-
రైతు రుణమాఫీ పేరుతో మోసం...
-
మేకులు కొడితే దోషం పోతుందంట..! బురిడీ బాబా బాగోతం బట్టబయలు
సాక్షి, కృష్ణాజిల్లా: నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. 35 లక్షలతో కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో మౌలాల అనే దొంగ బాబాను రజనీకి ఓ భక్తురాలు పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలంటూ మౌలాల సూచించాడు. రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు పాతి పెట్టిన మౌలాల.. నమ్మకం కుదిరేందుకు 100 గంజాలు అమ్ముడుపోయేలా చేశాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడం మొదలుపెట్టాడు. మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ.. ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది. చదవండి: నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య -
చిక్కడపల్లి టు చైనా!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ.28 లక్షలు మోసపోయిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ కేసు తీగలాగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దుబాయ్ మీదుగా చైనాలో ఉన్న డొంక కదిపారు. ఈ కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన నలుగురు హైదరాబాదీయులు సైబర్ నేరాల్లో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడిన కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులకు రివార్డులు అందించారు. చిక్కడపల్లి వాసి శివకుమార్ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్లో రూ.28 లక్షలు కోల్పోయి మార్చిలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ బాధితుడి నగదు ఆరు బ్యాంకు ఖాతాల్లోకి, వాటి నుంచి మరో 48 అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు. వీటి విషయం జాతీయ స్థాయిలోని సైబర్ కో–ఆర్డినేషన్ సెంటర్కు అందించగా...వాటిలో దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి మరో రూ.584 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సమాధానం వచ్చింది. ఆ బ్యాంకు ఖాతాల్లో రాధిక మర్చంట్స్ పేరుతో ఉన్న షెల్ కంపెనీది కూడా ఉంది. ఈ అకౌంట్తో లింకై ఉన్న సెల్ నెంబర్ నగరానికి చెందిన మునావర్ వాడుతున్నట్లు తెలియడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనతో పాటు నగర వాసులైన ఆరుల్ దాస్, సమీర్ ఖాన్, ఎస్.సుమేర్లను వికాస్, మనీష్, రాజేష్లు లక్నో పిలింపించారని బయటపెట్టాడు. వీరి ముంబై హవాలా నెట్వర్క్లో భాగమైన నయీమ్... సమీర్కు బంధువు కావడంతో పరిచయాలు ఏర్పడ్డాయి. మూడు నెలలు లక్నోలో ఉన్న నలుగురు నగర వాసులూ నకిలీ గుర్తింపు కార్డులతో 33 షెల్ కంపెనీలు, 65 బ్యాంకు ఖాతాలు తెరిచి వారికి అప్పగించి వచ్చారని తేలింది. వీళ్ళకు ఒక్కో ఖాతాకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టిందని బయటపెట్టారు. వీరందించిన ఖాతాల్లో మరో రూ.128 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తం రూ.713 కోట్లు ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్లో దేశం దాటేశాయని అధికారులు తేల్చారు. నగరం, ముంబైల్లో ఉన్న వారిని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులకు అహ్మదాబాద్కు చెందిన ప్రకాష్, కుమార్ వ్యవహారాలు తెలిశాయి. కీలకమైన ప్రకాష్ అనునిత్యం దుబాయ్, చైనాలకు వెళ్లి వస్తున్నాడని గుర్తించారు. జూన్ 30న చైనా నుంచి వచ్చిన ఇతగాడు తన నెట్వర్క్లోని ఓ వ్యక్తితో వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇతడి నెంబర్ తెలుసుకున్న అధికారులు వాట్సాప్ యాక్టివేట్ అయిన నెట్వర్క్ గుర్తించారు. దీనికి లింకైన నెంబర్ లోకేషన్ ఆధారంగా ప్రకాష్ ముంబైలో ఉన్నట్లు పసిగట్టారు. హాలిడే కోసం అక్కడకు వెళ్ళిన ఇతడితో పాటు కుమార్ను పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. వీరి నుంచి భారీగా ల్యాప్టాప్స్, ఫోన్లు, షెల్ కంపెనీల లెటర్ హెడ్స్ కూడా స్వాదీనం చేసుకున్నారు. కాగా ఇలాంటి నేరగాళ్లు, నేరాలపై రిజర్వుబ్యాంకు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం ఇస్తామని సీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్తో సహజీవనం చేసి..
నరసరావుపేట టౌన్(పల్నాడు జిల్లా): పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి దళిత యువతిని దగా చేసిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్ బండారం బట్టబయలైంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటలోని చంద్రబాబు కాలనీకి చెందిన ఓ దళిత యువతి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేది. ఆమెకు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెంకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్తో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. తనకు వివాహం కాలేదని నమ్మబలికిన నవీన్ ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో తక్కువ కులం దానివని దూషిస్తూ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కేసు పెడతానని చెప్పగా.. 2019 అక్టోబర్ 24న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బరంపేటలో కాపురం పెట్టాడు. 2020 మార్చిలో ఆమెకు బాబు జన్మించాడు. కాగా, నవీన్కు అప్పటికే మరో యువతితో వివాహమైన విషయం బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీయడంతో దళిత యువతిని మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. వేరే నంబర్ను వినియోగిస్తున్నాడని తెలిసి ఫోన్ చేయగా ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి బలవంతంగా ఇంటినుంచి బయటకు నెట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరేంద్రబాబు బుధవారం తెలిపారు. నవీన్పై పేకాట, బెట్టింగ్ కేసులు నవీన్పై గతంలో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహణ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికి టీడీపీ ముఖ్యనేతలు అతడికి రాష్ట్ర పదవి కట్టబెట్టి, పదవిలోనే కొనసాగిస్తున్నారు. దళిత యువతిని మోసం చేసి రోడ్డు పాల్జేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుణ్ణి అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని పలువురు దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement