-
ఆదిలాబాద్లో ఇక సహకార పోరు
సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: ఇటీవలే అసెంబ్లీ ఎన్ని కలు నిర్వహించిన ప్రభుత్వం జనవరిలో పంచా యతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి తర్వాత ఫిబ్రవరిలో ‘సహకార’ పోరుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ఫ్యాక్స్) ఎన్నికలు నిర్వహించనుంది. గురువారం రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్త్రార్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని సహకార శాఖ అధికారులకు ఓటరు జాబితా ప్రక్షాళన పని ప్రారంభించారు. ఈ నెల 14న సంఘ కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ, మండల కార్యాలయాల్లో మొదటి ఓటరు జాబితాను అంటించనున్నారు. వీటిపై అభ్యంతరాలకు 21వ తేదీ వరకు గడువు విధించారు. సంఘాల్లో ఏవైనా కేసులు, సంఘంలో చేరి ఏడాది పూర్తి కానివారు, ఓటరు జాబితాలో పరిశీలించిన తర్వాత 28న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 76 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో 1.20 లక్షల మంది రైతులకు సభ్యత్వం ఉంది. గత పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసింది. 4వ తేదీ నుంచి ఆరు నెలలపాటు పాలకవర్గాల పదవీకాలన్ని ప్రభుత్వం పొడిగించింది. సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించింది. వీరు సహకార కమిషన్ కార్యాలయానికి వెళ్లి పదవీకాలన్ని పొడిగించుకున్నారు. ఆగస్టు నెలతో ఆరునెలల గడువు ముగియడంతో తిరిగి మళ్లీ ఆరు నెలలపాటు పదవీకాలన్ని పొడిగించారు. ఫిబ్రవరితో ముగియనున్న గడువు సహకార సంఘాల పాలకవర్గాలకు ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన గడువు వచ్చే ఫిబ్రవరి 3వ తేదీతో ముగిస్తుంది. దీంతో ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ లోగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఫ్యాక్స్ ఓటర్ల జాబితాలో సమూలంగా మార్చేస్తున్నారు. ఇంతకాలం అడ్డగోలుగా సభ్యత్వం తీసుకున్న వారిని తొలిగించేందుకు చర్యలు చేపట్టారు. గతంలో రూ.10 చెల్లించి సభ్యత్వం పొందగా, ఇప్పుడు సభ్యత్వ రుసుం రూ.300కు పెంచారు. రూ.10తో సభ్యత్వం తీసుకున్న వారు సభ్యులుగా కొనసాగే అవకాశం ఉన్నా.. ఓటు వేసే హక్కు ఉండదు. దీంతో పాటు ప్రతి సభ్యుడి ఫొటో, గుర్తింపుకార్డు వివరాలను ఓటరు జాబితాలో ముద్రించారు. ఈ నెల 14వ తేదీన అన్ని సంఘాల కార్యాలయాల వద్ద ఓటరు జాబితాను అతికించనున్నారు. ఇప్పటివరకు సీఈఏ అనే వ్యవస్థ లేకపోగా, ఇప్పుడు ఓటర్ల జాబితాలను ఫొటోలతో సహకార రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో జాబితాలను వెల్లడించి వాటిపై అభ్యంతరాలను ఈ నెల 22వ తేదీ వరకు స్వీకరించి మళ్లీ మార్పులు చేస్తారు. ఈ విధానం ఫ్యాక్స్తో పాటు ఇతర సంఘాలకు వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకుని ఏడాది గడువులోగా తిరిగి చెల్లించని వారి పేర్లను సహకార బ్యాంకులు ఎగవేతదారుల పేర్లు జాబితాలో పెడితే వారికి ఓటు హక్కు ఉండదు. జిల్లాల వారిగా సహకార సంఘాలు, సభ్యులు జిల్లా సంఘాలు సభ్యులు ఆదిలాబాద్ 28 53,391 మంచిర్యాల 20 23,056 నిర్మల్ 16 25,430 కుమురంభీం 12 18,167 మొత్తం 76 20,044 ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం.. సహకారం సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరితో ముగిస్తుంది. ఇప్పటికే రెండుమార్లు పదవీకాలం పొడిగించడం జరిగింది. దీంతో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఓటరు జాబితా ప్రక్షాళనకు ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 28వ తేదీ వరకు తుది ఓటరు జాబితాను సిద్ధం చేసి ఫిబ్రవరి 15వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– బి.సంజీవ్రెడ్డి, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల సహకార శాఖ అధికారి -
కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు
అధ్యక్ష పదవికోసం యూటీఎఫ్, ఎస్టీయూ పట్టు ఒక్కటైన ఎస్టీయూ, డీటీఎఫ్, పీఆర్టీయూ? నూజివీడు, న్యూస్లైన్ : నూజివీడులోని టీచర్స్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఉపాధ్యాయ సంఘాలయిన యూటీఎఫ్, ఎస్టీయూలు అధ్యక్ష పదవి మాకంటే మాకు కావాలని పట్టు విడవకుండా ఉండటంతో ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, బాపులపాడు మండలాల్లోని 269మంది ఉపాధ్యాయులకు ఈ సొసైటీలో ఓటుహక్కు ఉంది. ఈ సొసైటీ పాలకవర్గం ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 9 డెరైక్టర్ పదవులుండగా ఎన్నికైన అనంతరం వారిలో నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. నూజివీడు మండలంలో 146, ఆగిరిపల్లిలో 43, ముసునూరులో 34, బాపులపాడులో 31 ఓట్లు ఉన్నాయి. ఇంతకు ముందు నాలుగు యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యూటీఎఫ్కు చెందిన పీ జగదీశ్వరరావు అధ్యక్షుడిగా, ఎస్టీయూకు చెందిన తాడి.నర్శింహారావు కార్యదర్శిగా, డీటీఎఫ్కు చెందిన ఎస్.మురళీకృష్ణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో అధ్యక్ష పదవిని యూటీఎఫ్కు ఇచ్చిన నేపథ్యంలో ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని ఎస్టీయూ నాయకులు గట్టిగా కోరుతున్నారు. తమ యూనియన్కు ఎక్కువ ఓట్లున్నాయని, అధ్యక్ష పదవి ఎంతమాత్రం ఇచ్చేది లేదని, పోటీ చేసినా గెలుపు తమదేనని యూటీఎఫ్ నాయకులు తెగేసి చెప్పడంతో మూడు రోజులుగా ఉపాధ్యాయ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే డీటీఎఫ్, పీఆర్టీయూలు మాత్రం చెరి రెండు డెరైక్టర్ పదవులు ఇవ్వమని కోరుతున్నాయి. దీంతో శనివారం యూటీఎఫ్, ఎస్టీయూ, డీటీఎఫ్, పీఆర్టీయూలకు చెందిన వారు నామినేషన్లు వేశారు. 27న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఉపసంహరణ రోజు నాటికి నాలుగు యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైతే డెరైక్టర్లు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ డీటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ కలసి ఒక్కటై పోటీకి సిద్ధమైతే ఎన్నికలు తప్పవని సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement