-
చెర్రీ బ్లెయిర్.. చందా కొచ్చర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో జరిగే వివిధ చర్చల్లో ప్రసంగించనున్న 57 మంది పారిశ్రామికవేత్తల పేర్లు ఖరారయ్యాయి. వీరికి సంబంధించిన వివరాలను సదస్సు నిర్వాహకులు విడుదల చేశారు. సదస్సులో మొత్తం 53 చర్చాగోష్ఠులు జరగనున్నాయి. అయితే అందులో మాట్లాడే వారి తుది జాబితాలు ఇంకా ఖరారు కాలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఖరారైన పేర్లలో 57 మందికి సంబంధించిన నేపథ్యాలను నిర్వాహకులు వెల్లడించారు. వీరిలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, చైర్మన్ చందా కొచ్చర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెర్రీ బ్లెయిర్తోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు. అందులో కొందరి గురించి.. చెర్రీ బ్లెయిర్ – బ్రిటన్ మాజీ ప్రధాని సతీమణి ఈమె ప్రముఖ న్యాయవాది కూడా. పరిశ్రమలను నెలకొల్పడంలో మహిళలకు సహాయం చేసేందుకు 2008లో చెర్రీ బ్లెయిర్ ఫౌండేషన్ను స్థాపించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజంలో తమ గొంతను వినిపించగలుగుతారన్న ఆశయంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. మహిళలు, బాలలు, మానవ హక్కుల కోసం కృషి చేస్తున్నారు. చందా కొచ్చర్ – ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐకు ఈమె 2009 నుంచి సీఎండీగా పని చేస్తున్నారు. 1984లో ఐసీఐసీఐలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె... 2001లో బ్యాంక్ పాలక మండలిలో స్థానం సంపాదించారు. 2011లో పద్మభూషన్ పురస్కారాన్ని అందుకున్నారు. 153 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులున్న ఐసీఐసీఐ బ్యాంకుకు లాభాల బాట పట్టిస్తూ ఖ్యాతి గడించారు. అను ఆచార్య – సీఈవో, మ్యాప్ మై జీనోమ్ ఇండియా లిమిటెడ్ జన్యు చికిత్స ద్వారా వైద్య సేవలందించేందుకు అను ఆచార్య 2013లో ‘మ్యాప్ మై జీనోమ్’సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎన్నో పురస్కారాలను గెలుచుకుంది. రెడ్ హెర్రింగ్ టాప్ 100 ఏసియా అండ్ గ్లోబల్ 2016, ఈఎన్–ఏబుల్ ఇండియా స్టార్టప్ అవార్డ్–2016, వాల్ స్ట్రీట్ జర్నల్ స్టార్టప్ షోకేస్–2016 ఫైనలిస్ట్ పురస్కారాలను సొంతం చేసుకుంది. భావిష్ అగర్వాల్ – ఓలా, సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఐఐటీ ముంబైలో చదివిన భావిష్ సహ విద్యార్థి అంకిత్ భాటీతో కలిసి ఓలా క్యాబ్స్ కంపెనీని 2013 డిసెంబర్లో నెలకొల్పారు. అంతకు ముందు రెండేళ్ల పాటు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్లో పనిచేశారు. ఓలా షేర్, ఓలా షటిల్ సేవలతో రవాణా రంగంలోకి దూసుకువచ్చారు. ఎకనామిక్స్ టైమ్స్ నుంచి ఎంటర్ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్–2017 పురస్కారం అందుకున్నారు. సంజీవ్ భిక్చందాని – ‘నౌకరీ’ వ్యవస్థాపకుడు ఐఐఎం అహ్మదాబాద్ నుంచి 1989లో ఎంబీఏ పూర్తి చేసిన సంజీవ్ భిక్చందాని ఎన్నో రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసిన తర్వాత 2003లో ‘నౌకరి డాట్ కాం’వెబ్సైట్ను స్థాపించారు. ఇది ఉద్యోగ సమాచారం అందించే ప్రధాన వెబ్సైట్గా పేరుగాంచింది. స్టాక్ ఎక్సే్ఛంజీలో రిజిస్టరైన ఈ కంపెనీకి మార్కెట్లో 2 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులున్నాయి. దీప్ కాల్ర – ‘మేక్ మై ట్రిప్’ వ్యవస్థాపకుడు ఈయన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ‘మేక్ మై ట్రిప్ డాట్ కాం’ను 2000లో స్థాపించి కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశారు. అంతకు ముందు పలు కంపెనీల్లో పనిచేశారు. ఐఏఎంఏఐ, ఇంటర్నెట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2010), కేపీఎంజీ నుంచి డిజిటల్ ఇన్ఫ్లూయన్సర్ ఇన్ ఇండియా((2012)తో సహా పలు పురస్కారాలను అందుకున్నారు. సచిన్ భన్సల్ – ఫ్లిప్కార్ట్, సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దేశ ఈ–కామర్స్ రంగంలో 60 శాతం వాటా కలిగిన ఫ్లిప్కార్ట్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కంపెనీని స్థాపించిన 2007 నుంచి 2015 వరకు సీఈవోగా, 2016 నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 2016లో ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. -
మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు!
పేరుకు ఆమె నడిపింది ఓ మానవ హక్కుల సంస్థ. కానీ ఓ నియంతకు కొమ్ముకాసి.. భారీగా సొంత ఖజానా నింపుకొంది. మానవ హక్కులను నిలువునా పాతరేసి.. తన సొంత ప్రయోజనాలను దండిగా కాపాడుకుంది. తన భర్త ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవి నిర్వర్తించినప్పటికీ, ఆమె అవినీతికి పాల్పడేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ మేరకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్ నిలువునా అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మాల్దీవులకు చెందిన అవినీతి నియంత అబ్దుల్లా యమీన్తో చెరీ బ్లెయిర్ సాగించిన రహస్య ఆర్థిక వ్యవహారాల గూడుపుఠాణీ బట్టబయలైంది. అబ్దుల్లా యమీన్కు అండగా నిలిచినందుకు రోజుకు రెండు వేల పౌండ్ల చొప్పున మొత్తం రెండు లక్షలకుపైగా పౌండ్ల సొమ్ము ఆమె కంపెనీకి ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చెరీ కంపెనీ ఒమ్నియా స్ట్రాటెజీకి అక్రమంగా పెద్ద మొత్తం తరలిన ఈ నిధులపై దర్యాప్తు జరిపేందుకు సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్, అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. మల్దీవులకు నియంత పాలకుడిగా ఉన్నప్పుడు యమీన్ భారీగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన 1700మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైళ్లలో బంధించాడు. న్యాయాన్ని అవహేళన చేస్తూ ముగ్గురు ప్రతిపక్ష నేతలను శిక్షించాడు. ఈ నియంత పాలకుడితో చెరీ బ్లేయిర్ సాగించిన అక్రమ ఆర్థిక వ్యవహారాలు తాజాగా డైలీమెయిల్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. - నియంతృత్వ పాలకుడైన అబ్దుల్లా యమీన్ తో ఆరు నెలలపాటు పనిచేసేందుకు 4.20 లక్షల పౌండ్లతో చెరీ బ్లెయిర్ ఓ ఒప్పందం చేసుకుంది. - అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొనే చెరీ.. నియంత పాలనలో ఉన్న మాల్దీవుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పనిచేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. - కానీ నియంత యమీన్కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆమె కంపెనీకి అక్రమమార్గంలో ఏకంగా 2.10 లక్షల పౌండ్లు ముట్టాయి. వీటిని ఆయుధ సరఫరా వ్యాపారి, ఉగ్రవాది, ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు మహమెద్ ఆలం లతీఫ్ ఆమె కంపెనీ ఖాతాలో జమచేయడం గమనార్హం. మల్దీవులు అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మహమ్మద్ నౌషధ్ను సైనిక చర్య ద్వారా అబ్దుల్లా యమీన్ గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టు విచారణలో న్యాయసహాయం కోసం చెరీ బ్లెయిర్ లీగల్ కంపెనీ 'ఒమ్నియా స్ట్రాటెజీ'ని అబ్దుల్లా యమీన్ గత ఏడాది వేసవిలో నియమించుకున్నారు. అయితే ఈ సంస్థ మానవ హక్కులకు సంబంధించి న్యాయసహాయం కోసం కాకుండా అంతర్జాతీయ మీడియా ముందు నియంత ప్రభుత్వాన్ని సమర్థించడానికి, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపరచడానికి లోపాయికారి సహకారం అందించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement