-
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్తో సహా అన్ని చైన్ రిటైల్లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
రైల్లో అలారం చైన్కు లగేజీ తగిలిస్తే కేసు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యాగులు, సెల్ఫోన్లను అలారం చైన్ పుల్లింగ్ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్ల కోచ్లను ఎల్బీహెచ్ కోచ్లుగా ఆధునీకరించారు. అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్ స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ (పీఈఏఎస్డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్ఫోన్ను వేలాడదీస్తున్నారు. ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం -
తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్లోనే..
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ( Reliance Retail Ltd ) వ్యాల్యూ అపరెల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన టాటా జూడియో ( Tata Zudio ) చైన్, ల్యాండ్మార్క్ గ్రూప్ యాజమాన్యంలోని మ్యాక్స్, షాపర్స్ స్టాప్కు చెందిన ఇక్ ట్యూన్కి పోటీగా కొత్త బ్రాండ్ యూస్టా ( Yousta )ని ప్రారంభించింది. అన్ని ఉత్పత్తులు రూ. 999 లోపే సమకాలీన టెక్-ఎనేబుల్డ్ స్టోర్ లేఅవుట్లతో, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరసమైన ధరలకు యూస్టా హై ఫ్యాషన్ ఉత్పత్తులను అందిజేస్తుందని కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్లో అన్ని ఉత్పత్తులు రూ. 999 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అందులోనూ ఎక్కువ భాగం రూ. 499 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం విశేషం. హైదరాబాద్లో తొలి స్టోర్ రిలయన్స్ యూస్టా తమ తొలి స్టోర్ను హైదరాబాద్లోని శరత్ సిటీ మాల్లో ప్రారంభించింది. యూస్టా స్టోర్లను అనేక టెక్ టచ్ పాయింట్లను అమర్చారు. క్యూఆర్ స్క్రీన్లు, సెల్ఫ్-చెక్అవుట్ కౌంటర్లు, కాంప్లిమెంటరీ వైఫై, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ యూస్టా ఉత్పత్తులను అజియో ( Ajio ), జియో మార్ట్ ( JioMart ) ద్వారా కూడా ఆన్లైన్లో యాక్సెస్ చేయవచ్చు. -
గెజిట్లో ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం
ఆన్లైన్ రమ్మీ.. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఈ పదమే ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకుల నోట్లో ఎక్కువగా నలిగిందంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ఈ ఆటకు బానిసై అప్పులపాలైన వారు ఎందరో..! ఇక రుణఒత్తిడి భరించలేక బలవన్మరణాలకు పాల్పడిన వారూ పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక తర్జనభర్జనలు, విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత ఎట్టకేలకూ ఆన్లైన్ రమ్మీ నిషేధం బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు.మంగళవారం ఈ మేరకు గెజిట్లో ప్రచురించడంతో ఇకపై ఆన్లైన్ పేకాట ఆడితే.. తాటతీస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, చైన్నె: ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని ప్రభుత్వ గెజిట్లో మంగళవారం ప్రకటించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదంతో న్యాయశాఖ కార్యదర్శి గోపి రవికుమార్ సంతకంతో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ, సమగ్ర వివరాలను,శిక్షలు, కమిషన్ ఏర్పాటు గురించి గెజిట్లో వివరించారు. దీంతో కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక చేసేందుకు సీఎం ఎంకే స్టాలిన్ కార్యాచరమ ప్రారంభించారు. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీకి బానిసై, అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య తాజాగా 43కు చేరిన విషయం తెలిసిందే. ఈ గేమింగ్ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన చట్టాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. దీంతో గత నెల మరోసారి అసెంబ్లీ వేదికగా చట్టానికి మెరుగులు దిద్ది సభ ఆమోదంతో రాజ్భవన్కు పంపించారు. దీనిని కూడా ఆమోదించేందుకు గవర్నర్ కాలయాపన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. గవర్నర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకురావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఈ చట్టాన్ని ఆమోదిస్తూ గవర్నర్ ఆర్ఎన్రవి నిర్ణయం తీసుకున్నారు. గెజిట్లో చట్టం వివరాలు.. ఈ చట్టంలోని సమగ్ర వివరాలను 13 పేజీలలో పొందు పరిచారు. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి బెట్టింగ్ గేమింగ్లపై రాష్ట్రంలో నిషేధించినట్లు వివరించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన పక్షంలో మూడు కేటగిరీలుగా విభజించి శిక్ష విధించనున్నారు. గేమ్ ఆడే వారు, ప్రకటనలు చేసే వారు, నిర్వాహకులుగా విభజించి అందరికీ వివిధ రకాల శిక్షలను, జరిమానాలను విధించనున్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు కానుంది. ఈ కమిషన్కు చైర్మన్, సభ్యులు ఉంటారు. అలాగే ఈ గేమింగ్ వ్యవహారలపై సైబర్ క్రైం నిఘా ఉంచనుంది. తమిళనాడులో ఈ గేమింగ్ నిషేధం వివరాలను సంబంఽధిత సంస్థలకు తొలుత నోటీసుల ద్వారా తెలియజేయనున్నారు. అప్పటికీ ఆ యా సంస్థలు గేమింగ్లు నిర్వహిస్తే తొలుత సైబర్ క్రైం కొరడా ఝుళిపిస్తుంది. అలాగే సమగ్ర వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్కు అందజేస్తుంది. ఈ కమిషన్కు సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలూ ఉంటాయి. తొలిసారిగా గేమ్ ఆడి పట్టుబడే వారికి 3 నెలలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తారు. ఫేస్బుక్ వంటి వ్యక్తిగత సామాజిక మాధ్యమాల పేజీల్లోకి ప్రకటనల రూపంలో నిషేధిత బెట్టింగ్ గేమింగ్ సమాచారం పంపిన పక్షంలో, ఆ ప్రకటనదారుకు, నిర్వహకులకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 లక్ష వరకు జరిమానా విధించనున్నారు. మళ్లీ మళ్లీ పట్టుబడిన పక్షంలో ఐదేళ్లు వరకు జైలు, రూ. 20 లక్షల వరకు జరిమానా విధించే విధంగా కఠినంగా వ్యవహరించనున్నారు. కమిషన్ ఏర్పాటుకు కార్యాచరణ ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు, చట్ట నిపుణులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలతో పదవీ విరమణ పొందిన సీనియర్ ఐఏఎస్, ఐజీ స్థాయి పోలీసు అధికారులు, ఆన్లైన్ రంగంలోని నిపుణులను ఈ కమిషన్లో సభ్యులుగా నియమించనున్నారు. ఈ జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుతో ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టే. గేమింగ్లను క్రమబద్ధీకరించే విధంగా ఈ కమిషన్ కొరడా ఝుళిపించనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు ఆన్లైన్ రమ్మీ తదితర బెట్టింగ్ గేమింగ్ల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement