-
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..(ఫొటోలు)
-
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
అక్టోబర్ 2.. గాంధీ జయంతి. స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహానుభావుడు మహాత్మ పుట్టినరోజు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెగాస్టార్.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్(CCT) స్థాపించి ఎంతోమందికి రక్తదానం చేశారు. ఈ ట్రస్ట్ కార్యకలాపాలు మొదలై నేటికి పాతికేళ్లు పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. 'ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రోజునే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభమైంది. 25 సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. 10 లక్షలకు పైగా బ్లడ్ యూనిట్స్ సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశాం. 10 వేల మందికి పైగా కంటిచూపు ప్రసాదించాం. కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడాం. తోటి మానవులకు సేవ చేయడం ద్వారా వచ్చే సంతృప్తిని మాటల్లో వెలకట్టలేం. CCT చేపట్టిన మానవతా కార్యక్రమాల్లో భాగమైన లక్షలాది మంది సోదర సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. మన దేశానికి చేస్తున్న చిరు సాయం ఇది! ఇదే మహాత్ముడికి మనం సమర్పించే అసలైన నివాళి!' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్కు తాను రక్తదానం చేస్తున్న ఫోటోను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. చిరు మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తోటివారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ ట్రస్ట్ను 1998 అక్టోబర్ 2న స్థాపించాడు. On this important day for our country, I also fondly reflect on Chiranjeevi Charitable Trust( CCT)’s humble beginnings and its amazing journey of 25 years. Over 10 lakh blood 🩸 units collected and distributed to the needy and eye 👁️ sight restored to over 10 thousand people… pic.twitter.com/UeVzCB58cp — Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2023 చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ప్రియుడు ఎమోషనల్.. వీడియో వైరల్ -
చిరంజీవి గొప్ప మనసు.. ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు, ప్రజల కోసం ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్–స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం(జూలై 9) నగరంలో ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గతంలో చిరంజీవి ప్రకటించగా మొదటి శిబిరం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి.ఎన్. ఆదిత్య పాల్గొన్నారు. చికిత్సలో కూడా రాయితీ అందేలా కృషి: నాగబాబు సినీనటుడు నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రక్తదానం, నేత్రదానం మీద అవగాహన పెంచామని, ఇప్పుడు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ముందుగానే కేన్సర్ను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన డాక్టర్ గోపీచంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కేన్సర్ చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని నాగబాబు హామీనిచ్చారు. స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 ప్రాంతాలలో ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, దానికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు. చదవండి: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే! జవాన్ ప్రివ్యూ.. గూస్బంప్స్ పక్కా -
గవర్నర్ చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులు
చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్ రక్తదాలను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సన్మానించారు. ఆదివారం రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తమిళి సై చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులను అందజేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 50 కంటే ఎక్కువ సార్లు రక్తం దానం చేసిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తూ వారికి ‘చిరు భద్రతా’ కార్డుల పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. రక్త దాతలను సన్మానించుకోడం సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి గారు తన అభిమానులను మోటివెట్ చేసి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని, ఆయన రియల్ మెగాస్టార్ అని కొనియాడారు. ప్రతి రక్త దాత ఒక స్టార్ అని తమిళి సై వ్యాఖ్యానించారు. ఇక చిరంజీవి మాట్లాడుతూ.. ‘1998లో ప్రమాదంలో గాయపడ్డ వారు సమయానికి రక్తం ఎంతో మంది మరణించారు. ఆ ఘటనలు నన్ను బాధించాయి. అలాంటి ఘటనలు ఇకముందు జరగకూడదనే ఉద్ధేశంతోనే 24 సంవత్సరాల క్రితం బ్లడ్ బ్యాంక్ను స్థాపించాను. అభిమానులు బ్లడ్ డొనేట్ చేస్తూ దీనిని ఒక ప్రవాహంలా ముందుకు తీసుకువెళ్తున్నారు. యాభై అరవై సార్లు రక్తం దానం చేసిన వారికి చిరు భద్రతగా లైప్ ఇన్సూరెన్స్ కార్డులు అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గవర్నర్ గారి ప్రోత్సాహకం ఎంతో ఉత్సహాన్ని ఇస్తుందని, ఆమె ఎన్నో సార్లు ట్వీట్ల ద్వారా ఎంకరేజ్ చేశారు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. -
చిరంజీవి చారిటబుల్ ట్రస్టు వెబ్సైట్ ఆరంభం
హైదరాబాద్: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందించే సేవలను ఎక్కువమంది ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ ఆరంభించామని హీరో, నిర్మాత రామ్చరణ్ అన్నారు. www.chiranjeevicharitabletrust.com వెబ్సైట్తో ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి సినిమాలు, జీవిత విశేషాలు పొందుపరచిన www.kchirangeevi.com వెబ్సైట్ను కూడా సోమవారం హైదరాబాద్లో ఆరంభించామని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి వెబ్సైట్ ప్రారంభించాం. ఆక్సిజన్, రక్తం అవసరమైనవారు ఈ వెబ్సైట్ ద్వారా మాకు రిక్వెస్ట్ పంపవచ్చు. అలాగే రక్తదాతలు వారి వీలును బట్టి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని రక్తదానం చేయవచ్చు. నేత్రదానం చేయాలనుకున్నవారు రిక్వెస్ట్ పెడితే వెంటనే స్పందిస్తాం’అని పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సింహ వాహనంపై దేవదేవుడు
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
రైతన్నలకు విత్తన రాయితీ
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
794 ఫిర్యాదులకు పరిష్కారం
పథకాలు కొనసాగాలంటే జగనన్న రావాలి
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement