-
2019లో కాంగ్రెస్కు అధికారం ఖాయం
శాసనసభ పక్ష నేత జానారెడ్డి మిర్యాలగూడ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా మాయమాటలతో కాలం వెల్లబుచ్చుతోందని మండిపడ్డారు. గొర్రెలు, మేకలు ఇస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ .. మేపేందుకు భూమి లేదని, అందుకే ఇవ్వడం లేదని మరోసారి చెప్పే అవకాశం కూడా ఉందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేక కొనుగోలు చేయడానికి భూమి లేనందున ఇవ్వడం లేదని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లోపంతో రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచన, ఆశించిన విధంగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని జానారెడ్డి భరోసా ఇచ్చారు. -
అలాగైతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా!
12 శాతం రిజర్వేషన్లపై సీఎల్పీ నేత జానారెడ్డి సవాల్ మిర్యాలగూడ: ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ కట్టుకథలుగా ఆయన అభివర్ణించారు. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తమకు నానా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. కాంగ్రెస్వారు పేదలకు గూడు కట్టిస్తే మేము గుడి కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ అక్కడక్కడా పది డబుల్బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి మభ్యపెడుతున్నారని విమర్శించారు. మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో ఇరవై ఏళ్ల క్రితమే ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇప్పిం చామని, ఆయన ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతో కొత్తగా ఇచ్చేది ఏమీ లేదన్నారు. ఒక పం టకు నీళ్లివ్వడానికే ఇంజనీర్లు ప్రాజెక్టుకు డిజైన్ చేస్తారని, కానీ కేసీఆర్ మాత్రం రెండు పంటలకు నీళ్లిస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శిం చారు. ప్రాజెక్టుల పరిధిలో రెండు పంటలకు సాగు నీరందిస్తే తాను కేసీఆర్కు ప్రచార సారథిగా ఉంటానని ప్రకటించారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు పార్టీ మారుతున్నట్లు తనకు చెప్పారనడం అబద్ధమని జానారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారే విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే తాను వినలేదన్నారు. పార్టీలు మారినవారికి కాలమే సమాధానం చెబుతుం దని అన్నారు. -
ఎవరికి వారే యమునా తీరే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మారడం లేదు. అధికారంలో ఉన్నన్నాళ్లు గ్రూపు తగాదాలతో ఎవరికివారే పార్టీపై పట్టు సాధించేలా వ్యవహరించిన ఆ పార్టీ నాయకులు ప్రతిపక్షంలోకి వచ్చినా అదే రీతిలో ముందుకెళుతున్నారు. అత్యంత ప్రాధాన్యంగల ప్రతిపక్షనేత పదవి జిల్లాకు దక్కింది. ఆ పదవిలో ఉన్న నేతను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ జిల్లా నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యానాలు చర్చనీయాంశమవుతున్నాయి. సీఎల్పీ నేత జానారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఎంపీ పాల్వాయి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి మాట్లాడిన తీరు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలికి అద్దం పడుతున్నాయి. ఇంకా జిల్లా కాంగ్రెస్లో గ్రూపుల గోల సమసిపోలేదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ‘హస్త’వాసి మారదని స్పష్టం చేస్తున్నాయి. కమర్షియల్ లీడర్.. సీఎల్పీ నేత జానారెడ్డిని ఉద్దేశించి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ పార్టీలో వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఎంపీ పాల్వాయి గోవర్దనరెడ్డి జానాను నేరుగా విమర్శిస్తున్నారు. సీఎల్పీని నడిపించడానికి నిస్వార్థ నేతలు కావాలని, జానాలాంటి కమర్షియల్ లీడర్ కాదని ఆయన మాట్లాడిన తీరు రాష్ట్రకాంగ్రెస్లో చర్చకు దారితీశాయి. గవర్నర్లను కలిసి, వినతిపత్రాలు సమర్పిస్తే సరిపోదని, సొంతంగా ఎదిగిన నేతలే ప్రజాఉద్యమాలు నిర్మించగలరని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్లో జానా ఎదుగుదలనే ప్రశ్నించారనే భావన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏకంగా జానాను ఆ పదవినుంచి తొలగించి, కరీంనగర్కు చెందిన జీవన్రెడ్డిని నియమించాలని కూడా డిమాండ్ చేశారాయన. ఇక, కోమటిరెడ్డి మాటలను పరిశీలిస్తే నిత్యం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జానారెడ్డికి హితవు చెప్పేందుకే ఆయన విలేకరులతో మాట్లాడినట్టు అర్థమవుతోంది. ప్రతిరోజూ టీఆర్ఎస్ను విమర్శిస్తూ, కేసీఆర్పై దాడి చేసే విధానాన్ని కాంగ్రెస్ నేతలు మార్చుకోవాలని చెప్పిన కోమటిరెడ్డి... అసలు కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయత గల నేతలే లేరని, అందుకే తానే సొంతంగా ప్రజాసమస్యలపై ఉద్యమిస్తానని చెప్పడం ద్వారా అటు జానాతో పాటు ఇటు పొన్నాలపై కూడా ధిక్కార స్వరాన్ని వినిపించారు. మొత్తం మీద జానారెడ్డిని లక్ష్యంగా చేసుకుని వారం రోజుల వ్యవధిలో ఆ ఇద్దరు నేతలు చేసిన కామెంట్స్ ఇటు జిల్లా పార్టీ, అటు టీపీసీసీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. మరో వారంరోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల లోగుట్టును పరిశీలిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కష్టసాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. యమునా తీరేనా? ఇక, జిల్లా పార్టీలో మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన ఐదుగురు ఎవరి రీతిలో వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన భార్య పద్మావతిరెడ్డిలు ఒక గ్రూపుగా, జానారెడ్డి ఆయన శిష్యుడు భాస్కరరావు మరో గ్రూపుగా, కోమటిరెడ్డి ఒక్కరే ఇంకో గ్రూపుగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు కూడా గతంలో ఎలా వ్యవహరించారో అదే పద్ధతిలో వెళుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అటు రాష్ట్ర, ఇటు జిల్లా స్థాయిలో టీడీపీ నేతలు ఏకతాటిపై నడుస్తూ పార్టీ శ్రేణుల్లో కొంత నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తుండగా, జిల్లాలో మంచి పట్టున్న కాంగ్రెస్ నేతలు మాత్రం సమన్వయ లేమితో వ్యవహరించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీగా ప్రజాసమస్యలపై స్పందించి, నేతలంతా సమన్వయంతో ముందుకెళ్లాలన్నది వారి భావన. కానీ, అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో సగటు కాంగ్రెస్ వాది ఆశ నెరవేరుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement