-
డీ గ్యాంగ్ కోడ్స్ ఇవే...
సాక్షి, న్యూఢిల్లీ: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోడ్ పదాల గురించి పోలీసులు అదుపులోకి తీసుకున్న గ్యాంగ్స్టర్ ఇక్బాల్ కస్కర్ పలు వివరాలు వెల్లడించాడు. నేర కార్యకలాపాలను చేపట్టే క్రమంలో దావూద్ నడిపే డీ కంపెనీ వాడే కోడ్ పదాలను ఇక్బాల్ వివరించాడు. వీరు మోదీ, ఢిల్లీ పదాలను చోటా షకీల్, కరాచీలకు కోడ్ పదాలుగా వాడతారని వెల్లడించాడు.ఇక దావూద్ ఇబ్రహీంను డీ గ్యాంగ్ బడే అనే కోడ్తో పిలుస్తుంది. పోలీస్ వాహనాన్ని డబ్బాగా వ్యవహరిస్తారు. రూ లక్షను ఏక్ డబ్బాగా పేర్కొంటారు. రూ కోటికి ఏక్ బాక్స్ కోడ్ వాడతారని కస్కర్ పోలీసులతో పేర్కొన్నట్టు సమాచారం. తమ ఆపరేటర్లతో మాట్లాడే సందర్భంలో దావూద్ గ్యాంగ్ ఈ కోడ్ పదాలను ప్రయోగిస్తుంది. ఈ వివరాలతో పాటు తన సోదరులు దావూద్, అనీస్ ఇబ్రహీంలు పాకిస్తాన్లో ఉన్నారని కస్కర్ నిర్ధారించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తప్పించుకునేందుకు వారు ఎలాంటి పత్రాలు లేకుండా దుబాయ్ వెళుతుంటారని పేర్కొన్నట్టు సమాచారం. -
చింటు సార్.. టెర్రర్ బాస్!
నయీమ్ డైరీలో వెలుగు చూసిన ‘కోడ్’ పేర్లు ఇవీ.. ♦ వీరితోనే అతడికి సన్నిహిత సంబంధాలు ♦ పోలీసు అధికారులుగా అనుమానాలు ♦ లోతుగా ఆరా తీస్తున్న సిట్ ♦ నాటి నేరాల్లో ‘లొంగుబాట్ల’పైనా సమీక్ష సాక్షి, హైదరాబాద్ కరడుగట్టిన నేరగాడు నయీమ్ కేసు దర్యాప్తులో భాగంగా అతడి డెన్స్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, పుస్తకాలను పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడ్ రూపంలో అనేక పదాలు, పేర్లు బయటకు వస్తుండడంతో వాటిని డీ–కోడ్ చేయడంపై దృష్టి కేంద్రీకరించాయి. పోలీసు–రాజకీయ–వ్యాపార ప్రముఖులతో సంబంధాలు కొనసాగించిన నయీమ్ ప్రతి ఒక్కరికీ ఒక్కో మారుపేరు (కోడ్ నేమ్) పెట్టుకున్నాడు. వారందరికీ తాను ఎలా ఉపయోగపడింది, వారిని తాను ఎలా వాడుకుంది అన్న అంశాలను డైరీల్లో రాసుకున్నాడు. నయీమ్, అతడి అనుచరుల స్థావరాలపై దాడులు చేస్తున్న పోలీసు, సిట్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు. పుప్పాలగూడ అల్కాపురి టౌన్షిప్లోని నయీమ్ ఇంట్లో బెడ్రూమ్ను తనిఖీ చేసిన పోలీసులు ఓ కీలకమైన డైరీతో పాటు ఆల్బమ్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎవరా ఇద్దరు..? నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఇద్దరి పేర్ల ప్రస్తావన ఎక్కువగా ఉంది. అనేక సందర్భాలను వివరిస్తూ ‘చింటు సార్’, ‘టెర్రర్ బాస్’ అని పేర్కొన్నాడు. వీరిద్దరితోనే నయీమ్ అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా వారిద్దరూ పోలీసు అధికారులే అయి ఉంటారని భావిస్తు న్నారు. ఈ ఇద్దరిలో ‘టెర్రర్ బాస్’ కంటే ‘చింటు సార్’తోనే నయీమ్ అత్యంత దగ్గరగా మెలిగాడని, ఆయనకే ‘విలువైన గిఫ్ట్’లు ఇచ్చాడని డైరీలో ఉన్న వివరాలను బట్టి తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ‘వడపోతల‘పై అధికారుల దృష్టి నయీమ్తో అంటకాగిన, అతడి అక్రమాలకు సహకరిస్తూ లబ్ధి పొందిన పోలీసుల్ని గుర్తించడం కోసం అధికారులు వడపోత ప్రక్రియ చేపట్టారు. ఈ ఘరానా నేరగాడు ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసు, నిఘా వర్గాలకు దగ్గరై సుదీర్ఘకాలం ఇన్ఫార్మర్గా పని చేశాడు. ఈ క్రమంలో కొందరు అధికారులు అతడితో సంబంధాలు కొనసాగించి, కొన్ని రకాలైన సహాయాలు చేసే అవకాశం ఉంది. ఇదంతా పోలీసింగ్లో భాగమే అంటున్న అధికారులు మరో కోణంపై దృష్టి పెట్టారు. ఇన్ఫార్మర్ నుంచి గ్యాంగ్స్టర్గా మారుతున్న సందర్భంలో.. అతడికి సహకరించడం, అతడి ద్వారా లబ్ధి పొందడం, అరాచకాలను చూసీచూడనట్లు వదిలేయడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు. నయీమ్ డైరీలో అలాంటి అధికారులు ఎవరున్నారు? ఎలా వ్యవహరించాన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఆ లొంగుబాట్ల వెనుకా పోలీసులు? నల్లగొండ జిల్లాల్లో హత్యకు గురైన సాంబశివుడు, రాములుతోపాటు హైదరాబాద్లో పట్టపగలు నడిరోడ్డుపై హత్యకు గురైన పటోళ్ల గోవర్ధన్రెడ్డి వరకు దాదాపు ప్రతి కేసులో నయీమ్ పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఉంది. అలాగే ఇతడు చేయించిన దారుణాల తర్వాత నిందితులు నేరుగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం పరిపాటి. నేరాలు చేసేది ఒకరైతే... వారిని కాపాడటం కోసం వాటిని తమపై వేసుకుని లొంగిపోయేది వేరొకరని ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ప్రస్తుతం నయీమ్ వెనుక ఉన్న ‘షాడోలను’ గుర్తించేందుకు పోలీసు విభాగం.. ఇలాంటి లొంగుబాట్లపై దృష్టిపెట్టింది. ఆయా నేరాలు ఎక్కడ జరిగాయి? కేసులు ఎక్కడ నమోదయ్యాయి? నిందితులు ఎక్కడ లొంగిపోయారు? ఎవరి ద్వారా పోలీసుల ఎదుటకు వచ్చారు? తదితర అంశాలను విశ్లేషించాలని నిర్ణయించారు. దీని ద్వారా నయీమ్కు సహకరించిన వారిని గుర్తించే ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆల్బమ్స్లో ఉన్న ఫొటోల్లోని వ్యక్తులు/అధికారులను గుర్తిస్తున్నారు. ఆ ఫొటో దిగిన సందర్భం, వారితో నయీమ్కు ఉన్న సంబంధాలపై స్పష్టత వచ్చాక తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement