-
కృష్ణపట్నానికి ‘మహానది’ బొగ్గు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్కో) చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు వీలుగా థర్మల్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన బొగ్గు సరఫరాను పెంచడానికి వివిధ సంస్థలతో ఇంధన సరఫరా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా.. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించింది. ఈ బొగ్గు సరఫరా సోమవారం నుంచి రైలుమార్గంలో మొదలైంది. ఫలించిన నిరంతర ప్రయత్నం.. ఏపీజెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లు 5,811 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనికోసం ఎంసీఎల్ నుంచి సంవత్సరానికి 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్సీసీఎల్లు రాష్ట్రంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. అయితే, కొంతకాలంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడటంతో సరఫరా కూడా మందగించింది. కేంద్ర ప్రభుత్వమే థర్మల్ కేంద్రాలకు బొగ్గు కోటాను నిర్ణయించడం మొదలుపెట్టింది. మరోవైపు.. థర్మల్కు బొగ్గు నిల్వలను సమకూర్చుకోవాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నిరంతర పర్యవేక్షణలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్తో సంప్రదింపులు జరిపారు. దీంతో ఈ ఏడాది మార్చి 10 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల యూనిట్కు మే 1 నుంచి బొగ్గును కేటాయించడానికి ఎంసీఎల్ అంగీకరించింది. మరింత మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ యూనిట్తో రాష్ట్రంలోని రోజువారీ విద్యుత్ అవసరాలకు దాదాపు 16 మిలియన్ యూనిట్లు సమకూరుతున్నాయి. మహానది నుంచి దీనికి బొగ్గును సరఫరా చేయడంవల్ల విద్యుదుత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా అన్ని రంగాలకు ఎలాంటి లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్)లు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెరుగుతున్న స్టేట్ గ్రిడ్ డిమాండ్ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. – కేవీఎన్ చక్రధర్బాబు, ఎండీ, ఏపీజెన్కో -
Super Vasuki: ఈ గూడ్స్కు 295 వ్యాగన్లు!
న్యూఢిల్లీ: సాధారణ గూడ్స్ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన ‘సూపర్ వాసుకి’ని ఆగ్నేయ మధ్య(సౌత్ ఈస్ట్ సెంట్రల్) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది. మూడున్నర కిలోమీటర్ల పొడవు, 295 వ్యాగన్లతో 27 వేల టన్నులకు పైగా బొగ్గును తీసుకుని ఈ భారీ రైలు ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి నాగ్పూర్ సమీపంలోని రాజ్నంద్గావ్కు చేరుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సోమవారం సూపర్ వాసుకిని నడిపి చూసినట్లు అధికారులు చెప్పారు. కోర్బా నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరిన ఈ గూడ్స్ 267 కిలోమీటర్ల దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది. ఒక్కో స్టేషన్ను దాటేందుకు వాసుకికి సుమారు 4 నిమిషాలు పట్టింది. ఇప్పటి వరకు నడిపిన అత్యంత పొడవైన, అతి భారీ గూడ్స్ రైలు ఇదేనని రైల్వే శాఖ వెల్లడించింది. సూపర్ వాసుకి తీసుకువచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఒక రోజంతా నడుస్తుందని అధికారులు చెప్పారు. సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లలో 9 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయగలుగుతుంది. -
సింగరేణికి రూ.1,200 కోట్ల లాభాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గతేడాది కనకవర్షం కురిపించింది. టర్నోవర్, లాభాలు, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు అంశాల్లో గణనీయ వృద్ధి సాధించి పాత రికార్డులను అధిగమించింది. సంస్థ 2017–18లో రికార్డు స్థాయిలో రూ.1,200 కోట్ల లాభాలు ఆర్జించింది. 2016–17లో సాధించిన రూ.395 కోట్ల లాభాలతో పోల్చితే గతేడాది సాధించిన లాభాలు 203 శాతం అధికం కావడం గమనార్హం. 2016–17లో రూ.17,743 కోట్ల టర్నోవర్ సాధించగా, గతేడాది రూ.22,667 కోట్ల టర్నోవర్ సాధించి 27.8 శాతం వృద్ధి నమోదు చేసింది. 2016–17లో 608 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా, 2017–18లో 646 లక్షల టన్నులకు పెంచి 6.2 శాతం వృద్ధిని సాధించింది. 26.9 శాతం వృద్ధి రేటుతో 396 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించింది. గత 4 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటూ రానున్న 5 ఏళ్లలో సుమారు రూ.12 వేల కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి ప్రణాళికను అమలు చేయనున్నామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ రికార్డు స్థాయిలో ప్రగతి సాధించడానికి కారణమైన కార్మికులకు అభినందనలు తెలిపారు. రానున్న ఐదేళ్లకాలంలో 13 కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తామనీ, దీంతో బొగ్గు ఉత్పత్తి 850 లక్షల టన్నులకు పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.22,667 కోట్ల టర్నోవర్ మరో 5 ఏళ్లలో రూ.34,000 కోట్లకు చేరుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కారుణ్య నియామకాల అమలు, మ్యాచింగ్ గ్రాంటును పది రెట్లు పెంచి పంపిణీ చేయడం, సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం, కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు పథకం, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, ఐఐటీ, ఐఐఎంలో చదివే కార్మికుల పిల్లలకు కంపెనీ ద్వారా ఫీజుల చెల్లింపు, లాభాల బోనస్ను 25 శాతానికి పెంచి కార్మికులకు అందజేయడం, పండుగ అడ్వాన్సును భారీగాపెంచి పంపిణీ చేయడం, తెలంగాణకోసం పాటుపడిన కార్మికులందరికీ 2014 నుండి తెలంగాణ ఇంక్రిమెంటు అమలు జరపడం, మెడికల్ అన్ఫిట్ కేసులో ఉద్యోగం వద్దనుకొనే వారికి ఏకమొత్తంగా రూ.25 లక్షల చెల్లింపు లేదా నెలకు రూ.25 వేల చెల్లింపు పథకం, అన్ని గనుల్లో క్యాంటీన్ల ఆధునీకరణ, అంబేడ్కర్ జయంతి, రంజాన్, క్రిస్టమస్ పండుగలను సెలవు దినాలుగా గుర్తింపు వంటివి అమలు జరుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశంపై సింగరేణి సంస్థలో ఖాళీలను గుర్తించి 7,200 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించామని, అలాగే 2,718 మంది బదిలీ వర్కర్లను ఒకేసారిగా జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశామన్నారు. -
బొగ్గు బండి
వరంగల్ నుంచి తాండ్ర కృష్ణగోవింద్: బొగ్గుతో నడిచే ఆరివి ఇంజన్తో ప్రారంభమైన రైల్వే వ్యవస్థ నేడు బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం వందలాది టన్నుల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును రైళ్లద్వారా తరలిస్తున్నారు. గోదావరి – ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం 1, 2, 3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, అడ్రియాల ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి జరుపుతోంది. సింగరేణి బొగ్గు.. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సిమెంటు పరిశ్రమలకు ఎక్కువగా సరఫరా అవుతోంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా బొగ్గును పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు. బొగ్గు రవాణా వల్లే రైలు మార్గాలు.. బ్రిటిష్ కాలంలో కేవలం బొగ్గు రవాణాను దృష్టిలో ఉంచుకునే ఇల్లందు, కొత్తగూడెం – మణుగూరు వంటి ప్రాంతాలకు రైలుమార్గం నిర్మించారు. చెన్నై – న్యూఢిల్లీ గ్రాండ్ట్రంక్ మార్గంలో రామగుండం, బెల్లంపల్లి, మందమ ర్రి వంటి ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఒక్క భూపాలపల్లి ఏరియాను మినహాయిస్తే మిగి లిన సింగరేణి ఏరియాలు రైలు మార్గంతో అనుసంధానమై ఉన్నాయి. దీంతో రైలుమార్గం ద్వారా భారీగా బొగ్గు రవాణా జరుగుతోంది. రైలు వ్యాగన్ల ద్వారా రవాణా అవుతున్న బొగ్గులో 90% ఎన్టీపీసీ (రామగుండం, సింహా ద్రి), కేటీపీఎస్ (కొత్తగూడెం), జైపూర్, వీటీపీ ఎస్ (విజయవాడ), ఎస్డీఎస్టీ (నెల్లూరు), ఆర్టీపీసీ (కడప)లలో ఉన్న విద్యుత్ కేంద్రాలకు సరఫరా అవుతోంది. పెరిగిన ఉత్పత్తి 80వ దశకం వరకు భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగేది. ఆ తర్వాత ఓపెన్కాస్ట్ గనుల ద్వారా ఉత్పత్తి ప్రారం భమైంది. ఉపరితల గనుల్లో యంత్రాలు వినియోగించడం వల్ల వ్యయం తక్కువ. దీంతో ఏకంగా అడ్రియాల ఓపెన్ కాస్టు పేరుతో ఒక ఏరియా ఏర్పాటు చేశారు. ఓపెన్కాస్టులు, యాంత్రీకరణ ఫలితంగా క్రమంగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. 1990లో 1.20 లక్షల మంది కార్మికులు సాలీనా 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 56 వేల మంది కార్మికులు 61 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో అధిక భాగం రైలు మార్గం ద్వారానే రవాణా చేస్తున్నారు. 74,54,622 సింగరేణి నుంచి 2016–17లో ఇప్పటి వరకు వ్యాగన్ల ద్వారా రవాణా అయిన బొగ్గు (టన్నుల్లో) మొత్తం 2016–17లో సింగరేణి నుంచి ఏరియాల వారీగా రైలు వ్యాగన్ల ద్వారా రవాణా అయిన బొగ్గు -
ఓబీ వెలికితీతలో ఆర్జీ–2 రికార్డ్
సింగరేణిలోనే నంబర్ వన్ యైటింక్లైన్ కాలనీ: సింగరేణి సంస్థలోనే అత్యధిక ఓబీ వెలికితీసి ఆర్జీ–2 డివిజన్ నంబర్వన్ గా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఐదు ఓసీపీల కన్నా అత్యధిక ఉత్పత్తి తీయడమే కాకుండా ఓబీ వెలికితీతలో రికార్డు నెలకొల్పింది. ఓసీపీ–3 చరిత్రలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ నెలలో 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత లక్ష్యానికి గాను 18.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని వెలికితీసి ప్రాజెక్టు రికార్డులను తిరగరాయడంతో పాటు సింగరేణి సంస్థలోనే నంబర్వన్ స్థానం పొందింది. బొగ్గు రవాణాలో కూడా మొదటి స్థానం డిసెంబర్ నెలలో 130 రేకుల బొగ్గు రవాణా చేసి ఓసీపీ–3 సీహెచ్పీ మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క శనివారం 7 రేకుల బొగ్గు రవాణా చేసేందుకు నిర్ణయించి రవాణా రోజుగా తీసుకున్నామన్నారు. సింగరేణిలోనే ఒక నెలలో అత్యధికంగా బొగ్గు రవాణా చేసిన డివిజన్ గా రికార్డు సాధించినట్లు ఆర్జీ–2 జీఎం విజయపాల్రెడ్డి వెల్లడించారు. రికార్డులకు కారణమైన డివిజన్ ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement