-
జైలు అధికారులపై ఖైదీల దాడి.. చర్లపల్లి జైలులో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కొంతమంది ఖైదీలు తనఖీలకు వచ్చిన జైలు అధికారులపై విచక్షణా రహితంగా దాడి చేయటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముబారక్ కాబిల్ ఇర్ఫాన్ అనే వ్యక్తి రెండు నెలల కిందట ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలుకు వచ్చాడు. జైలు అధికారులు బుధవారం జైల్లోని బ్రహ్మపుత్ర బ్యారక్లో తనఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇర్పాన్తో పాటు మరి కొందరు ఖైదీలు రాజశేఖర్ అనే వార్డర్పై దాడికి దిగారు. అంతే కాకుండా అడ్డువచ్చిన రత్న అనే జైలర్పైన, డిప్యూటీ జైలర్ సంజీవ్ రెడ్డిపైనా దాడికి తెగబడ్డారు. దీంతో జైలు అధికారులు ఇర్ఫాన్ను సింగిల్ సెల్లో నిర్భందించారు. అయితే ఇర్పాన్ మానసిక పరిస్థితి సరిగాలేకపోవటం వల్లే రాజశేఖర్పై దాడికి దిగాడని జైలు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ రాజశేఖర్కు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దాడికి దిగిన వారిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. -
చర్లపల్లి జైలుకు ఉగ్రవాదులు
కుషాయిగూడ: నగరంలో పట్టుబడ్డ ఉగ్రవాదులను గురువారం రాత్రి చర్లపల్లి జైల్కు తీసుకువచ్చారు. వారిలో అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమోదీ, మహ్మద్ ఇబ్రహిం యజ్దాని, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇలియాస్ యజ్దాని, ముజాఫర్ హుస్సేన్ రిజ్వాన్ అనే ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు జైల్ పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా వారికి కేటాయించిన ఖైదీ నెంబర్లు, బ్యారక్ల వివరాలను చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. -
డబ్బుల కోసం చంపేస్తారు
► దాదాపు పది హత్యలుచేసిన యాదగిరి ► చోరీలు, చైన్ స్నాచింగ్లలో దాదారావు సహకారం ► శిక్ష అనుభవిస్తూ 2015లో చర్లపల్లి జైలు నుంచి పరార్ ► బీదర్ సమీపంలో ఆటోడ్రైవర్ హత్య ► పోలీసుల అదుపులో నిందితులు మియాపూర్: ఆటో డ్రైవర్ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు, మియాపూర్ సీఐ రమేష్ కొత్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా వెనుకొండ మండలం నూజర్ల గ్రామానికి చెందిన ఏడుకొండలు(35) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి మియాపూర్లోని న్యూకాలనీలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 9న ఏడుకొండలు కనిపించకుండా పోయాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ నమోదైంది. దాదాపు పది హత్యలు.. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల గ్రామానికి చెందిన కుంచెం యాదగిరి(42) దొంగతనాలు, హత్యలకు పాల్పడుతుండేవాడు. దాదాపుగా 10 హత్యలు చేశాడు. యావత్ జీవ కారాగార శిక్ష పడింది. 2015లో చర్లపల్లి జైలునుంచి తప్పించుకున్నాడు. కల్లు కాంపౌడ్లకు వెళ్లి అమాయకులతో స్నేహంగా మాట్లాడి వారితో కలిసి మద్యం తాగి డబ్బులు లాక్కొని చంపేసేవాడు. సిద్దిపేట్లో ముగ్గురిని, చేగుంటలో ముగ్గురిని, తూప్రాన్లో ఒక్కరిని, నర్సాపూర్లో ఇద్దరిని, మాసాయిపేట్లో ఒక్కరిని హత్య చేశాడు. బీదర్ సమీపంలో చంపేశారు.. ఏడుకొండలును మహారాష్ట్ర, ఉద్గిర్కు చెందిన దాదారావుతో కలిసి కర్నాటక రాష్ట్రంలోని బీదర్ సమీపంలో చంపేసి ఆటోను దొంగిలించారు. గతంలో వీరిద్దరిపై కేపీహెచ్బీ, మియాపూర్, కూకట్పల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో పది దొంగతనాలు, రెండు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. శనివారం తెల్లవారు జామున పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హత్య చేసిన స్థలానికి తీసికెళ్లి ఆరా తీయగా అస్తికలు లభ్యమయ్యాయి. వారి వద్ద నుంచి 19 తులాల బంగారం, రెండు ఆటో ట్రాలీలు, రెండు బైకులు, ఓ కలర్ టీవీ, రూ.1.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపైపీడీయాక్ట్నమోదు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డునపడ్డ కుటుంబం... ఏడుకొండలు మృతితో భార్య శివలీల ఇద్దరు కుమారులు వరుణ్ సాయి(6), ధనుష్ రత్నా(3) రోడ్డునపడ్డారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement