-
యూపీలో వర్షాలకు 58 మంది బలి
లక్నో: భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లో శనివారం ఒక్కరోజే 31 మంది మృతిచెందారు. దీంతో మూడు రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 58 మందికి పెరిగింది. సహరాన్పూర్లో 11 మంది, మీరట్లో 10 మంది మరణించారు. మీరట్లో 23 సెం.మీల వర్షపాతం నమోదైంది. శారద, గాగ్రా నదులు ప్రమాదకర స్థాయిల్లో ప్రవహిస్తున్నట్లు కేంద్ర జలవనరుల కమిషన్ తెలిపింది. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, అందులో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఇద్దరు యాత్రికులు వరదల్లో కొట్టుకుపోయారు. వందల్లో వరద మృతులు.. ప్రస్తుత రుతుపవనాల సీజన్లో ఇప్పటి వరకు వర్షాలు, వరదల్లో చిక్కుకుని ఆరు రాష్ట్రాల్లో 537 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ అత్యవసర ప్రతిస్పందనా కేంద్రం(ఎన్ఈఆర్సీ) తెలిపింది. మహారాష్ట్రలో గరిష్టంగా 139 మంది మృతిచెందగా, కేరళలో 126 మంది, పశ్చిమ బెంగాల్లో 116 మంది, ఉత్తరప్రదేశ్లో 70 మంది, గుజరాత్లో 52 మంది, అసోంలో 34 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 26 జిల్లాలు, పశ్చిమబెంగాల్లో 22 జిల్లాలు, అసోంలో 21 జిల్లాలు, కేరళలో 14 జిల్లాలు, గుజరాత్లో 10 జిల్లాలు వరదలకు గురయ్యాయి. అసోంలో సుమారు 2.17 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. యమున వరదలపై అత్యవసర భేటీ యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించారు. హాత్ని కుంద్ బ్రిడ్జ్ నుంచి హరియాణా 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. ఆదివారం ఆ నీరు ఢిల్లీకి చేరుకునే అవకాశాలున్నాయి. -
రీ ఇంజనీరింగ్ అంటే తెలుసా?
⇒ కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీశ్రావు ప్రశ్న ⇒ ప్రభుత్వం చేసే ఏ పనినైనా గుడ్డిగా వ్యతిరేకించడమేనా? సాక్షి, మహబూబాబాద్: ప్రాజెక్టుల నిర్మాణం వల్ల జరిగే ముంపును తగ్గిస్తూ నీటి సామర్థ్యం పెంచేందుకు కేంద్ర జలవనరుల సంఘం చేసిన సూచనల మేరకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఉగ్గంపల్లిలోని స్థానిక ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ నివాసంలో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2పై అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టు తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, అందులో తీసుకోగలిగే నీరు 63 టీఎంసీలు మాత్రమేనని 2015, మార్చి 4న కేంద్ర జనవనరుల సంఘం రాష్ట్రానికి సూచించిందని తెలిపారు. దీంతో తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి పోయామన్నారు. 16 లక్షల ఎకరాల నీటిని ఇచ్చే ప్రాణహితలో రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉందని, అందుకే మలన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను రీ ఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అలాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో మూడు చోట్ల కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉండి కూడా బ్యారేజీ కట్టేందుకు ఒప్పించలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీళ్లు రాకుండా రూపకల్పన జరిగితే ఒక్కనాడు కూడా ఆలోచించకుండా వారు ఏది చెప్పితే అది ఒప్పుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని హరీశ్రావు తెలిపారు. కంతనపల్లి ప్రాజెక్ట్తో 20 తండాలు, 11 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయనే ఉద్దేశంతో ఒక్క తండా.. ఒక్క ఎకరం కూడా మునగకుండా రీ ఇంజనీరింగ్తో తుపాకులగుడెం వద్ద బ్యారేజీ కడుతున్నామని వివరించారు. కరీంనగర్ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ వలన ఆరు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఆ గ్రామాలు ముంపునకు గురికాకుండానే 52 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం కల్పించడం వల్ల తోటపల్లి ప్రాజెక్ట్ను రద్దు చేశామన్నారు. తోటపల్లిని కట్టండి ఆరు ఊర్లను ముంచండి అని ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ధర్నాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంను పాత పద్ధతిలోనే కడితే రెండు నష్టాలు జరుగుతాయని ఉద్దేశంతోనే శ్రీశైలంకు మార్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. -
తెరుచుకున్న బాబ్లీ గేట్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను కేంద్ర జలవనరుల సంఘం సభ్యుల సమక్షంలో శుక్రవారం ఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 28న మూసి వేయాలి. త్రిసభ్య కమిటీ సభ్యులైన ఎస్సారెస్పీ ఈఈ రామారావు, మహారాష్ట్ర ఈఈ లవరాలే, సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్ల పర్యవేక్షణలో ఈ గేట్లను ఎత్తారు. దీంతో గోదావరిలో 6 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, స్థానికంగా కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్లోకి స్వల్ప వరద నీరు వచ్చి చేర డంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. - రెంజల్/బాల్కొండ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement