-
సరికొత్త ఆలోచనలతోనే అవినీతికి చెక్
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) అన్ని ప్రభుత్వ విభాగాల్ని కోరింది. అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లు(సీవీవో) అందరూ తమ విధానాలతో పాటు వ్యూహాల్ని కమిషన్తో పంచుకోనున్నారు. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 15 లక్షల మంది ప్రజలతో పాటు 30,000 సంస్థలు అవినీతి నిర్మూలనకు ఈ–ప్రతిజ్ఞ చేశాయని సీవీసీ పేర్కొంది. సెమినార్లు నిర్వహించడంతో పాటు బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వాధికారులు, ప్రజల్లో అవినీతిపై అవగాహన కలిగిస్తామని కమిషన్ తెలిపింది. -
హాస్టళ్లలో అవినీతికి చెక్
మహబూబ్నగర్ విద్యావిభాగం: హాస్టళ్లలో అవినీతికి అధికారులు చెక్ పెట్టనున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపి దోచుకుంటున్న వార్డెన్లకు కళ్లెం వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘీక సంక్షేమశాఖ హాస్టళ్లలో వందమందికి పైగా విద్యార్థులున్న చోట బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా హాజరు పట్టికలో పూర్తిస్థాయి హాజరు వేసి బిల్లులు స్వాహా చేస్తున్నారన్న అపవాదులు ప్రభుత్వ హాస్టళ్లపై ఉన్నాయి. అంతేగాక ఇటీవల ఏసీబీ జిల్లాలోని పలు హాస్టళ్లలో చేసిన తనిఖీల్లో ఇవే విషయాలు బయటపడ్డాయి. ఏసీబీ తనిఖీ చేసిన హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ హాజరు రిజిస్టర్లో మాత్రం పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరైనట్లు నమోదై ఉంది. హాస్టళ్లలో వార్డెన్లు వేస్తున్న ఎక్కువ విద్యార్థుల సంఖ్య ప్రకారం నెలకు లక్షల రూపాయలు కాజేస్తున్నారని ఏసీబీ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఇదే విషయంపై గతంలో సమీక్ష చేపట్టిన ప్రభుత్వం విద్యార్థుల హాజరు విధానంలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని గతేడాది నిర్ణయించింది. మొదటి విడతగా సంక్షేమహాస్టళ్లలో ఈ బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. ఆ తర్వాత బీసీ, గురుకులు, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో అమలు చేయనున్నట్లు సంక్షేమ అధికారులు చెబుతున్నారు. కేవలం విద్యార్థుల హాజరుతో సరిపెట్టక విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు కూడా బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందుకు అవసరమైన బయోమెట్రిక్, ల్యాప్టాప్లను సరఫరా చేసేందుకు హైదరాబాద్కు చెందిన క్లస్టర్ ఇన్ఫోటెక్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. 100 మంది విద్యార్థుల సంఖ్య కలిగిన సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానం అమలు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 100 మంది విద్యార్థులకు పైగా సంఖ్య ఉన్న 81 హాస్టళ్లకు ల్యాప్టాప్లు, బయోమెట్రిక్ మిషన్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాల్లోని సాంఘీక సంక్షేమహాస్టళ్లకు చేరిన క్లస్టర్ ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన ప్రతినిధులు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు బయోమెట్రిక్ విధానం అమలుపై వివరించి బయోమెట్రిక్ మిషన్లను అందజేశారు. విద్యార్థుల నుంచి వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్ విధానంలో విద్యార్థి పూర్తి వివరాలు ల్యాప్టాప్లో నిక్షిప్తం చేస్తారు. ఇక ప్రతిరోజు రెండు సార్లు విద్యార్థుల నుంచి వేలి ముద్రల ద్వారా హాజరు నమోదు చేస్తారు. ఇలా నమోదైన వివరాలు ప్రతి రోజు రాజధానిలోని ప్రధాన కార్యాలయానికి చేరుతాయి. నెల చివరినాటికి ఇలా నమోదైన విద్యార్థుల హాజరుశాతం ఆధారంగా ఆయా హాస్టళక్లు బిల్లులు మంజూరవుతాయి. ఈ విధానంతో గతంలో జరిగిన అవకతవకులకు చెక్ పడనుంది. వార్డెన్లకు శిక్షణ ఎప్పుడో..? జిల్లా వ్యాప్తంగా ఉన్న 81 హాస్టళ్లకు ఆయా సహాయ సంక్షేమ అధికారుల ద్వారా బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. కొన్ని హాస్టళ్ల వార్డెన్లు బయోమెట్రిక్ మిషన్లను తమ ఇళ్లల్లో పెట్టుకున్నట్లు తెలిసింది. బయోమెట్రిక్ అమలు తీరుపై ఆయా హాస్టళ్ల వార్డెన్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో ఆదిలోనే జాప్యం జరుగుతున్న ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలవుతుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement