-
టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ
కృష్ణా : ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. తేలప్రోలు గ్రామ సర్పంచ్ భర్త రామకృష్ణ తన కారులో వస్తూ ముందు వెళ్తున్న వైఎస్సార్సీపీ గ్రామ నాయకుడి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. విషయం తెలుసుకున్నటీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతపై దాడికి దిగారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయం తెలిసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ, టీడీపీ నాయకులు , కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తమపై దౌర్జన్యం చేశారంటూ వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో వున్న వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పరామర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తేలప్రోలులో 144 సెక్షన్ను విధించారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్యలను గన్నవరం పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నాయిపాలెంలో ఇరువర్గాల ఘర్షణ..
పిడుగురాళ్ల (గుంటూరు): గేదెలు విషయంపై రాజుకున్న వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణ దారితీసింది. దీంతో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గం ఇళ్లపై కత్తులతో, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం చెన్నాయిపాలెంలో మంగళవారం రాత్రి జరిగింది. చెన్నాయిపాలెం వైఎస్ఆర్సీపీకి చెందిన వారి గేదెలు ఇంటి తోలుకొస్తుండగా టీడీపీ వర్గీయులు కొందరు అడ్డగించారు. ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణగా మారింది. దీంతో టీడీపీకి చెందిన గండిగోట మురళీ, అనంత, హరికృష్ణ, రాఘవ, బాలకృష్ణ, మురళీ భార్య తదితరులు ఆవుల వెంకటకోటయ్య, శివయ్యల ఇంటిపై కత్తులు కొడవళ్లతో దాడిచేశారు. ఈ సంఘటనలో వెంకటకోటయ్య, శివయ్య తీవ్రగంగా గాయపడ్డారు. బాధితులు పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement