-
దిగొచ్చిన చికెన్ ధరలు.. కిలో 155 రూపాయలు
నల్లగొండ టౌన్: చికెన్ రేటు రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో చికెన్ స్కిన్తో రూ.155 ధర పలుకుతోంది. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర (స్కిన్తో) రూ.270 నుంచి రూ.285పైగా పలికింది. అప్పుడు సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడం, అయ్యప్పమాలలు, ఆంజనేయస్వామి మాలలు ధరిస్తున్న నేపథ్యంలో చికెన్ వాడకం సగానికి సగం పడిపోయింది. దీంతో చికెన్ ధర కూడా తగ్గిందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. కార్తీకమాసం ముగిసే వరకు ధరలు ఇలానే ఉండే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే కోళ్ల ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ చికెన్ వాడకం తగ్గడంతో కోళ్ల పెంపకందారులు నష్టాలపాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న కారణంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ పార్టీల నేతలు విందులు చేసే అవకాశం ఉన్నందున రెండు, మూడు రోజుల్లో వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందన్న చికెన్ సెంటర్ నిర్వాహకులు భావిస్తున్నారు. చికెన్ ధర ఇలా.. (కిలో రూ.లలో..) నెలక్రితం ప్రస్తుతం విత్ స్కిన్ 285 155 స్కిన్ లెస్ 310 180 కార్తీక మాసం కావడంతో ధర తగ్గింది ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో మహిళలు చాలా వరకు చికెన్ ముట్టరు. దీంతో చికెన్ కొనేవారు సగానికి సగం తగ్గడంతో చికెన్ రేటు కూడా పడిపోయింది. నెల క్రితం కిలో రూ.285 వరకు ఉన్న చికెన్ నేడు రూ.155 మాత్రమే అమ్ముతున్నాము. ఎన్నికలు ఉన్నందున ఒకటి రెండు రోజుల్లో గిరాకీ పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. –నాగయ్య, చికెన్సెంటర్ యజమాని, నల్లగొండ -
రేటు.. సిండికేటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విశాఖలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.220, విజయనగరం జిల్లాలో కిలో రూ.220.. కానీ మన జిల్లాలో మాత్రం కిలో రూ.275కు విక్రయిస్తున్నారు. పక్కపక్క జిల్లాల్లో ఇంత వ్యత్యాసం చూసి కొనుగోలుదారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కోవిడ్ కాలం నుంచి దాదాపు ఇదే పరిస్థితి. పత్రికల్లో రేట్లు ప్రచురితమవుతున్నా.. బహిరంగంగానే ఈ మోసం జరుగుతోంది. జిల్లాలో సిండికేట్ దందా నడుస్తుందేమోనన్న అనుమానాలు కూడా జనాల్లో కలుగుతున్నా యి. జిల్లాలో మాంసం ప్రియులు ఎక్కువగానే ఉన్నారు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి గుడ్లు, పాలు, మాంసం తినడం ఎక్కువైంది. దీనికి తోడు ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటల్ భోజనాలు విపరీతంగా పెరిగాయి. వీటిని అదనుగా తీసుకుని సంబంధిత వ్యాపారులు సిండికేటై ధరలు పెంచుకుంటూ పోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రమంతా ధరలు ఏ రోజుకారోజు మారుతున్నా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ధరలు తగ్గించే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం శ్రీకాకుళం బాయిలర్ అసోసియేషన్ ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకే రిటైల్ వ్యాపారులు అమ్మకాలు చేయడమే. పర్యవేక్షణ లేకపోవడం వల్లేనా.. చికెన్, గుడ్లు ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్ శాఖ అఽధికారులకు లేకపోవడంతో పరిస్థితి హద్దు మీరుతోంది. జిల్లాలోని రణస్ధలం, కోష్ట, పాలకొండ, కొల్లివలస,రాజాం, కోటబొమ్మాళి, గార, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. అందుబాటులో భారీగా కోళ్లు దొరుకుతున్నా ఇక్కడెందుకు మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్ ధరలు భారీగా ఉంటున్నాయని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుత ధర ప్రకారం జిల్లాలో రోజుకు రూ.4కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కో కిలోకు మిగతా జిల్లాలతో పోలిస్తే రూ. 50కు పైగా తేడా ఉండటంతో ఇక్కడ కొనుగోలు దారులు ఎంత అదనపు భారం మోస్తున్నారో లెక్క కట్టుకోవచ్చు. ఇదే విషయమై జిల్లా బాయిలర్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న వెంకటేష్ అనే వ్యక్తిని ‘సాక్షి’ సంప్రదించగా ‘మాకున్న ఇబ్బందు లు మాకు ఉన్నాయి. మిగతా జిల్లాల పరిస్థితి వేరు. ఇక్కడ వేరు. అందుకనే ధర తేడా ఉంటుంది. పేపర్ రేటుకు, వాస్తవ ధరకు తేడా ఉంటుంది. బల్క్లో కొనుగోలు చేస్తే ఆ రేటు ఇంకా తగ్గుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. వ్యాపారాలు చేయలేకపోతున్నాం పక్క జిల్లాల్లో లేని ధరలు శ్రీకాకుళంలోనే ఉంటున్నా యి. కరోనా తర్వాత అమాంతంగా రూ.70కి పైగా పెంచేశారు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు రోజుకి 400 కేజీలు అమ్మకాలు చేసేవాళ్లం. ధరలు పెరిగిపోవడంతో రోజుకి 200కేజీలు అమ్మడం కూడా కష్టమైపోతోంది. ఎందుకిలా ధరలు ఎక్కువగా ఉన్నా యని ప్రశ్నిస్తే వ్యాపారానికి కావాల్సిన చికెన్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. – వై.రాజు, చికెన్ వ్యాపారి, బలగ నియంత్రణ మా చేతుల్లో లేదు చికెన్, గుడ్లు ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు. వ్యాధుల నియంత్రణకు ముంద స్తు జాగ్రత్తలు, వచ్చిన తర్వాత నివారణ చర్యలు మాత్రమే మేం చేపడతాం. ధరలు పెంచడం, నియంత్రించడంతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. విశాఖ, విజయనగరంల్లో ఏవిధంగా ధరలున్నాయో శ్రీకాకుళంలో కూడా అలాగే ఉండాలి. పౌల్ట్రీవ్యాపారులు సిండికేటుగా మారి ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. ధరల నియంత్రణకు జిల్లాలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీ వేసి నియంత్రణకు చర్యలు చేపడితే బాగుంటుంది. – డాక్టర్ పొట్నూరు సూర్యం, ఇన్చార్జ్ జేడీ, పశుసంవర్ధకశాఖ, శ్రీకాకుళం. ధరలు పెంచుకుంటూ పోతున్నారు చికెన్ ధరలను ఇష్టం వచ్చి నట్లు పెంచుకుంటూ పోతున్నారు. కరోనాకు ముందు కిలో రూ.100కే దొరికేది. ఇప్పుడు మాత్రం రూ.275 ఉండటం దారుణం. ఆదివారం చికెన్ తిందామంటే ఒక్కోసారి రూ.300 మార్కు దాటిపోతోంది. – ఆర్.యుగంధర్, కొనుగోలుదారుడు, గూనపాలెం, శ్రీకాకుళం. దాబాలు నడపలేకపోతున్నాం దాదాపుగా చికెన్ ఫుడ్ ఐటమ్స్ కోసం దాబాలకు అధికంగా వస్తుంటారు. కానీ చికెన్ ధరలు విశాఖ, విజయనగరం కంటే ఎక్కువగా ఉండడంతో నష్టాల బారిన పడుతున్నాం. కిలో రూ.275కు కొనుగోలు చేసి దాబాలు నడపాలంటే కష్టం. అలాగని రేటు పెంచితే కస్టమర్లు రారు. ఇటీవల కాలంలో దాదాపుగా శ్రీకాకుళం సిద్దిపేటరోడ్డులో నాలుగు దాబాలు మూసేశారు. ధరల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలి. – పి.నవీన్, కేన్స్ స్పైసీదాబా, సిద్ధిపేట రోడ్డు, శ్రీకాకుళం. -
Chicken Price: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర కిలో 320
మండపేట : మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడే చికెన్ ధర చుక్కలు చూపిస్తోంది. రిటైల్ దుకాణాల వద్ద రూ.320 పలుకుతూ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. కోడిపిల్లల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొత్తబ్యాచ్లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తగ్గడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రోజుకు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సుమారు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆలమూరు, రాజానగరం, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే శ్రావణమాసం, వినాయక చవితి వేడుకలు, అయ్యప్ప దీక్షలు, కార్తికమాసంలో చికెన్ వినియోగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పండగల సమయాల్లో కొత్త బ్యాచ్లు వేయడాన్ని కొంతమేర తగ్గిస్తుంటారు. రూ.12 నుంచి రూ.50కు పెరిగిన కోడిపిల్ల ధర నెలన్నర రోజుల క్రితం రూ.12 ఉన్న కోడిపిల్ల ధర ప్రస్తుతం రూ.50కి చేరుకుంది. శ్రావణమాసంలో వినియోగం తగ్గుతుందని పలు హేచరీల్లోని బాయిలర్ కోళ్ల గుడ్లు ఉత్పత్తికి వినియోగించే పెరేంట్స్ కోళ్ల (బొంత కోళ్లు)ను షాపులకు అమ్మేశారు. గుడ్ల కొరతతో హేచరీల్లో కోడి పిల్లల ఉత్పత్తి తగ్గి వాటి ధర అమాంతం పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క కోడి మేత ధరలు, ఇతర నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో గిట్టుబాటు కాదని అధిక శాతం మంది రైతులు కొత్త బ్యాచ్లు వేయలేదు. స్థానికంగా లభ్యత తగ్గడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆయా కారణాలతో శ్రావణమాసంలో వినియోగం తగ్గినా ధర దిగి రాలేదంటున్నారు. శ్రావణమాసం మొదట్లో రూ.250 ఉన్న కిలో స్కిన్ లెస్ చికెన్ ధర, నెలాఖరు నాటికి రూ.350కు చేరింది. వినాయక చవితి నవరాత్ర ఉత్సవాల నేపథ్యంలో వినియోగం మరింత తగ్గనుండటంతో అక్కడక్కడా పౌల్ట్రీల్లో ఉన్న కోళ్లను మార్కెట్లోకి తెస్తున్నారు. ఫలితంగా నాలుగు రోజులుగా ధర స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. రిటైల్ దుకాణాల వద్ద స్కిన్లెస్ కిలో రూ.320, లైవ్ రూ.145 వరకు అమ్తుతున్నారు. కోడిపిల్ల ధర బాగా పెరిగిపోయింది కోడిపిల్ల ధర నెలన్నర రోజుల్లో రూ.12 నుంచి రూ.50కు పెరిగిపోయింది. ఆన్ సీజన్, కోడిపిల్ల ధరలకు జడిసి గిట్టుబాటు కాదని చాలామంది రైతులు కొత్త బ్యాచ్లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపించింది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర ఎక్కువగా ఉంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, మండపేట -
వామ్మో!.. కోడికూరను మించిపోయిన టమాటా ధరలు..
కూరగాయల ధరలు కుతకుతమంటున్నాయి. టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, ఉల్లితోపాటు మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో.. దూరప్రాంతాల నుంచి రవాణా సౌకర్యానికి అంతరాయమేర్పడి దిగుమతి తగ్గింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు, వరదలు ఉండగా సరుకులు రావడం లేదంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఉన్న సరుకును బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. రూ.500తో మార్కెట్కు కెళ్తే వారానికి సరిపడా రావడం లేదు. దిగిరాని ధరలు వంటకాల్లో టమాటాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఏ వంట చేయాలన్నా టమాటా తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వీటి ధరల పెరుగుదల సామాన్య మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టమాటా ధరలు తగ్గేదేలే అంటూ రోజు రోజుకు పెరిగిపోతూ వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మొన్నటి వరకు 100 నుంచి 150 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. చదవండి: హైదరాబాద్లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! టమాటా @200 కిలో టమాటా రూ.100 ఉండగానే జనాలు కొనేందుకు తంటాలు పడగా.. ఏకంగా రూ.200కు చేరగా ఇక కొనలేమంటూ వాపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.200పైనే పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని తాకుతుంటడంతో సామాన్యులు టమాటా వాడకాన్ని తగ్గించారు. అంతేగాక రానున్న రోజుల్లో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. టమాటా కంటే చికెన్ బెటర్ టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. కోడి మాంసం ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. కొన్నిచోట్ల టమాట కంటే చికెన్ ధరలు తక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల కేజీ చికెన్ ధర రూ.200(స్కిన్). రూ. 220(స్కిన్ లెస్)గా ఉంది.. రూ. 200 పెట్టి టమాటాలు కొనే బదులు చికెన్ కొనడమే బెటర్ అని చాలా మంది అంటున్నారు. నిత్యావసరాల ధరలకూ రెక్కలు.. రాష్ట్రంలో ఇటీవల వారంపాటు కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. రావాణా వ్యవస్థ కుదేలైంది. దీంతో ధరలు మరింత పెరిగాయి. కూరగాయల ధరలతోపాటు నిత్యావసరాల ధరలకూ రెక్కలొచ్చాయి. రెక్కడితేగాని డొక్కాడని కూలీలు పొద్దంతా పని చేసి వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి ఏర్పడింది. పైగా వర్షాల కారణంగా వారంరోజులుగా పనులు లేక ఇళ్లకే పరిమితమైన వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చదవండి: ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్నగర్లో ఎస్కేప్.. రాజేంద్రనగర్లో అరెస్టు! -
మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తూ చికెన్ ధర
మండపేట: మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తూ చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. రికార్డు స్థాయిలో స్కిన్లెస్ కిలో రూ.400కు చేరింది. నాలుగు నెలలుగా సరైన ధర లేక నష్టపోవడం, పెరిగిన నిర్వహణ వ్యయం, అధిక ఎండలకు జడిసి కొత్త బ్యాచ్లు వేయడానికి కోళ్ల రైతులు వెనుకంజ వేస్తున్నారు. కోళ్ల లభ్యత తక్కువగా ఉండటంతో ధర పెరిగిపోతోంది. మాంసాహార ప్రియులు చికెన్ను ఎక్కువగా ఇష్టపడతారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సుమారు మూడు లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వేస్తుంటారు. పెరిగిన ఖర్చులు అధిక ఉష్ణోగ్రతలతో కోళ్ల మరణాలు పెరిగి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎండలకు జడిసి వేసవిలో కొత్త బ్యాచ్లు వేసేందుకు వెనకాడతారు. దీనికితోడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు స్కిన్లెస్ చికెన్ కిలో రూ. 200కు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మేత ధరలు గిట్టుబాటయ్యేలా లేకపోవడం కొత్త బ్యాచ్లు వేయకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. మొక్కజొన్న కిలో రూ.20 ఉండగా, సోయా రూ.50, అన్ని మేతలు మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.43 వరకు ఉంది. కోడిపిల్ల ధర రూ.26 నుంచి రూ.30 వరకు ఉంది. కోడిమేత, మందులు, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకు వ్యయమవుతోందంటున్నారు. ఆయా కారణాలతో రెండు నెలలుగా అధికశాతం మంది రైతులు కొత్త బ్యాచ్లు వేయలేదు. సొంతంగా నిర్వహణ చేయలేక కమీషన్పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి ఇచ్చేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల లభ్యత లేకపోవడం, అధికశాతం ఫామ్లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.400 వరకు అమ్మకాలు చేస్తుండగా, లేయర్ కోడి రూ.130 వరకు ఉంది. సాధారణంగా రెండు నుంచి మూడు కిలోల వరకు బరువు పెరిగాక కోళ్లను మార్కెట్కు తరలిస్తుంటారు. కాగా 1.5 కిలో నుంచి 1.8 కిలో బరువున్న కోళ్లను అమ్మకాలు చేసేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నెలాఖరు వరకు ధర తగ్గకపోవచ్చని వ్యాపార వర్గాలంటున్నాయి. నష్టాలకు జడిసి జనవరి నుంచి ఏప్రిల్ వరకు గిట్టుబాటు ధర లేక కోళ్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. ఎండలకు జడిసి చాలామంది కొత్త బ్యాచ్లు వేయక ధర పెరిగిపోతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement