-
టీటీడీ పాలకవర్గ సమావేశం ప్రారంభం
టీటీడీ పాలకవర్గ సమావేశం మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య సమావేశ మందిరంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ప్రధాన ఎజెండాగా రానుంది. -
హుండీకి సీలువేయడంలో నిర్లక్ష్యం
-శ్రీవారి ఆలయ అధికారులపై మండిపడ్డ టీటీడీ చైర్మన్ - విజిలెన్స్ విచారణకు ఆదేశం సాక్షి, తిరుమల భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీవేంకటేశ్వర స్వామివారికి ముడుపులు, కానుకల రూపంలో చెల్లించిన హుండీ భద్రపరిచే విషయంలో తిరుమల ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. కానుకలతో నిండిన హుండీకి ఆలయ నిబంధనల ప్రకారం సీలు వేయకుండా వదిలేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. దీనిపై టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆలయంలో రోజూ రూ.2 నుండి 3.5 కోట్ల వరకు హుండీ (కొప్పెర) కానుకలు లభిస్తున్నాయి. ఇలా ఏటా టీటీడీకి రూ.వెయ్యికోట్ల నగదు, రూ.300 కోట్ల విలువైన బంగారు, వెండి, ఇతర ఆస్తులు లభిస్తున్నాయి. భక్తుల రద్దీ బట్టి ఆలయంలో 7 నుండి 10 హుండీలు కానుకలతో నిండుతుంటాయి. ఇలా కానుకలతో నిండిన హుండీని సోమవారం ఉదయం 10.20 గంటలు తొలగించి, దానిస్థానంలో కొత్త హుండీ ఏర్పాటు చేశారు. తొలగించిన హుండీని ఆలయ నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో ఉన్న సంబంధిత ఆలయ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో హుండీకి తాడుతో గట్టిగా కట్టాలి. అధికారితోపాటు భక్తుల సమక్షంలో లక్కతో ఆలయ అధికారిక సీలు వేయాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు పాటించలేదు. నిర్లక్ష్యంగా కేవలం జనపనార పురిదారంతో హుండీని చుట్టి పక్కన పెట్టేశారు. తర్వాత ఉదయం 11.20 గంటలకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హుండీ వద్దకు వచ్చి కానుకలు సమర్పించారు. సమీపంలోనే నిండిన హుండీ సీలు లేకుండా , కేవలం పురిదారంతో మాత్రమే ఉండటాటాన్ని గుర్తించారు. ఈ ఘటనపై చైర్మన్ సంబంధిత ఆలయ అధికారులపై మండిపడ్డారు. వీఎస్వో రవీంద్రారెడ్డిని అక్కడికి పిలిపించి జరిగిన సంఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. భక్తులు సమర్పించే కానుకల్లోనూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? అంటూ అక్కడి సిబ్బందిని మందలించారు. భక్తులు సమర్పించే కానుకలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. హుండీ కానుకలు భద్రత, లెక్కింపుల్లో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రత్యేక సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం. -
షుగర్ ఫ్యాక్టరీ వద్ద టీటీడీ ఛైర్మన్ హల్చల్
తిరుపతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకలకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో సాక్షాత్తూ టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆయన అనుచరులు హల్చల్ సృష్టించారు. నిండ్రలోని ప్రొడన్షియల్ షుగర్ ఫ్యాక్టరీపై చదలవాడ, ఆయన అనుచరులు గురువారం దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షుగర్ ఫ్యాక్టరీ తాళాలు పగులగొట్టి లోపలికి చొచ్చుకెళ్లిందుకు యత్నించడంతో పాటు గెస్ట్హౌస్ అద్దాలు ధ్వంసం చేశారు. చదలవాడ, తన అనుచరులతో గెస్ట్హౌస్లోనికి ప్రవేశించి తిష్ట వేశారు. కవరేజికి వెళ్లిన మీడియా సిబ్బందిపై చదలవాడ అనుచరుల దాడికి దిగారు. దీనిపై ఫ్యాక్టరీ సిబ్బంది నగరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా ఆయన దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్ తీరుపై ఫ్యాక్టరీ సిబ్బంది, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. -
జూబ్లీహిల్స్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
టీటీడీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో శ్రీవారి దేవాలయం నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ పాలక మండలి సభ్యులు కె. రాఘవేంద్రరావు, చింతల రాంచంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుచరిత, అరికెల నర్సారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది వ్యవధిలో ఇక్కడ శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. తిరుమలలో జరిగే ప్రతి వేడుకలాగే ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తిరుమలలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని గత కొన్ని నెలల నుంచి తిరుమల భక్త జనసందోహంతో ఊటీలా కిటకిటలాడుతున్నదని అన్నారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగించడమే లక్ష్యంగా సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. తిరుమలలో తెల్లవారుజామున 3 గంటలకు పూజలు ప్రారంభమైనట్టుగానే జూబ్లీహిల్స్ ఆలయంలో కూడా ఆ తరహాలో ప్రారంభమవుతాయని చెప్పారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు టీటీడీ చేస్తున్న కషిని కొనియాడారు. భావితరాలకు వేదాలను అందించేందుకు తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. కురుక్షేత్ర, కన్యాకుమారిలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, తెలంగాణ ప్రాంత సలహా మండలి చైర్మన్ చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ తన నియోజక వర్గంలో భారీ ఎత్తున శ్రీవారి ఆలయం నిర్మితం కావడం ఆనందంగా ఉందన్నారు. తాను చెప్పగానే నిధులు మంజూరు చేయించి ఆలయ భూమి పూజకు విచ్చేసిన చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం నిర్మాణంతో జూబ్లీహిల్స్కే ఆధ్యాత్మిక శోభ వస్తుందని పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement