-
ఈ నగరానికి ఏమైంది?
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరం బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకే కాదు... విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్కు అడ్డాగా మారుతోంది. ఏటా రూ.వందల కోట్ల విలువైన సిగరెట్లు‘దిగుమతి’ అవుతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గడిచిన 15 రోజుల్లో రూ.7 కోట్ల విలువైన 58.49 లక్షల సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోలోని ఓ కంటైనర్లో ఉన్న రూ.6.33 కోట్ల విలువైన, గత శుక్రవారం కాచిగూడ రైల్వేస్టేషన్లో రూ. 65.96 లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ తరహా ఉదంతాలు నగరంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. సిటీ కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ రెండు బ్రాండ్లే ఎక్కువ.. హైదరాబాద్కు అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు డీఆర్ఐ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే డజరమ్ బ్లాక్, గుడాన్ గరమ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి ఇండోనేషియాలో తయారవుతున్నప్పటికీ అక్కడ నుంచి దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. అధికారుల కళ్లు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేర్లతో జరుగుతోందని నిర్థారిస్తున్నారు. ఈ రెండు బ్రాండ్ల తర్వాతి స్థానంలో లండన్లో తయారయ్యే బెల్సన్ అండ్ హెడ్జెస్, యూఏఈకి చెందిన మోండ్ బ్రాండ్లు ఉంటున్నాయి. ఒక్కోసారి ఒక్కో ‘మార్గంలో’... సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్ గతంలో సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా డైపర్లుగా పేర్కొంటూ కంటైనర్ ముందు వరుసల్లో వాటిని ఉంచి,, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్ఐ అధికారులు 2014లో దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితులను అరెస్టు చేశారు. ఆపై పంథా మార్చిన అదే గ్యాంగ్ ఇంజినీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్లోని ఎయిర్కార్గోపై 2015లో దాడి చేసిన డీఆర్ఐ రూ.51 లక్షల విలువైన 85,000 సిగరెట్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. తాజాగా చిక్కిన రెండు కన్సైన్మెంట్లలో ఒకటి కంటైనర్ల రూపంలో మరోటి రైలు మార్గంలో సిటీకి వచ్చినట్లు తేలింది. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులను నష్టాన్ని కలిగించే సిగరెట్లపై ప్రభుత్వం దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవైన సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే అనేక ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని డీఆర్ఐ గుర్తించింది. సిటీలో ఉన్న కొందరు హోల్సేలర్లతో సంబంధాలు పెట్టుకుంటున్న ఈ ముఠాలు వారి ద్వారానే అక్రమ సిగరెట్లను మార్కెట్లోకి చెలామణి చేస్తున్నాయి. అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు... విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులను ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో, ఎయిర్కార్గో కార్యాలయాల నుంచి తీసుకునేందుకు అనేక క్లియరెన్స్లు అవసరం. కస్టమ్స్ డ్యూటీ నుంచి వివిధ రకాలైన నిరభ్యంతర పత్రాలు దాఖలు చేస్తేనే గూడ్స్ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాం గ్స్ కస్టమ్స్ తరఫున పని చేసే కస్టమ్స్ హోమ్ ఏజెంట్లు (సీహెచ్ఏ)లతో పాటు అనేక మంది తో జట్టు కడుతున్నాయి. ఎగుమతి, దిగుమతి చేస్తున్నట్లు బోగస్ కంపెనీల పేర్లతో లెటర్ హెడ్స్ నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ పత్రాల వరకు అన్నీ బోగస్వి సృష్టించేస్తున్నాయి. వీటిని చూపిస్తూనే సరుకును బయటకు తీసుకువస్తూ భారీ గా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా కాచి గూడ రైల్వేస్టేషన్లలో చిక్కిన సిగరెట్లను ముఠా సభ్యులు మయన్మార్ నుంచి తీసుకువచ్చినట్లు డీఆర్ఐ ప్రాథమికంగా నిర్థారించింది. ఆరోగ్యానికీ చేటు.. అక్రమంగా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆయా సిగరెట్లు ఎక్కువసేపు కాలుతాయని, దీంతో పొగరాయుళ్ళు వాటి వైపు మొగ్గుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇండోనేషియా సహా వివిధ దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారన్నది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత వరకు అనుకూలమో చెప్పలేమని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. -
బంపర్ బొనాంజాతో దూసుకుపోతున్న ఐటీసీ
ముంబై : ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ సోమవారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. 12 వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత ఈసారి లాభాలను నమోదు చేయడంతో ఐటీసీ షేర్లు మార్కెట్లో జోరుగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక లాభాల్లో 5.67 శాతం వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం ఐటీసీ క్యూ 4 ఫలితాల్లో రూ 10, 060 కోట్ల అమ్మకాలతో దాదాపు రూ 2,500 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,361.18 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు 9.51 శాతం పెరిగి రూ.10,062.38 కోట్లకు చేరాయని ఐటీసీ బీఎస్ఈకి వెల్లడించింది. 2014-15 ఇదే త్రైమాసికంలో రూ.9,188 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. బోనస్: మెరుగైన ఫలితాల నేపథ్యంలో 1:2 నిష్పత్తిలో (ప్రతి రెండు షేర్లు ఒక షేరు ) బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్ షేర్ల జారీతో పాటు ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో సాధారణ షేరుకు రూ.8.50 డివిడెండ్ను(షేరుకు రూ .2 ప్రత్యేక డివిడెండ్ సహా ) ఇచ్చేందుకు బోర్డు సమ్మతి తెలిపింది. ఫలితంగా బీఎస్ఈలో సంస్థ షేరు పరుగులు తీస్తోంది. . బుల్లిష్ ట్రెండ్: ఐటీసీ లాభాలపై మార్కెట్ ఎనలిస్టులు, అంచనా సంస్థలు పాజిటివ్ గా స్పందించాయి. రాబోయే 2017సం.రానికి ఐటీసీ మరింత పుంజుకుని రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రెడిట్ స్యూజ్ కంపెనీ భరోసా ఇస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎబిట్(ఈబీఐటి) 9 శాతం ఆదాయాన్ని సాధించి అగ్రస్థానంలో నిలస్తుందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.అటు డ్యుయిష్ బ్యాంక్ సహా ట్రేడింగ్ సంస్థలన్నీ ఐటీసీ షేరు ధరలు మరింత పెరగనున్నాయని అంచనావేశాయి. సాధారణ వర్షపాతం అంచనాలతో ఎఫ్ ఎంసీజీ వ్యాపారాన్ని జోరు పెంచిందనా అంచనావేస్తున్నారు. ఒక్కో షేరు 400 రూ. లను చేరుతుందని భావిస్తున్నారు. కాగా సోమవారం ఐటిసి 5 అధిక శాతం పెరిగి రూ 347 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీలో అత్యధిక లాభాలతో మార్కెట్ ను లీడ్ చేస్తోంది. ఐటీసీ వ్యాపారంలో ప్రధానమైన సిగరెట్లపై10 శాతం ఎక్సైజ్ సుంకం వృద్ధితో కంపెనీ సిగరెట్ ధరలను 10-13 శాతం పెంచిందని షేర్ ఖాన్ తెలిపింది. ఐటీసీ అగ్రి వ్యాపారం రూ 1,800 కోట్లకు పెరగ్గా, కంపెనీ హోటళ్లు / పేపర్ వ్యాపారం 4.8 శాతం పెరిగింది. -
ఐటీసీ లాభం రూ. 2,635 కోట్లు
⇒ క్యూ3లో 10.5% పెరుగుదల ⇒ సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతే... న్యూఢిల్లీ: బహుళ వ్యాపార రంగ దిగ్గజం ఐటీసీ.. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.2,635 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,385 కోట్లతో పోలిస్తే లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. అయితే, కంపెనీ ఆదాయం మాత్రం నామమాత్రంగా 2 శాతం పెరిగి రూ.8,800 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో ఆదాయం రూ.8,623 కోట్లుగా ఉంది. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతమాత్రంగా కొనసాగడం మొత్తం ఆదాయాల పెరుగుదలపై ప్రభావం చూపింది. ఫలితాల్లో ముఖ్యాంశాలివీ... * సిగరెట్లు, ఇతరత్రా ఎఫ్ఎంసీజీ విభాగాల నుంచి క్యూ3లో రూ.6,456 కోట్ల ఆదాయం కంపెనీకి సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే 4.23% పెరిగింది. ఇందులో ఒక్క సిగరెట్ల విభాగం నుంచి రూ.4,142 కోట్ల ఆదాయం లభించింది. వృద్ధి 0.62%కి పరిమితమైంది. * గతేడాది బడ్జెట్లో సిగరెట్లపై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు పూర్తి ప్రభావంతో పాటు.. తమిళనాడు, కేరళ, అసోంలు వ్యాట్ను పెంచడంతో ఈ విభాగం నుంచి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. * ఇక హోటళ్ల వ్యాపార ఆదాయం మూడో క్వార్టర్లో 4.69% పెరిగి రూ.330 కోట్లుగా నమోదైంది. * అగ్రి బిజినెస్ ఆదాయం 10.55 శాతం దిగజారి రూ.1,598 కోట్లకు పరిమితమైంది. * పేపర్ బోర్డులు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార విభాగం ఆదాయం కూడా 4.66 శాతం క్షీణించి రూ.1,199 కోట్లకు తగ్గిపోయింది. * ఆదాయాల్లో వృద్ధి మందగమనంతో ఐటీసీ షేరు కుప్పకూలింది. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 5.01%(రూ.18.60) క్షీణించి రూ.352.60 వద్ద ముగిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement