-
శివరామ్ను వదలొద్దు: ప్రవళిక తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: ప్రవళిక బలవన్మరణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో శివరామ్ను నిందితుడిగా చేర్చారు. ప్రేమాపెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేశారు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా కోస్గి మండలానికి చెందిన శివరామ్ రాథోడ్పై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని, బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. మరోవైపు.. ప్రవళిక ఆత్మహత్య కేసులో కుటుంబ సభ్యులు మాట మార్చారు. గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడడంతోనే ఆత్మహత్య చేసుకుందని తొలుత చెప్పిన కుటుంబ సభ్యులు.. తాజాగా శివరామ్ రాథోడ్ వేధింపులే కారణమంటూ ఆరోపించారు. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్లు తాజాగా వీడియోలు విడుదల చేశారు. బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని, రాజకీయాలు చేయొద్దని తల్లి విజయ కోరుతున్నారు. శివరామ్ను వదిలిపెట్టొద్దని పోలీసులు కోరారు వాళ్లు. ‘‘నా బిడ్డ చావుకు కారణమయిన వాడిని కఠినంగా శిక్షించాలి. వాడు జీవితాంతం బయటకు రాకుండా జైల్లోనే పెట్టాలి. నా బిడ్డకు వచ్చిన పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకూడదు. నా బిడ్డయితే ఇప్పుడు మాకు రాదు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసుకుంటుందని భావించాం. కానీ వాడి టార్చర్ కారణంగా చనిపోయింది. అయితే ఈ రాజకీయ పార్టీలు వాళ్ల గొడవలు వాళ్లే చూసుకోవాలి. మమ్మల్ని మాత్రం మీ రాజకీయంలోకి లాగవద్దు. ఇలా చెప్పండి.. అలా చేయండనే సలహాలు ఇవ్వొద్దు. ఇప్పటికే నా బిడ్డ బతుకు ఆగం అయ్యింది. ఇప్పుడు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. మా దాక మాత్రం తీసుకొని రావొద్దు. నా బిడ్డ మరణానికి కారణమైన వాడికి తగిన శిక్ష విధించాలి. నా బిడ్డ ఎలా అయితే ఉరేసుకొని చనిపోయిందో.. అలాగే వాడికి కూడా ఉరేసి చంపాలి.. అని ఆమె చేతులెత్తి నమస్కరించారు. వరంగల్కు చెందిన మర్రి ప్రవళిక(23) ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్నగర్లోని ఓ వసతిగృహంలో ఉంటూ ప్రవళిక శిక్షణ తీసుకుంది. ఈనెల 13న వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజకీయంగా ఈ ఘటన ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది. ఇక ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. శివరామ్ అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు తేలింది. మరో యువతితో వివాహం నిశ్చయం కావడం తెలిసి.. భరించలేకే ప్రవళిక ప్రాణం తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రేమ వ్యవహారం ప్రవళిక ఇంట్లోనూ తెలుసని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ముందు ప్రేమ పెళ్లి... మామ కూతురితో మరో పెళ్లి!
హైదరాబాద్: ఐదేళ్ల కిత్రం పరిచయం వారిద్దరిని ఒకటి చేసింది. దైవసాక్షిగా ఆ అమ్మాయి మేడలో మూడు ముళ్లు వేశాడు. అయితే తాను పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో దాచి తన మామ కూతురితో మరో పెళ్లి చేసుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాలివీ.. దోమలగూడ బండానగర్ లో నివసిస్తున్న ఓ యువతి (27)తో, నగరంలోని ఓ ప్రముఖ బంగారం దుకాణంలో పని చేస్తున్న బీదర్కు చెందిన సంగమేష్ (26)కు ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గత మే 5వ తేదీన వీరిద్దరూ యాదగిరి గుట్టలో వివాహం చేసుకుని హైదరాబాద్కు వచ్చారు. ఆ తరువాత తన స్వగ్రామం వెళ్లి వస్తానని చెప్పిన సంగమేష్ అక్కడికి వెళ్లి తన మామ కూతురిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయంచింది. దీంతో పోలీసులు సంగమేశ్వర్ను అరెస్ట్ చేసి అతనిపై 420, 426 ఎస్సీ, ఎస్టీ ట్రాసిటీ కేసులను నమోదు చేసి గురువారం రిమాండ్కు పంపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement