-
న్యాయం చేస్తారా..చావమంటారా..!
నాంపల్లి: అకారణంగా తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు మంగళవారం ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే... 2016–17 విద్యా సంవత్సరానికి గాను 135 కొత్త కాంట్రాక్టు పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబందించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ మార్చి 27న గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఇందులో 2016–17 విద్యా సంవత్సరంలో రెండు నెలల పాటు పనిచేసి మిగులు దామాషా ప్రకారం పక్కన ఉంచిన 16 మందిని ఈ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా భర్తీ చేయాలనే ప్రతిపాదనను ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపారు. కాగా గతంలో కమిషనర్ వాణీ ప్రసాద్ ఇచ్చిన గైడ్లైన్స్ కాదని కొత్త గైడ్లైన్స్ను విడుదల చేయడంతో తాము రోడ్డున పడతామంటూ పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం 16 మంది బాధిత కాంట్రాక్టు లెక్చరర్లు నాంపల్లిలోని కమిషనరేట్కు వచ్చారు. మధ్యాహ్నం శంకర్లాల్, నరేందర్రెడ్డి, జానీ పాష, రాధిక, హరిత, రమ్య పెట్రోలు బాటిల్స్ తీసుకుని కార్యాలయ భవనంపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ లాల్ అనే వ్యక్తి పెట్రోల్ మీద పోసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కిందకు తీసుకువచ్చారు. మీకు న్యాయం చేసే విధంగా అధికారులతో చర్చిస్తామంటూ కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఏసీపీ భిక్షంరెడ్డి, బేగంబజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కొంత సమయం కావాలని కోరారు. ఐదు రోజుల్లో తమకు న్యాయం జరిగేలా చూడాలని, జి.ఓ నెం.324లో తమను చేర్చాలని బాధితులు డిమాండ్ చేశారు. -
గురుదక్షిణ ఇలాగేనా?!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువులకు ఇది కాని కాలంలా కనబడుతోంది. బోధనలో నిమగ్నం కావలసిన అధ్యాపకులు రోడ్డెక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కాంట్రాక్టు లెక్చెరర్లు నిరవధిక సమ్మె సాగిస్తుండగా, తెలంగాణలో సైతం అదే బాటలో ఉన్నారు. ఈ అధ్యాపకుల కోర్కెలు న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమై నవి. తమ కొలువులకు ముందున్న ‘కాంట్రాక్టు’ పదాన్ని తొలగించి గౌరవ ప్రదమైన బతుకునిమ్మని వీరంతా ప్రాధేయపడుతున్నారు. తమ కుటుంబాలు మెరుగైన జీవనం సాగించడానికి సరిపడా కనీస వేతనం ఇవ్వమని కోరుకుంటు న్నారు. కడుపు మాడ్చుకుని పాఠాలు చెప్పడం ఇక తమ వల్ల కాదంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఉద్యమంపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం తన వెనకటి గుణాన్ని ప్రదర్శించి అణచివేతకు పూనుకుంది. సమ్మెలో ఉన్నవారందరినీ విధుల నుంచి తొలగిస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టింది. ఆ మేరకు నోటీ సులు కూడా జారీ చేయించింది. ‘మా బెదిరింపులకు చాలామంది భయపడ్డారు. కొందరు విధుల్లో కూడా చేరారు’ అని సంబరపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నాలు గైదు రోజులుగా ఆమరణ నిరశనలో ఉన్న అధ్యాపకుల్ని అరెస్టు చేయిస్తోంది. నూతన సంవత్సర ఆగమన వేళ అధ్యాపకుల కుటుంబాలపై పగబట్టినట్టు ప్రవర్తిస్తోంది. అధ్యాపక వృత్తి సమాజంలో ఎంతో గౌరవప్రదమైనది. వివిధ రంగాలకు మెరి కల్లాంటి ప్రతిభావంతుల్ని అందించే పనిలో నిత్యం నిమగ్నం కావలసిన పవిత్ర మైన వృత్తి అది. ఏపీలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇలా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నవారి సంఖ్య దాదాపు 6,000. తెలంగాణ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఇలాంటివారు 4,000మంది ఉన్నారు. గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అడ్హాక్ టీచర్ల నియామకంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాలపై నిప్పులు చెరిగింది. తగిన అర్హతలున్నపక్షంలో నేరుగా ఆ విధంగానే తీసుకోకుండా డొంకదారులు వెదక డానికి ప్రయత్నించడం సిగ్గుగా లేదా అని నిలదీసింది. గురువులకు అరకొర వేతనాలివ్వడానికి తప్ప మీ తెలివితేటలు మరెందుకూ కొరగావా అని ప్రశ్నించింది. నిజానికి ఆ చీవాట్లు ఆ రాష్ట్రాలకు మాత్రమే కాదు. ఆ బాపతు పనులకే పాల్పడు తున్న ప్రతి ప్రభుత్వానికీ అవి తగులుతాయి. కానీ మన పాలకులకు సిగ్గెక్కడ? ఆ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానిది మరింత హీనమైన చరిత్ర. రెండున్నరేళ్ల క్రితం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల చేసిన పార్టీ మ్యాని ఫెస్టోలో కాంట్రాక్టు లెక్చెరర్లను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. బాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆందోళన చేస్తున్న అధ్యాపకుల్ని కలిసి వారికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు సరిగ్గా అందుకు భిన్నమైన చర్యలకు ఒడిగడు తున్నారు. అధ్యాపకులకు బాబు పోకడలు వింతగొలిపి ఉండవచ్చు. ఈ మనిషికి కనీస విలువలైనా ఉండవా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఏపీలో వివిధ వర్గాలకు ఇప్పటికే అలాంటి అనుభవాలున్నాయి. ఇప్పుడా మ్యానిఫెస్టోను తిరగేస్తే అది ‘దొంగ వాగ్దానాల పద్దు’గా కనబడుతుంది. బాబు వచ్చినా యువతకు జాబు రాలేదు సరిగదా వారికి నిరుద్యోగ భృతి కూడా అందడం లేదు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణాల మాఫీ తూ తూ మంత్రంగా సాగింది. సేద్యానికి 9 గంటల విద్యుత్తు, ఆపదలో ఉన్న మహిళలకు 5 నిమిషాల్లో సాయం, బెల్టు షాపుల రద్దు, కాపులకు బీసీ హోదా వంటివన్నీ ఎటో పోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేద రోగుల కోసం ఎంతో ఆపేక్షతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారు. ఇన్ని చేసిన వ్యక్తి కాంట్రాక్టు లెక్చెరర్లకిచ్చిన హామీకి ఎగనామం పెట్టడంలో వింతేమీ లేదు. ఇతర వృత్తులకూ, అధ్యాపక వృత్తికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. జీవి తంలో కీలకమైన మలుపులో ఉండే కౌమార దశ పిల్లలతో అధ్యాపకులు వ్యవ హరించాల్సి ఉంటుంది. వారికి వివిధ అంశాల్లో అవగాహన పెంపొందించి భవిష్య త్తుపై భరోసా కల్పించాల్సిన భారం, ఉత్సాహాన్ని దట్టించాల్సిన బాధ్యత వారిదే. తమ భవిష్యత్తు గురించిన బెంగలేనివారే ఆ పని చేయగలరు. అధ్యాపకులు ఒక గంట పాఠం చెప్పాలంటే అందుకు కొన్ని గంటలపాటు శ్రమపడవలసి ఉంటుంది. ఆ పాఠ్యాంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అందుకు సంబంధించిన ఇతరత్రా అంశాలను సైతం పరిశీలించాలి. అప్పుడు మాత్రమే పిల్లలకు సృజనాత్మకంగా బోధించగలరు. అధ్యాపక వృత్తితోనే తమ భవిష్యత్తు ముడిపడి ఉంటుందని నిర్ధారణగా తెలిసినప్పుడే ఎవరైనా అందులో నైపుణ్యాన్ని పెంపొందించుకోగలరు. కానీ కాంట్రాక్టు లెక్చెరర్లు నిత్యం అభద్రతలో ఉంటారు. వారి కొలువు ఎప్పుడైనా పోవచ్చు. జిల్లా సగటు ఉత్తీర్ణతను అందుకోలేకపోయినా... నిర్ణీత సంఖ్యలో విద్యా ర్థులు లేకపోయినా వారి ఉద్యోగాలకు రెన్యువల్ ఉండదు. నెలనెలా ఠంచన్గా జీతాలందవు. నెలకో సెలవు మాత్రమే ఉంటుంది. విధి నిర్వహణలో మరణించినా కుటుంబాన్ని ఆదుకొనే దిక్కులేదు. మహిళా లెక్చెరర్ల పరిస్థితి మరింత ఘోరం. వారికి వేతనం లేని ప్రసూతి సెలవు రెండు నెలలిస్తారు. ఆ సెలవు తీసుకుని మరిన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోవాలో... ఉద్యోగానికి వెళ్లి కడుపులో ఉన్న శిశువును అనారోగ్యం బారిన పడేయాలో వారు తేల్చుకోవాలి. ఇంతకన్నా అమానవీయత, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? తమ వలెనే శ్రమిస్తున్న రెగ్యులర్ సహోద్యో గులు తమకన్నా అధికంగా వేతనాలనూ, ఇతర భత్యాలనూ పొందుతుంటే... పలు సౌకర్యాలను అనుభవిస్తుంటే తాము మాత్రం శాపగ్రస్తుల్లా క్షణక్షణ గండంగా బతుకీడ్చవలసి రావడం ఎంత విషాదం! బాబు సర్కారు ఇకనైనా కపట నాటకాలు చాలించి కాంట్రాక్టు అధ్యాపకులకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. తమ ప్రభుత్వం వచ్చిననాటినుంచీ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి బాకాయిలను సైతం చెల్లించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా వివేకంతో ప్రవర్తించి తమ ఉద్యోగుల వెతలు తీర్చాలి. -
'ప్రజలను మోసం చేయడమే లక్ష్యం'
అనంతపురం: ప్రజలను మోసం చేయడమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని గాలికి వదిలేసిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో టీడీపీ నేతలు నిష్ణాతులని గుర్నాథరెడ్డి అన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లకు వైఎస్ జగన్ హామీ
విజయనగరం: కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సందర్శించారు. విజయనగరం కలెక్టరేట్ జంక్షన్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వైఎస్ జగన్కు లెక్చరర్లు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్లకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యంతో విజయనగరంలో సోమవారం వైఎస్ జగన్ యువభేరి నిర్వహించిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement