-
ఈ–చలానా కేసులో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్ అరెస్టు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసు డిపార్టుమెంట్లో జరిగిన ఈ–చలానా కుంభకోణంలో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్ను అరెస్టు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు తెలిపారు. మంగళవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం మొత్తం 2018–19లో జరిగిందని తమ విచారణలో స్పష్టమైందన్నారు. 2018లో అప్పటి డీజీపీ సాంబశివరావు ఎటువంటి టెండర్లు లేకుండానే తొమ్మిది జిల్లాల్లో మోటారు వాహనాల చలానాల వసూళ్లను డేటా ఎవాన్ సొల్యూషన్స్కు అప్పగించారని, ఆ తర్వాత 2019లో కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిన ఆ సంస్థకు కట్టబెట్టారన్నారు. ఆడిటింగ్ జరగకుండానే టెండర్ కట్టబెట్టడంతో రూ. 36.53 కోట్లు దారి మళ్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. డేటా ఎవాన్ సొల్యూషన్స్తో పాటు రోజర్ పీఈ అనే సంస్థ ద్వారా అవకతవకలకు తెరలేపారన్నారు. చలానాల ద్వారా కలెక్ట్ అయిన మొత్తం డైరెక్ట్గా డీజీ అకౌంట్కు వెళ్లకుండా రేజర్పే ద్వారా రోజర్ పీఈకు మళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ విధంగా దారిమళ్లిన సొమ్ముతో అమెజాన్ క్లౌడ్ సర్వీస్ను కొనుగోలు చేసి దాని ద్వారా 50 నుంచి 60 సంస్థలకు సర్విసులు ఇస్తున్నారని చెప్పారు. ఈ సర్వీసుల ద్వారా సుమారు రూ. 25 కోట్లు డేటా ఎవాన్ సొల్యూషన్ సంస్థకు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేసేలా కోర్టు ద్వారా చర్యలు చేపట్టామన్నారు. 2019 తర్వాత సుమారు 16 ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించామని, వాటిని సీజ్ చేసి ఎటువంటి లావాదేవీలు జరగకుండా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీరియస్గా ప్రభుత్వం.. ప్రజల సొమ్ము ఈ విధంగా దారి మళ్లడంపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని పాలరాజు చెప్పారు. 2018 నుంచి ఇప్పటివరకూ ఎంత సొమ్ము, ఏ ఖాతాలకు మళ్లింది అనే అంశాలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కొంత డబ్బు పలు ప్రైవేటు ఖాతాలకు మళ్లించారని, ఆ ఖాతాలను కూడా సీజ్ చేశామని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రస్తుత డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారన్నారు. టెండర్ కట్టబెట్టడంలో ఎవరు బాధ్యులనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్లో ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–చలానా వసూలు చేయకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఐసీ ద్వారా వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కేసు విషయంలో కంపెనీలోని మిగిలిన డైరెక్టర్ల పాత్రపై కూడా విచారణ జరిపి వారి తప్పు ఉంటే అరెస్టు చేస్తామని ఐజీ పాలరాజు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
రైటర్లు రాసిన స్కామ్.. 10 మంది సబ్ రిజిస్ట్రార్లపై వేటు
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు.. 2021 మే 31.. గుడివాడకు చెందిన దారం మాణిక్యాలరావు మండవల్లి మండలం పోలుకొండలో ఎకరం భూమి కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ను కలిశాడు. ఆ భూమి విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.90,250 కట్టాలని చెప్పడంతో ఆ డబ్బులు మాణిక్యాలరావు ఇచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ సీఎఫ్ఎంఎస్లో జమయ్యేలా ఆన్లైన్లో చలానా కట్టాడు. రూ.78,000, రూ.12,000, రూ.250 చొప్పున మూడు చలాన్ల ప్రింటవుట్లు తీసి డాక్యుమెంట్తో కలిపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపాడు. సబ్ రిజిస్ట్రార్ ఆ చలాన్ల ప్రింట్లు చూసి మొత్తం సొమ్ము కట్టినట్లు నిర్థారించుకుని రిజిస్ట్రేషన్ చేసేశారు. పని పూర్తయిపోయింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట కానీ అక్కడ వాస్తవానికేం జరిగిందో తెలుసా..? చలాన్లు కట్టేటపుడే ఆ డాక్యుమెంట్ రైటర్ అతిపెద్ద కుట్రకు తెరతీశాడు. రూ.78,000 జమ చేసినట్లు మాణిక్యాలరావుకు ప్రింటవుట్ ఇచ్చినా... నిజానికి తను ఆన్లైన్లో చెల్లించింది రూ.780 మాత్రమే. కానీ కంప్యూటర్లో ఆ చలాన్ పీడీఎఫ్ కాపీని మార్ఫింగ్ చేశాడు. 780 పక్కన రెండు సున్నాలు చుట్టి రూ.78,000 చేసేశాడు. అదే ప్రింటవుట్ను తీసిచ్చాడు. దాన్నే సబ్ రిజిష్ట్రార్కు పంపాడు. మరి సబ్ రిజిష్ట్రార్ ఎలా నమ్మారు? దాన్నెలా నిర్ధారించుకున్నారు? ఈ ప్రశ్నలు సహజం. అటు సీఎఫ్ఎంఎస్కు రకరకాల చెల్లింపులు వస్తుంటాయి కాబట్టి అక్కడెవరికీ వాస్తవంగా రావాల్సిందెంతో...ఎంత వచ్చిందో తెలిసే అవకాశం లేదు. సీఎఫ్ఎంఎస్కు నిజంగా ఎంత చెల్లించారో ఆన్లైన్లో చూసే అవకాశం ఈ సబ్ రిజిస్ట్రార్కు లేదు. ఇదిగో... ఈ వీక్పాయింట్నే డాక్యుమెంట్ రైటర్లు పట్టుకున్నారు. చలాన్లలో తాము చెల్లించిన సొమ్ము పక్కన సున్నాలు పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు. ఆ డబ్బులన్నీ మింగేశారు. ఇలా ఒక్కరు కాదు... ఒక చోట కూడా కాదు. డాక్యుమెంట్ రైటర్ల నెట్వర్క్ ఒకరి నుంచి మరొకరు ఈ మోసం ఎలా చేయాలో తెలుసుకున్నారు. అంతా గూడుపుఠానీ జరిపి కోట్లు కాజేశారు. తాజాగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు జరపటంతో ఈ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎందుకు తెలుసుకోలేకపోయారంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో అధికారగణం కదిలింది. ఇకపై ఇలాంటి మోసాలు జరగక్కుండా ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తేవటమే కాక... ఇప్పటివరకూ జరిగిన అక్రమ లావాదేవీలపై దృష్టిపెట్టింది. సబ్ రిజిస్ట్రార్లపైనా వేటు పడుతోంది. పోయిన సొమ్ము సైతం కొంత కొంతగా రికవరీ అవుతోంది. మున్ముందు మరింత భారీగా తనిఖీలు జరుపుతామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ కుంభకోణం పూర్వాపరాలివీ... రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన ఈ కుంభకోణంలో ఇప్పటిదాకా రూ.5.85 కోట్లు పక్కదారి పట్టినట్లు తనిఖీల్లో వెల్లడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నకిలీ చలాన్ల బాగోతం వెలుగు చూసింది. ఒక్కొక్క కార్యాలయాన్నీ తనిఖీ చేస్తున్న కొద్దీ ఇది ఒక్కచోటికే పరిమితం కాలేదని, పలు ప్రాంతాలకు వ్యాపించిందని వెల్లడయింది. వ్యవహారం బయటపడ్డ వెంటనే అధికారులపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే లోపాలు సరిదిద్దాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి గండి పడిన ఆదాయాన్ని రికవరీ చేయాలని కూడాస్పష్టం చేశారాయన. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చురుగ్గా కదిలి డొంక మొత్తాన్ని కదిలించారు. రోజుల వ్యవధిలోనే కొన్ని లక్షల డాక్యుమెంట్లను పరిశీలించారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు దారి మళ్లినట్లు కనుగొన్న మొత్తంలో ఇప్పటికే 2.86 కోట్లను రికవరీ చేశారు. ఇందులో కొందరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని తేలటంతో 10 మందిని సస్పెండ్ చేశారు. 12 క్రిమినల్ కేసులు పెట్టారు. అంతేకాదు! స్కామ్కు సూత్రధారులుగా ఉన్న పలువురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేయించారు. మొదట ఈ వ్యవహారం కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయటపడగా... అనుమానం వచ్చిన రిజిష్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం పలుచోట్ల తనిఖీలు జరపడంతో మరిన్ని చోట్ల అక్రమాలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా గజపతినగరం, విశాఖ జిల్లా నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఆకివీడు, గునుపూడి, ఆచంట, పెనుగొండ, కృష్ణాజిల్లా గాంధీనగర్, నందిగామ, గుణదల, పటమట, మండవల్లి, గుంటూరు జిల్లా మంగళగిరి, వైఎస్సార్ కడప జిల్లా కడప, కడప రూరల్, కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మార్ఫింగ్ వ్యవహారాలు బయటపడ్డాయి. అత్యధికంగా కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు వెల్లడయింది. చదవండి: సీఎం జగన్కు రాఖీలు కట్టిన మహిళా నేతలు సీఎఫ్ఎంఎస్తో కార్డ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థకి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్) వ్యవస్థను పూర్తిగా అనుసంధానం చేయకపోవటమే ఈ కుంభకోణానికి కారణమైంది. ఎందుకంటే సీఎఫ్ఎంఎస్కు చలాన్ల ద్వారా ఎంత చెల్లించారన్నది సబ్ రిజిస్ట్రార్లకు కనిపించదు. భౌతికంగా తమ చేతికి వచ్చిన ప్రింటవుట్ను చూసి వారు నిర్ధారించుకునేవారు. ఇక్కడే డాక్యుమెంట్ రైటర్లు బడా మోసానికి తెరతీశారు. తాజా కుంభకోణం నేపథ్యంలో ఈ తప్పు మళ్లీ జరక్కుండా వెంటనే సీఎఫ్ఎంఎస్కి చెల్లించే ఛలానాలు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ సిస్టమ్లో కనపడేలా నెట్వర్క్ని అనుసంధానించారు. తొలుత కార్వేటి నగరం, కుప్పం, చీరాల సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. విజయవంతం కావటంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 294 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీంతో తమ చేతిలో ఉన్న చలానా నెంబరు ప్రకారం అందులో పేర్కొన్న సొమ్ము సీఎఫ్ఎంఎస్కు జమయిందో లేదో రియల్టైమ్లో నిర్ధారించుకునే అవకాశం సబ్ రిజిస్ట్రార్లకు వచ్చింది. తేడాలేమైనా ఉంటే అక్కడే పట్టేసుకోవచ్చు. డాక్యుమెంట్ రైటర్ల నెట్వర్కే మూలం!! ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు డాక్యుమెంట్ రైటర్లేనని స్పష్టంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల వారికి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే ఆపరేటర్లు, సిబ్బంది తోడయ్యారు. అక్కడక్కడా సబ్ రిజిస్ట్రార్లు కూడా వారితో చేయి కలిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిజానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లదే హవా. ఎవరైనా వారి దగ్గరకే వెళ్లాలి. డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, చలానాలు తీయడం వంటి పనులు కష్టంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే సాధారణ వ్యక్తులు వీరిపైనే ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అధికారులను కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మెల్లగా వీళ్లంతా ఒక నెట్వర్క్లా కూడా తయారయ్యారు. అందుకే చలానాల మార్ఫింగ్ కుంభకోణం ఒక్కచోటకే పరిమితం కాకుండా... అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. అధికారులు చురుగ్గా తనిఖీలు చేస్తుండటంతో ఇపుడు అక్రమార్కుల గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లోనూ చేపడతామని, రాండమ్గా భారీ ఎత్తున డాక్యుమెంట్లను తనిఖీ చేస్తామని, అవసరమైన చోట విస్తృత స్థాయి తనిఖీలకు దిగుతామని అధికారులు చెబుతున్నారు. ఇక అవకతవకలకు ఆస్కారం ఉండదు – ఎంవీ శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ ఛలానాల మార్ఫింగ్ వ్యవహారం బయటపడగానే అప్రమత్తమయ్యాం. అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేసి అక్రమాలు గుర్తించాం. వెంటనే కార్డ్ సిస్టమ్లో ఛలానాలు కనపడేలా మార్పులు చేశాం. ఇకపై మార్ఫింగ్కు అవకాశం ఉండదు. వాస్తవానికి గతంలోనే ఈ మార్పులు చేయాలని పైలెట్ ప్రాజెక్టు చేపట్టాం. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ఈలోపు ఈ వ్యవహారాలు బయటపడడంతో ఎన్ఐసీ ద్వారా వెంటనే సీఎఫ్ఎంఎస్ ఛలానాల సాఫ్ట్వేర్ని కార్డ్ సిస్టమ్కి అనుసంధానించాం. -
రిజిస్ట్రేషన్ కుంభకోణంపై విచారణ
ఆదిలాబాద్, న్యూస్లైన్ : నిర్మల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చలాన్ల కుంభకోణంపై ఆ శాఖ డీఐజీ వీవీ నాయుడు విచారణకు ఆదేశించారు. నలుగురు అధికారుల్లో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు సాయినాథ్, శ్రీధర్రాజు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు రవికాంత్, చంద్రశేఖర్లను ఇందుకోసం నియమించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, అతని సోదరుడితో కలిసి ఫోర్జరీ, బోగస్ చలాన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడిన విషయం విధితమే. దీనిపై ఈ నెల 13న సాక్షిలో ‘రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం కల్గించింది. మూడు నెలల చలాన్ల పరిశీలనలో రూ.9 లక్షల అక్రమం బయటపడింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుందన్న అనుమానాల నేఫథ్యంలో రూ. కోటికి పైగా స్వాహా చేశారని అనుమానిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నియమాకం నుంచి మొదలుకొని జరిగిన రిజిస్టేషన్ డాక్యూమెంట్లను విచారణ అధికారులు పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా ఎంత ఆదాయం కోల్పోయామో తేటతెల్లం అవుతుందని భావిస్తున్నారు. కాగా నిర్మల్ పోలీసులు ఈ కేసులో విచారణ మొదలుపెట్టారు. నిర్మల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సంబంధిత డాక్యూమెంట్లు అందజేయలని పోలీసులు అడగడంతో బుధవారం వాటిని అధికారులు అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరించనున్నారు. తద్వార అసలు సూత్రధారులు ఎవరు అనే కోణం లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి 2008 సంవత్సరం నుంచి జిల్లాలోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్నాడు. ఇదివరకు ఆదిలాబాద్, భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేశాడాని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా కార్యాలయాల్లోనూ పరీశీలన చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement