-
కంపెనీల ఏర్పాటు నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం 2013లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ సవరించింది. సవరించిన నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సెక్షన్ 16 కింద ప్రస్తుత కంపెనీకి నూతన పేరును కేటాయించే విషయంలో మార్పులను తీసుకొచ్చింది. ఇదే సెక్షన్ కింద ఒక కంపెనీ పేరు మరో కంపెనీతో పోలి ఉంటే.. మార్చుకోవాలంటూ కేంద్రం ఆదేశించొచ్చు. ఇలా ఆదేశిస్తే మూడు నెలల్లోగా కంపెనీ పేరును మార్చుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల కింద నిర్ణీత గడువులోపు పేరు మార్పును అమల్లోకి తీసుకురాకపోతే.. అప్పుడు కంపెనీ పేరు చివర్లో ‘ఓఆర్డీసీ’ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేరుస్తుంది. -
కంపెనీల చట్టంలో సవరణలకు ఓకే
- లోక్సభలో ఆమోదముద్ర - పోంజీ స్కీమ్లకు అడ్డుకట్ట - కొన్ని నిబంధనల తొలగింపు న్యూఢిల్లీ: కంపెనీల చట్టం-2013లో సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించడం... వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కోసం చట్టంలోని కొన్ని అసంబద్ధ నిబంధనలను తొలగించినట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇలాంటి నిబంధనల కారణంగా దేశంలో వ్యాపారాలను ప్రారంభించేందుకు ఎవరూ ముందుకురారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపాదిత కంపెనీల చట్టం సవరణ బిల్లు-2014కు సభలో మూజువాణి ఓటుతో అమోదం లభించినప్పటికీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లును స్థాయీ సంఘానికి పంపాలంటూ కాంగ్రెస్ పట్టుపట్టగా.. స్పీకర్ నిరాకరించారు. మొత్తంమీద కంపెనీల చట్టానికి 14 సవరణలు చేశారు. ఇందులో పోంజీ స్కీమ్ల అడ్డుకట్టకూడా ప్రధానమైనది. లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లను ముంచేసిన శారదా చిట్ఫండ్ స్కామ్ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలను ఆశజూపి ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించేవారికి తీవ్రమైన శిక్షలను విధించేలా చట్టంలో మార్పులు చేశారు. కంపెనీలు ప్రారంభించాలంటే చాలా కష్టం: ఎంపీ వి.వరప్రసాద్రావు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కంపెనీలు ప్రారంభించాలంటే కనీసం 40 చట్టాల నిబంధనలు పాటించాలని, అదే విదేశాల్లో అయితే ఈ ప్రక్రియ చాలా సులువని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్రావు పేర్కొన్నారు. కంపెనీల చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ చట్ట సవరణలను చాలావరకు వైఎస్సార్సీపీ స్వాగతిస్తోంది. అయితే కంపెనీల బోర్డుల పలు తీర్మానాలు రహస్యంగా ఉంచుతారు. రిజిస్టర్లో నమోదు చేశాక రహస్యంగా ఉంచాల్సిన అవసరమేముంది? అంతర్జాతీయ ప్రక్రియలను అమల్లో పెడతామని మంత్రి చెప్పారు. కానీ అవి సవరణల్లో కనిపించలేదు. ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల ప్రయోజనాలనూ కాపాడాలి. సత్యం స్కామ్ తర్వాత ఆడిటర్లందరినీ అనుమానాస్పదంగా చూడడం మొదలైంది. కంపెనీలు దేశ సహజ సంపదను వినియోగించుకున్నప్పుడు వాటి లాభాలు ఈ దేశ సామాజిక రంగాలపై ఖర్చు చేసేలా చూడాలి’ అని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement