-
TS:సీఎం ఆదేశించినా ఆబ్సెంట్..రివ్యూకు రాని ట్రాన్స్కో సీఎండీ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎం రేవంత్రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఉదయమే సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నన్ను పిలవలేదు.. సీఎండీ ప్రభాకర్రావు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని ప్రభాకర్రావు మీడియాకు చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. ఇదీచదవండి..జీవన్రెడ్డికి షాక్ల మీద షాక్లు -
జనవరి 3న తిరుపతికి ప్రధాని
► అదే రోజు ఎస్వీయూలో ఐఎస్సీ ప్రారంభం ►ఏర్పాట్లపై ఈనెల 16న తిరుపతిలో సీఎం సమీక్ష ►అధికారులందరూ బాధ్యతగా మెలగాలి ►కమిటీల కన్వీనర్లు,అధికారులతో కలెక్టర్ సమీక్ష సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనవరి 3 నుంచి 7 వరకూ తిరుపతిలో జరిగే జాతీయ స్థారుు ఇండియన్స సైన్స్ సభలను అధికారులందరూ విజయవంతం చేయాలనీ, ఇందుకోసం వివిధ కమిటీల కన్వీనర్లు బాధ్యతగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచించారు. మొదటి రోజైన జనవరి 3న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి చేరుకుంటారనీ, ఆయన చేతుల మీదుగానే సైన్స కాంగ్రెస్ ప్రారంభం జరుగుతుందన్నారు. ప్రధాని రాకను ధృవీకరిస్తూ పీఎంవో నుంచి ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వీయూ ఆవరణలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారిక రివ్యూలో కలెక్టర్ పాల్గొన్నారు. సైన్స కాంగ్రెస్ సభల నిర్వహణ కోసం జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. రిసెప్షన్, రవాణా, బస, భోజనం, విద్యుత్, ప్రచారం, మేనేజ్మెంట్ తదితర కమిటీల్లో ఉన్న కన్వీనర్లు, కోకన్వీనర్లు తమకు కేటారుుంచిన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న 15 రోజులు కీలకమైనవి కాబట్టి అధికారులు సాధ్యమైనంత వరకూ సెలవులను పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే అతిథులు, వీవీఐపీలను అత్యంత జాగ్రత్తగా, ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వారికిచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోపాలు జరగకూడదన్నారు. తిరుపతిలో జరిగేది ప్రపంచస్థారుు సైన్స పండుగగా కలెక్టర్ అభివర్ణించారు. సైన్స కాంగ్రెస్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ డీ. నారాయణరావు మాట్లాడుతూ, ఈనెల 16న సీఎం చంద్రబాబునాయుడు తిరుపతిలో మరోసారి సమీక్ష జరిపే అవకాశముందన్నారు. ఇప్పటివరకూ అన్ని విభాగాల్లోనూ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈనెల 20 నాటికి నూరు శాతం ఏర్పాట్లు పూర్తవుతాయని వివరించారు. సమీక్షలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పండాదాస్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, టీటీడీ జేఈవో ప్రోలా భాస్కర్, మహిళా యూనివర్సిటీ వీసీ డాక్టర్ దుర్గాభవానీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిపుణుల సలహా మేరకే చెట్లు నరికివేత ఇస్కా సభల నిర్వహణ పేరుతో అధికారులు వర్సిటీ ఆవరణలోని అందమైన, భారీ చెట్లను నరికివేస్తున్నారు. పరిపాలన భవనం పక్కనే ఉన్న 40 ఏళ్ల నాటి వృక్షాలను కూడా నేలకూల్చారు. నీడనిచ్చే చెట్లను నరికివేస్తుంటే చూపరుల ప్రాణం ఉసూరుమంటోంది. ఇదే విషయాన్ని పాత్రికేయులు ఎస్వీయూ వీసీ డాక్టర్ దామోదరం దగ్గర ప్రస్తావించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన వర్సిటీ భవనాలు కొన్ని చెట్ల కారణంగా పటిష్టత కోల్పోతున్నాయనీ, అంతేకాకుండా వివిధ రకాల అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగిస్తున్నామని వీసీ డాక్టర్ దామోదరం బదులిచ్చారు. అశోక, యూకలిప్టస్ చెట్ల వల్ల భవనాలకు నష్టం వాటిల్లుతుందనీ, ఉద్యానవన శాఖ నిపుణుల సూచనల మేరకు అటువంటి చెట్లను తొలగిస్తున్నామన్నారు. నష్టపోయే పచ్చదనాన్ని భర్తీ చేసేందుకు వర్సిటీ ఆవరణలో 7 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. -
మేయర్ చాంబర్లో సీఎం మకాం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను సీఎం చంద్రబాబు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచే పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం కౌన్సిల్ హాల్లో మేయర్ పోడియం వద్ద ప్రత్యేక వేదిక నిర్మిస్తున్నారు. కౌన్సిల్ హాల్ సమీపంలోని టౌన్ప్లానింగ్ ఆన్లైన్ విభాగం, సెక్రటరీ సెల్ను ఖాళీ చేయించారు. ఉన్నతాధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సోఫాలు, కుర్చీలు, మైక్లు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 5వ తేదీన యుద్ధప్రాతిపదికన ప్రారంభమైన పనులు 10వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. తొలుత మోడల్ గెస్ట్హౌస్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసే అద్దాల మందిరం నుంచి సీఎం పర్యవేక్షణ ఉండాలని భావించారు. అధికారులతో సమీక్షలు, ప్రెస్మీట్లు అన్నీ అక్కడే నిర్వహిస్తారు. ఆ ప్రాంతంలో సీఎం మకాం పెడితే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని పోలీస్ శాఖ సూచించింది. ఈ క్రమంలో వేదికను నగరపాలక సంస్థ కార్యాలయానికి మార్చారు. 12 రోజులూ కార్పొరేషన్లోనే.. పుష్కరాలు జరిగే 12 రోజులూ సీఎం కార్పొరేషన్ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తారు. సీఎం ఉండేందుకు అనువుగా మేయర్ చాంబర్లో వసతుల కల్పన చేపట్టారు. మంత్రులు, ముఖ్య అధికారులతో ఆంతరంగిక చర్చలన్నింటినీ సీఎం మేయర్ చాంబర్లోనే నిర్వహిస్తారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలను కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తారు. సీఎం, ఇతర అధికారులు రాకపోకలు సాగించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని పడమర వైపు ఉన్న కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్, యూసీడీ (అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్) షెడ్ను కూల్చివేశారు. పడమర వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్, పక్కన కొత్తగా ఏర్పాటుచేస్తున్న గేటు నుంచి అధికారుల వాహనాలు కార్యాలయంలోకి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇక్కడే మీడియా పాయింట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ హాల్ చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి రంగులు వేసి విద్యుత్ కాంతులు అమరుస్తున్నారు. -
పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్... జేసీ బి.లక్ష్మికాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్వర్తించాల్సిన విధులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేడుకల నిర్వహణకు ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతంని నియమించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వేడుకలకు పలువురు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని ట్రాఫిక్ ఐలాండ్లు, వేడుకలు జరుగనున్న పీటీసీ మైదానాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించాలని కార్పొరేషన్ కమిషనర్ చల్లాఓబుళేసు, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మైదానాన్ని అందంగా అలంకరించడంతో పాటు 10 సై్క బెలూన్లను ఏర్పాటు చేయాలని డ్వామా పీడీ నాగభూషణంని ఆదేశించారు. -
ఒకే యూనియన్కు ఆహ్వానమా?
సమీక్షకు టీఎంయూను మాత్రమే పిలవడంపై ఈయూ, టీఎస్ ఎన్ఎంయూ ఆగ్రహం ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించటమేనని విమర్శ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై సీఎం సమీక్షా సమావేశానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేతలను మాత్రమే ఆహ్వానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని టీఎంయూను మాత్రమే ఆహ్వానించారని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), టీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ మండిపడ్డాయి. ఓవైపు సీఎం సమీక్ష సమావేశం జరుగుతుండగా ఈ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని... ఇలాంటి తరుణంలో ఒక సంఘానికి అనుకూలంగా ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపించాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంయూకు అనుకూల ఫలితాలు రావటానికే ఇలా చేశారని, దీనిపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించడం ఏమిటని టీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు నాగేశ్వరరావు, మౌలానా, లక్ష్మణ్, రఘురాం, ఈయూ నేతలు బాబు, రాజిరెడ్డి ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాల నేతలు ఉంటే అధికారుల బండారం బయటపడుతుందన్న భయంతోనే తమను సమావేశానికి ఆహ్వానించలేదన్నారు. జరిగిందేమిటి? శుక్రవారం జరిగే సమీక్షకు ఆర్టీసీ గుర్తింపు సంఘం ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని గురువారం నాటి సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ప్రస్తుతం గుర్తింపు సంఘం అంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు అన్ని సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం వెళ్లాలి. లేదా గత ఎన్నికల ఫలితాల ఆధారంగా గుర్తింపు సంఘం నేతలను ఆహ్వానించాలి. అంటే గత ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ సంయుక్తంగా గుర్తింపు యూనియన్గా నిలిచినందున.. ఆ రెండు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలి. కానీ టీఎంయూ నేతలను మాత్రమే ఆహ్వానించడం వివాదానికి కారణమైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement