-
ఆ కథకే గ్రీన్ సిగ్నల్?
ఎన్టీఆర్ కొత్త సినిమా కబురు ఎప్పుడు చెబుతారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులు అరవై రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అరవై ఏంటనుకుంటున్నారా? ఎన్టీఆర్ ఇటీవల నటించిన ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబర్ 1న విడుదలైంది. అంటే.. అప్పుడే అరవై రోజులు దాటింది. దాంతో ఈ హీరోగారు చేయబోయే తదుపరి సినిమా ఏంటి? అనే చర్చ జరుగుతోంది. అగ్ర దర్శకులు పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల నుంచి యువ దర్శకులు ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి, ‘ప్రేమమ్’తో హిట్ అందుకున్న చందూ మొండేటిల వరకూ పలువురి పేర్లు ఎన్టీఆర్తో సినిమా చేయబోయే దర్శకుల జాబితాలో వినిపించాయి. మొత్తానికి ప్రచారంలో చాలా కాంబినేషన్లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఈ కాంబినేషన్లలో సెట్స్పై వెళ్లేది ఏది? సైడ్ రూట్లోకి వెళ్లేది ఏది? ప్రశ్నలు ఎన్నో... ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ రెండు నెలల్లో ఈ యంగ్ హీరో పలు కథలు విన్నారు. అందులో ఎన్టీఆర్కి నచ్చినవి కొన్ని ఉన్నాయట. కానీ, ప్రస్తుతం సెట్స్పైకి వెళ్లేది మాత్రం అన్నయ్య నందమూరి కల్యాణ్రామ్కు ‘పటాస్’ వంటి కమర్షియల్ హిట్ అందించిన అనిల్ రావిపూడి కథేనట. ఓ వారం రోజులుగా ఈ కథపైనే ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడిలు డిస్కషన్స్ చేస్తున్నారట. ‘దిల్’ రాజు ఈ సినిమా నిర్మిస్తారని టాక్. ఇందులో అంధుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. కమర్షియల్ హంగులతో కూడిన వైవిధ్యమైన సినిమాగా తెరకెక్కించనున్నారట. ఇదిలా ఉంటే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అదుర్స్-2’ చేయనున్నారనీ... ఎన్టీఆర్ ఖాళీగా ఉన్న ప్రతిసారీ ఈ రెండు వార్తలూ వినిపిస్తుంటాయి. ఇవి పక్కన పెడితే.. దర్శకుడు చందూ మొండేటి చెప్పిన లైన్ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి.. వినాయక్, త్రివిక్రమ్లతో ఎప్పుడు? చందూ సినిమా ఎప్పుడు? అనేది వేచి చూడాలి. -
‘ఆదోని’ సంఘటనలతో...
‘‘పాటల చిత్రీకరణ కనువిందుగా ఉంది. కమర్షియల్ సినిమాకు అవసరమైన అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. కన్నడంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు శ్రీవాస్ పేర్కొన్నారు. నీరజ్ శామ్, సాయికుమార్, నేహా సక్సేనా, దిశ ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి సంగీతం, దర్శకత్వం వహించిన ‘దండు’పాటలను విడుదల చేశారు. దర్శకులు ముప్పల నేని శివ, శ్రీవాస్ బిగ్ సీడీ, పాటల సీడీలను నిర్మాతలు ‘మల్టీ డైమన్షన్’ వాసు, రామ సత్యనారాయణ, మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు.1970 నుంచి 1996 వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందించానని దర్శకుడు అన్నారు. సహ నిర్మాతలు మేగోటి ఉమామ హేశ్వరి, సత్యవతి, ఇ.రాము, లండన్ గణేష్ పాల్గొన్నారు. -
కమర్షియల్ చిత్రంగా సవాలే సమాళి
సవాలేసమాళి చిత్రం జనరంజక అంశాలతో పక్కా కమర్షియల్ చిత్రం గా ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సత్యశివ తెలిపారు. ఈయన కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు అరుణ్పాండియన్ సమర్పణలో ఏ అండ్ పీ గ్రూప్ పతాకంపై కవితాపాండియన్, ఎస్ఎన్.రాజరాజన్ నిర్మిస్తున్నారు. అశోక్ సెల్వన్, బిందుమాధవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగన్, నాజర్, కరుణాస్, స్వాతి, గంజాకరుప్పు, ఎంఎస్.భాస్కర్, మనోబాలా, ప్రీతీదాస్, వైయాపురి, పరవై మునియమ్మ ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తిపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎస్ఎస్.తమన్ సంగీత స్వరాలందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సవాలేసమాళి చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. చిత్రంలో నటించిన ప్రతి నటుడు, నటి పాత్రలుగా మారి వినోదంలోనూ దుమ్మురేపారని తెలిపారు. ఎస్ఏ.సూర్య ప్రశంసలు చిత్రంలోని నల్లవనా కెట్టవనా ఆంబళ తెరియామ తవిక్కిరాడా పొంబళ పాట విన్న నటుడు, దర్శకుడు ఎస్ఏ సూర్య చాలా బాగుందని మెచ్చుకుంటూ పాట చిత్రీకరణ ఎప్పుడో చెప్పండి తాను వస్తానని అన్నారన్నారు. అలాగే మహాబలిపురంలో అశోక్ సెల్వన్, జగన్, ఐశ్వర్యలపై ఈ పాటను చిత్రీకరించినప్పుడు ఎస్ఏ.సూర్యకు చెప్పగా షూటింగ్ స్పాట్కు వచ్చి చూసి చిత్రీకరణ బాగుందంటూ అభినందించారని చెప్పారు. నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య ప్రత్యేక పాటలో నటించడం ఇదే తొలిసారి అని అన్నారు.చిత్రాన్ని సెప్టెంబర్ 4 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
తొలియత్నం: ఈ సినిమాకి స్క్రీన్ప్లేనే బలం!
‘షో’... చిన్న సినిమానా, పెద్ద సినిమానా? ఆర్ట్ సినిమానా, కమర్షియల్ సినిమానా? రొటీన్ సినిమానా, డిఫరెంట్ సినిమానా? ఏదైతేనేం... థియేటర్ల నుంచి ఫిలిం ఫెస్టివల్స్ దాకా ప్రశంసలు అందుకుంది. నేషనల్ అవార్డునూ గెలుచుకుంది. నీలకంఠ లాంటి ఓ అద్భుతమైన దర్శకుడుని సినీ ప్రపంచానికి పరిచయం చేసిన ఆ ‘షో’ తాలూకు వెలుగు నీడలివి... నేను డెరైక్టర్ కావడానికి ప్రేరణ బాలచందర్గారు. ఆయన తన సినిమాల్లోని పాత్రల తాలూకు అంతరంగాన్ని అద్భుతంగా చిత్రిస్తారు. నేనూ ఆయనలానే సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో చిత్రరంగంలోకి అడుగుపెట్టాను. మరోవైపు సత్యజిత్ రే, బసు ఛటర్జీ, హృషికేశ్ ముఖర్జీ, శ్యామ్ బెనగళ్, బిమల్రాయ్ల సినిమాలు... దర్శకత్వం పట్ల నా అవగాహనను మరింత మెరుగుపరిచాయి. కళాత్మక విలువలతో నిండిన బాపు, విశ్వనాథ్, బాలచందర్ సినిమాలు కమర్షియల్గా కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. కానీ ప్రేక్షకులు మాత్రం సినిమాలను ఆర్ట్, కమర్షియల్ సినిమాలుగా ఎందుకు విడదీసి చూస్తారో అని ఆశ్చర్యపోయేవాడిని. ఇలాంటి ఆలోచనలతో సినిమా రంగంలోకి ప్రవేశించి కొన్ని సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశాను. ఆ తర్వాత సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి నిర్మాతగా నేనే సినిమాలు తీయాలనుకున్నాను. మొదట కృష్ణగారు హీరోగా భారతీరాజాతో ‘జమదగ్ని’ సినిమాను నిర్మించాను. కానీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. నిర్మాతగా నన్ను నిరుత్సాహపరిచిన ఆ సినిమా... నిర్మాణాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు మాత్రం సహకరించింది. కొంత గ్యాప్ తరువాత తమిళంలో రేవతి హీరోయిన్గా ప్రియాంక సినిమాకు దర్శకత్వం వహించాను. హిందీ దామినికి రీమేక్గా తీసిన ప్రియాంక ఒక మాదిరిగా నడిచింది. కానీ రేవతికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ దక్కింది. తరువాత చాలామంది దాన్ని రీమేక్ చేయమని అడిగారు. కానీ రీమేక్ సినిమా డెరైక్టర్గా మిగిలిపోవడం నాకిష్టం లేదు. దాంతో చేయలేదు. అలా అన్ని అవకాశాలనూ కాదనుకున్నందుకు దాదాపు ఏడేళ్ల గ్యాప్ వచ్చింది. ఈసారి తెలుగులో నా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాను. నాదైన సొంత కథతో, విభిన్నంగా, వినూత్నంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నాను. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక సందర్భంలో పరమహంస యోగానంద ఆత్మకథ చదివాను. అందులో ఆయన లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చదివి చాలా ఉత్సుకతకు లోనయ్యాను. ఆయన ఆలోచనల నుంచి ఒక రకమైన స్ఫూర్తి పొందాను. ఆ తరువాత సినిమా కథ గురించి ఆలోచిస్తున్న క్రమంలో కేవలం రెండు పాత్రలతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. ఒకరోజు మంజులను కలిసినప్పుడు తను ఒక లో-బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పారు. అప్పటికే ఆవిడ టీవీ సీరియల్స్ ప్రొడక్షన్లో ఉన్నారు. ‘షో’ ఐడియా చెప్పగానే తనకు బాగా నచ్చి, సినిమా చేద్దామని ముందుకొచ్చింది. అప్పుడు స్క్రిప్ట్ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. కథ మొదట ఒక మర్డర్ మిస్టరీలా, థ్రిల్లర్ మాదిరిగా తయారైంది. దానివల్ల కొన్ని లిమిటేషన్స్ ఏర్పడ్డాయి. అప్పుడు నాకది రెగ్యులర్ ఫిలిమ్లా అనిపించింది. తరువాత కథను సోషల్ డ్రామాలా మార్చాను. దానివల్ల పాత్రలకు ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చింది. స్క్రిప్ట్లో చాలా లేయర్స్ కనిపించేట్టు జాగ్రత్త తీసుకున్నాను. ఈ స్క్రిప్ట్ ప్రత్యేకత ఏమిటంటే... సినిమాని, రంగస్థలాన్ని ఒకే దగ్గరకు తీసుకురావడం. ఈ ప్రక్రియ నాకు తెలిసి అంతవరకూ ఎక్కడా లేదు. కథ విన్న ఒకరిద్దరు మిత్రులు రెండు పాత్రలతో సినిమా అంటే ఇరవై నిమిషాల తరువాత బోర్ కొడుతుంది అన్నారు. నేను రెండు గంటల సేపు బోర్ కొట్టకుండా తీయగలనని, అదొక ఎమోషనల్ ట్రావెల్లా ఉంటుందని చెప్పాను. తరువాత అధ్యాయం ఆర్టిస్టుల అన్వేషణ. స్క్రిప్ట్కు న్యాయం జరగాలంటే దానికి తగిన ఆర్టిస్టులు దొరకాలి. అప్పుడే మన స్వప్నం నిజమవుతుంది. మంజులకు కథ చెబుతున్నప్పుడు రిధిమ పాత్రకు తను హండ్రెడ్ పర్సంట్ ఫిట్ అవుతుందనిపించింది. మాధవ్ పాత్రకు కొత్త ముఖాన్ని తీసుకోవాలని ఆలోచించాను. ఆ క్రమంలో సూర్య నటించిన ఒక సినిమా చూసి తనే ఆ పాత్రకు న్యాయం చేయగలడనిపించింది. ఎందుకంటే మాధవ్ పాత్ర మొదట మంచి మనిషిగా, తరువాత ఒక సైకోగా, అటు నుంచి ఒక ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్గా... మూడు షేడ్స్లో కనిపించాలి. అలాంటి విభిన్నమైన పాత్రకు పర్ఫార్మెన్స్తో పాటు లుక్ కూడా ఉండాలి. విచిత్రమేమిటంటే ఈ సినిమాకు నేననుకున్న ప్రతిదీ ఏదో అదృశ్య శక్తి సమకూర్చినట్టుగానే జరిగిపోయేది. స్క్రిప్ట్ ఒక లొకేషన్లో అనుకున్నాను. ఒక ఇల్లు, అందులో తోట, కొలను, ఇంటి మధ్యలో మెట్లు... ఇలా ఉంటే బాగుంటుందని రాసుకున్నాను. అలాంటి లొకేషన్ కోసం హైదరాబాద్లో వెదకసాగాను. అంతలో నా మిత్రుడు మదనపల్లిలో ఒక లొకేషన్ చెప్పాడు. నేనా ఇల్లు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ జర్మనీలో పనిచేసి రిటైరై, ఇండియాకు వచ్చిన ప్రొఫెసర్ అని రాసుకున్నాను. నేను కథలో రాసుకున్న క్యారెక్టర్ వచ్చి నా కళ్ల ముందు నిలబడ్డట్టు జర్మనీలో పనిచేసి వచ్చిన సైంటిస్ట్ రాజారెడ్డి ఇల్లు నాకు మదనపల్లిలో దొరికింది. ఇక సినిమా జరిగేటప్పుడు ప్రొడ్యూసర్గా, నటిగా మంజుల ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఆవిడ సహకారం వల్లే లొకేషన్లో నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. కథ ప్రకారం సినిమా ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. స్క్రిప్ట్లో రాసుకున్నట్టే సీన్స్ ఒక ఆర్డర్ ప్రకారం షూట్ చేశాను. అది షూటింగ్కు సంబంధించిన బెస్ట్ పార్ట్. కొలను దగ్గర తీయాల్సిన కొన్ని సీన్స్ ‘తడ’ ఫారెస్ట్లో చేశాను. సినిమా మొత్తం 22 రోజుల్లో 26 లక్షల బడ్జెట్తో పూర్తి చేశాం. సినిమా చేస్తున్నప్పుడు ఎవరో ‘యాదే’ చూశావా, అందులో సినిమా అంతా ఒకే పాత్రతో నడుస్తుంది అని అన్నారు. వాస్తవంగా నేనా సినిమా చూడలేదు. సినిమా చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేసినా నేను మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మంజుల పర్ఫార్మెన్స్ చాలా సహజంగా, వాస్తవికతకు దగ్గరగా ఉంది. మంజుల, సూర్య బ్యాలన్స్డ్గా నటించారు. ఇది ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమాలో మరో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రొఫెసర్, అతని అసిస్టెంట్ ఒక సీన్లో కన్పిస్తారు. కానీ సినిమా తొంభై తొమ్మిది శాతం రెండు క్యారెక్టర్స్ మధ్యే నడవడం వల్ల రెండు క్యారెక్టర్స్తోనే సినిమా అని అందరూ ఫీలయ్యారు. కెమెరామెన్ రవియాదవ్... నా ఆలోచనల్ని అర్థం చేసుకుని సినిమాటోగ్రఫీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ బెస్ట్ ఎడిటర్గా అవార్డ్ తీసుకున్న అనిల్ మల్నాడ్ ఈ సినిమాకు పనిచేశారు. ఆయన అనుభవం సినిమాను మరింత ఆసక్తిగా మలచడానికి తోడ్పడింది. కృష్ణగారి కుటుంబమంతా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేసి నన్ను అభినందించారు. ఇక ‘షో’ అనే టైటిల్ పెట్టడం వెనుక కారణం ఏమిటంటే, మామూలుగా సినిమా ఫస్ట్ షో, సెకండ్ షో అంటుంటాం. అందులో ఒక్క ‘షో’ అన్న మాటను తీసి టైటిల్గా పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. చాలామంది మిత్రులు బాగుందనడంతో దానికి ఫిక్సయ్యాను. ఈ సినిమాకు నేను స్క్రిప్ట్లో రాసుకున్నట్టే అన్నీ అమరడంతో ముందు టైటిల్స్లో సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తకు ఈ ‘షో’ అంకితం అని వేశాను. సినిమా చివరిలో ‘ఆ జగన్నాటక సూత్రధారి, కేవలం మన వినోదం కోసం సృష్టించిన అద్భుత నాటకమే... ఈ జీవితం’ అని నాకు స్ఫూర్తినిచ్చిన పరమహంస యోగానంద వాక్యం పెట్టాను. ఎన్నో ఆలోచనల పొరలు దాటుకుని రూపం దాల్చిన ‘షో’ సినిమా 2002లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక, బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్గా నాకు పేరు తెచ్చిపెట్టింది. అవార్డులనూ అందుకుంది. ఇప్పుడు ఎప్పుడైనా ‘షో’ సినిమా చూస్తుంటూ... స్టైలింగ్లో ఇంకో పది శాతం మార్పులు చేస్తే సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది! - కె.క్రాంతికుమార్రెడ్డి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement