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. విపత్తు సహాయ నిధుల నుంచి నిధులు వాడుకోవడానికి కేంద్రం సడలింపు ఇచ్చిందని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement