-
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
డబ్బు వసూలు చేసుకొస్తుండగా కారం చల్లి..
బిహార్: బిహార్లో దొంగలు రెచ్చిపోయారు. కళ్లల్లో కారం చల్లి పంకజ్ కుమార్ అనే మొబైల్స్ డీలర్ నుంచి రూ.రెండు లక్షల నగదు, 30 మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రోహతాస్ జిల్లాలోని ససారామ్ పట్టణంలోని తాకియా ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు సరిగ్గా శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అనూహ్యంగా పంకజ్పై పెద్ద మొత్తంలో కారం కుమ్మరించారు. అనంతరం క్యాష్ కౌంటర్ నుంచి రూ.2లక్షల నగదు, 30 ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన సమయంలో సదరు వ్యాపారి రిటెయిలర్స్ వద్దకు వెళ్లి డబ్బు వసూలు చేసుకొని వస్తున్నాడు. ససరామ్లో కారం జల్లి దాడి చేయడం ఇది మొదటి కేసు అని పోలీసులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన దొంగల వివరాలు తెలియడం లేదని, శాస్త్రీయ విధానాలతో వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బాధితుడు దాదాపు అందుడైన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. -
రూ.70 లక్షల కల్తీ కారం స్వాధీనం
-
పోలీసుల కళ్లల్లో కారం కొట్టి పరార్
చిలమత్తూరు (అనంతపురం జిల్లా) : మద్యం దుకాణంలో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడికి వెళ్లిన పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దొంగలు పారిపోయారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చితమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ గ్రామసమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొడికొండ చెక్పోస్ట్ సమీపంలో ఉన్న బాలాజీ వైన్స్లో దొంగతనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన గస్తీ పోలీసులు ఈ విషయాన్ని గమనించారు. దీంతో దుండగులు పోలీసుల కళ్లల్లో కారం కొట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. -
తుపాను బాధితులకు మరింత మిరప పొడి
గుంటూరు ఈస్ట్: హుదూద్ తుపాను బాధితులకు మరో 235 టన్నుల మిరప పొడిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటివరకు 415 టన్నుల మిరప పొడిని విశాఖపట్నానికి తరలించామని చెప్పారు. సోమవారం మూడు ట్రక్కుల్లో కూర గాయలు పంపామని చెప్పారు. మంగళవారం సాయంత్రానికి మరో నాలుగు ట్రక్కుల్లో కూరగాయలు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అందిన వెంటనే సరఫరా చేసేందుకు కందిపప్పును సిద్ధం చేయూలని సూచించారు. పంపిన సరుకులు విశాఖలోని సంబంధిత శాఖలకు అందాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. తుపాను బాధితుల కోసం సహాయ సామగ్రిని పంపుతున్న సంస్థలు, సంఘాలు, వ్యక్తులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్, డీఆర్వో నాగబాబు, ఆర్డీవోలు, జిల్లా స్థారుు అధికారులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement