-
మూకుమ్మడిగా బావిలోకి దూకారు.. కానీ!
సాక్షి, నెల్లూరు: కుటుంబ సమస్యల కారణంగా ఓ జంట ముగ్గురు పిల్లలతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాలని చూసింది. కలిసికట్టుగా బాలిలోకి దూకి.. మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, విధి మరోవిధంగా తలిచింది. వారు దూకిన బావిలో నీళ్లు లేవు. దీంతో దంపతులతో సహా వారి ముగ్గురు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు ముగ్గురు పిలలతో కలిసి దంపతులు బావిలో దూకారు. అయితే, బావిలో నీళ్లు లేకపోవడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. -
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడా జట్ల ఎంపిక
చిల్లకూరు : కర్నూలు జిల్లాలో అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి అండర్– 19 స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా క్రీడా జట్ల ఎంపికను చిల్లకూరు గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ జోనల్ కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. అథ్లెటిక్స్లో 100, 200, 800, 1500, 3 కి.మీ, 5కే రన్తో పాటు షాట్పుట్, జావలిన్ త్రో, డిస్కస్త్రో, లాంగ్ జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. అలాగే గేమ్స్కు సంబందించి హ్యండ్బాల్ పోటీలను నిర్వహించి ప్రతి ఈవెంట్లోనూ జిల్లా జట్టును ఎంపికచేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు గురుకుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఇబ్రహీం, పీడీలు దుర్గాప్రసాద్, జానకిరామయ్య, పీఈటీలు శ్రీరేష్, రమణయ్య, ప్రసాద్ పాల్గొన్నారు. -
డివైడర్పైకి దూసుకెళ్లిన కంటైనర్
తటిలో తప్పిన ప్రమాదం చిల్లకూరు : డివైడర్పైకి కంటైనర్ లారీ దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం మండలంలోని జాతీయరహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కష్ణపట్నం నుంచి చెన్నైకు బయలుదేరిన కంటైనర్ నక్కలకాలువ కండ్రిగ సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ కునుకు తీయడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలివైపునకు వచ్చి నిలిపిపోయింది. దీనిని గుర్తించి ఎదురుగా వచ్చే వాహనచోదకులు అప్రమత్తమవడంతో ప్రమాదం తటిలో తప్పింది. విషయం తెలుసుకున్న స్వర్ణ టోల్ప్లాజా సిబ్బంది అక్కడకు చేరకుని కంటైనర్ లారీని పక్కకు తీశారు. దీనిపై పోలీసులకు సమాచారంలేదు. -
తాగునీరు అందించేందుకు కృషి
జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చిల్లకూరు(పెళ్లకూరు) : జిల్లాపరిషత్ నిధులతో ప్రజల దాహార్తి తీర్చేందుకు కషిచేస్తున్నట్లు జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి చిల్లకూరు గ్రామం, స్వర్ణముఖినది సమీపంలో తాగునీటి పైపులైను ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గౌతమ్రెడ్డి మాట్లాడుతూ తాగునీటి పైపులైన్ నిర్మాణంతో దళితకాలనీలకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. కిలివేటి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజానీకానికి సేవచేసేందుకు తామంతా ముందుంటామన్నారు. అనంతరం జెడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలను ఎంపీపీ, సర్పంచ్ బసివిరెడ్డి వెంకటశేషారెడ్డిలు సత్కరించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మారాబత్తిన సుధాకర్, నాయకులు పగడాల హరిబాబురెడ్డి, లోకేష్నాయుడు, శ్రీనివాసులురెడ్డి, రాకేష్రెడ్డి, శ్రీధర్రెడ్డి, కిరణ్, మోహన్, వేణురెడ్డి, మురళీ, శ్రీనివాసులు, మణి, గురవయ్య, ప్రకాష్, గురవయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
బావిలో పడి నాయనమ్మ, మనవరాలు మృతి
చిల్లకూరు : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఐదవ తరగతి విద్యార్థిని నాగలక్ష్మి బట్టలు ఉతికేందుకు గ్రామంలోని నేల బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. కాపాడేందుకు వెళ్లిన ఆమె నాయనమ్మ పోలమ్మ (60) కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచింది. నాయనమ్మ, మనవరాళ్ల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement