-
అర్హులందరికీ పింఛన్లు
మహేశ్వరం: అర్హులందరికి పింఛన్లు అందజేస్తామని.. ఆందోళన చెందొద్దని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రూ.1.25 లక్షల నిధులతో నిర్మించిన కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని వారు ప్రారంభించారు. రావిర్యాల గ్రామంలో రూ.80 లక్షల నిధులతో పాఠశాల అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అంగ్లంలో విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద ని మంత్రి పేర్కొన్నారు. పింఛన్లు తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నిరుపేద యువతుల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 51 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రానున్న రోజుల్లో మహేశ్వరం రూపురేఖలు మారుతాయని.. రావిర్యాల, మహేశ్వరం, నాగారం తదితర గ్రామాల్లో భారీ పరిశ్రమలను స్థాపించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ విశ్వేశర్రెడ్డి పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలు మారుస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 10 కోట్లు మంజూరు.. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. జాతీయ ప్రెస్ డే సందర్భంగా ఆయన జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులు ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పెంటమల్ల స్నేహ, జెడ్పీటీసీ నేనావత్ ఈశ్వర్నాయక్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కొత్త మనోహర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పోతర్ల అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, సర్పంచ్లు ఆనందం, లక్ష్మయ్య, ఎంపీటీసీలు లింగం సురేష్, మునగని రాజు, బరిగెల ప్రేమలత,బుజ్జి, సర్వశిక్షా అభియాన్ అధికారి కిషన్రావు, తహసీల్దార్ గోపీరామ్, ఎంపీడీఓ నీరజ ఉన్నారు. కొత్త సంవత్సరం నుంచి బస్సులు ప్రారంభం అనంతరం మంత్రి మహేశ్వరం ఆర్టీసీ డిపో పనులను పర్యవేక్షించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మహేశ్వరం ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్సులు నడిపిస్తామని మంత్రి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మహేశ్వరం మరో హైటెక్ సిటీగా మారుతుందని చెప్పారు. ఈ ప్రాంత రైతులు భూములను అమ్ముకోవద్దని సూచించారు. మహేశ్వరం ఆర్టీసీ డిపోలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆర్టీసీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ జయరామ్, రీజినల్ మేనేజర్ ఎన్. వెంకటేశం, డీవీఎంలు సూర్యకిరణ్, సోలమోన్, మహేశ్వరం మేనేజర్ పవిత్ర తదితరులు ఉన్నారు. హామీలను నెరవేరుస్తాం.. కందుకూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పి.మహేందర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పులిమామిడి జెడ్పీ పాఠశాలలో రూ.12.74 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణ పనులను, కొత్తగూడ పరిధిలో రూ.1.379 కోట్ల నిధులతో నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫారమ్, ఉపకారవేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో 144 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తాము చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లల్లో ఇంటింటికి నల్లా: ఎమ్మెల్యే నాలుగేళ్లల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. పులిమామిడి-మహేశ్వరం రహదారికి రూ.2.40 కోట్లు మంజూరు అయ్యాయని.. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా రోడ్లపై ఎర్ర మట్టి పోసి బంగారు తెలంగాణ అంటున్నారని జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి విమర్శించగా.. విమర్శలు మాని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనేగౌని అశోక్గౌడ్, జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, వైస్ ఎంపీపీ అనేగౌని సంధ్యాదామోదర్, సర్పంచు లు అనేగౌని దేవిపాండు, ఆర్.యాదయ్య, మన్నె జయేందర్, టీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కొత్త మనోహర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు జంబుల రాజేందర్రెడ్డి, అధికారులు ఉన్నారు. -
‘పాఠం’.. చెప్పేదెవరు ?
కార్పొరేట్ చదువుల ప్రపంచంలో సర్కారు స్కూళ్లను టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అందరికీ ఉచిత నిర్బంధవిద్యను అందిస్తామన్న ప్రభుత్వం ఆశయం నెరవే రడం లేదు. పుస్తకాలు, డ్రెస్సులు అందించలేకపోయారు. జిల్లాలో 203 పాఠశాలల్లో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు బడివైపు మొహం చూపడం లేదు. వారిని పర్యవేక్షించేందుకు ఎంఈఓలు కూడా అందుబాటులో లేరు. విద్యావలంటీర్ల నియామకం ఊసేలేకుండాపోయింది. డీఎడ్ విద్యార్థుల చేత ఎలాగోలా స్కూళ్లను తెరిపిస్తున్నారు. ఇకనైనా మేల్కొనకపోతే విద్యార్థులు రాక ప్రభుత్వ బడులు మూతబడే అవకాశాలు లేకపోలేదని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. పాలమూరు: సర్కారు బడులను బలోపేతం చేసి అందరికీ విద్యను అందుబాటులోకి తెస్తామని చెబుతున్న పాలకులు, అధికారుల మాటలు నీటిమీది రాతలవుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతో పాటు పాఠ్యపుస్తకాల కొరత తీర్చలేకపోయారు. జిల్లాలో అసలు ఉపాధ్యాయులే లేని ప్రభుత్వ పాఠశాలలు 230కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సింగిల్ టీచర్తో కొనసాగుతున్న స్కూలు 700 వరకు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక స్థా యిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే అవకాశమే లేకుండాపోతోంది. జిల్లాలోని సర్కారు స్కూళ్లలో దాదాపు 1600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో పేదవర్గాల పిల్లలకు ప్రాథమిక విద్య అందని ద్రాక్షగా మారింది. ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు గణితం, సా మాన్య శాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాలను బోధించేందుకు కూడా ఉపాధ్యాయులు లేరు. ఇక ఏకోపాధ్యాయులు ఉన్న బడుల్లో సదరు ఉపాధ్యాయుడు వస్తేనే బడి తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే పాఠశాలకు ఆరోజు సెలవే.. ఇదీ జిల్లాలో పరిస్థితి అనేక ృపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ ఏడాది నాణ్యమైన విద్య అందించలేమని అప్పుడే అధికారులు చేతులెత్తేస్తున్నారు. పర్యవేక్షణకూ ఇబ్బందే..! మండల విద్యాధికారుల నియామకానికి పాలనాపరమైన ఇబ్బందులు ఉండటంతో ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలో మొత్తం 64 మండలాలకు 14 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నాయి. మిగిలిన 50 మండలాల పరిధిలో సీనియర్ ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలల్లో హెచ్ఎంల కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. ఇక డిప్యూటీ ఈఓల విషయానికి వస్తే జిల్లాలోని మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, షాద్నగర్ విద్యాశాఖ డివిజన్ల పరిధిలోని ఉపవిద్యాశాఖ అధికారులంతా ఇన్చార్జీలే కావడం గమనార్హం. డైట్ లెక్చరర్లను ఇన్చార్జీలుగా నియమించి వారి ద్వారా ఏళ్ల కాలం గడుపుతున్నారు. వలంటీర్ల నియామకం ఆలస్యమే ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని గతేడాది 1100 మంది వరకు విద్యావలంటీర్లను నియమించుకోవాలని ఉత్తర్వులుఇచ్చారు. అయితే ఈ ఏడాది వలంటీర్ల నియామకాలకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రాలేదు. కొత్తగా నియమిస్తారా? లేక విద్యా వలంటీర్ల నియామకాన్ని పూర్తిగా పక్కక పెట్టేస్తారా? అన్న విషయమై స్పష్టత కనిపించడం లేదు. ‘పది’ విద్యార్థుల్లో ఆందోళన ఈ ఏడాది నుంచి పదో తరగతి పుస్తకాల్లోని పాఠ్యంశాలు మారాయి. కానీ వాటిని బోధించే 200 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన గణితం, సామాన్యశాస్త్రం వంటివాటిని బోధించేవారు లేరు. గతేడాది కొన్ని సర్దుబాట్లు చేశారు. ఓచోట ఒక సబ్జెక్టును బోధించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులుంటే వారిలో ఒకరిని పక్కన ఉన్న పాఠశాలలో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగపరిచారు. తమకున్న పలుకుబడితో మహబూబ్నగర్, షాద్నగర్, హైదరాబాద్, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్పై వస్తుండటంతో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు నష్టం జరిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement