-
తిరుమలలో 13 కాటేజీల పునర్నిర్మాణం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేసే కార్మికులకు లబ్ధి కలిగించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి టీటీడీ చైర్మన్ భూమన మీడియాకు వివరించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కింద ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పైగా పెంచేందుకు ఆమోదం. శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న దాదాపు 6,600 మంది ఉద్యోగులకు ఇకపై ఏటా 3 శాతం వేతనం పెంపుదల. టీటీడీలో వివిధ సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్లోకి మారిన ఉద్యోగులకు గత సేవల్ని గుర్తించి ప్రతి రెండేళ్లకు 3 శాతం ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయం. కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అకాల మరణం పొందితే రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదం. శ్రీలక్ష్మీ శ్రీనివాసా మ్యాన్పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు దాదాపు 1500 మందికి హెల్త్ స్కీమ్ వర్తింప చేసేందుకు ఆమోదం. -
శ్రీశైలం వస్తున్నారా.? మా సత్రం ఆతిథ్యం స్వీకరించండి
శ్రీశైలం: మల్లన్న సన్నిధి శ్రీశైలంలో సత్రాలు విస్తరిస్తున్నాయి. ఏడు దశాబ్దాల క్రితం రెండు సత్రాలతో మొదలై నేడు వంద ఎకరాల విస్తీర్ణంలో వందకుపైగా వెలిశాయి. వీటిలో కొన్ని సకల సౌకర్యాలు కలిగి భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. మరికొన్ని అన్నపూర్ణ నిలయాలుగా వర్ధిల్లుతున్నాయి. కులానికో సత్రం.. తొలుత 1955కు పూర్వం ఆర్యవైశ్యులు శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం శ్రీ వాసవీ అఖిలభారత ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, శ్రీ వీరశైవ లింగాయితీసత్రం ఏర్పడ్డాయి. ఆ కాలంలో రోడ్డుమార్గం లేకపోవడంతో అటవీమార్గం ద్వారా శివరాత్రి, ఉగాది పర్వదినాలకు భక్తులు శ్రీశైలం చేరుకునేవారు. 1957లో రోడ్డుమార్గం ఏర్పడిన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ నీలం సంజీవరెడ్డి శ్రీశైలం వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. ఆ సమయంలో వాసవీసత్రాన్ని నిర్వహిస్తున్న మూర్తి వెంకటేశ్వర్లు, లింగాయితీ సత్రం ఫౌండర్ ప్రెసిడెంట్, అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ బోగిశెట్టి జోగప్ప సత్ర నిర్మాణాలకు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు. ఈ రెండు కుల సత్రాలతో పాటు అప్పటికే శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య పీఠంకు సంబంధించిన స్థలం ఆలయ ప్రాంగణంలో ఉండేది. ప్రస్తుతం వీరశైవ లింగాయితులకు సంబంధించిన మూడు సత్రాలు, ఆర్యవైశ్యులకు చెందిన సత్రాలు మూడు ఉన్నాయి. అనంతరం కాలంలో కరివేన బ్రాహ్మణ సత్రం, రెడ్డి, కమ్మ, కాపు, గౌడ, క్షత్రియ, వెలమ, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక, కరికాల, గాండ్ల, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, వీరశైవ శరణ బసవేశ్వర, దేవాంగ, కుమ్మరి, వాల్మీకి (బోయ), ఉప్పర, ముదిరాజ్, తదితర ఎన్నో కులాల సత్రాలు శ్రీశైలంలో ఏర్పడ్డాయి. ప్రముఖ సత్రాలకు కోట్లకొద్ది డిపాజిట్లు ఉన్నాయి. వీటి ద్వారా నిర్వహణ కొనసాగిస్తున్నారు. పలు సత్రాల్లో 100కు పైగా గదులు, సూట్లు, ప్రత్యేక కాటేజీలు సైతం ఉన్నాయి. కాగా శ్రీశైల దేవస్థానం ఆయా సత్రాలకు కనిష్టంగా 50 సెంట్లు, గరిష్టంగా 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించింది. దాతల సహకారంతో.... ఏ సత్రమైనా అభివృద్ధి చెందాలంటే దాతల సహకారం ఎంతో అవసరం. దేవస్థానం కూడా గదుల నిర్మాణం, అన్నదానం తదితర వాటికి దాతల సహకారం తీసుకుంటుంది. అయితే, లక్షల్లో విరాళాలు ఇచ్చిన దాతలకు వసతి, దర్శన సౌకర్యాల విషయంలో వెసులుబాటు కల్పిస్తుంది. అదే సత్రాల నిర్వాహకులు రూ. 2 లక్షలు ఆపై విరాళం ఇచ్చిన దాతల పేరుపై గది కేటాయింపు చేస్తారు. ఏడాదిలో 30 నుంచి 60 రోజుల పాటు సదరు దాత ఉచితంగా వసతి కల్పిస్తారు. అన్నదానంలో పాలు పంచుకోవాలంటే రూ.216, రూ.516 కనిష్టంగా చెల్లించాలి. దాతల గోత్రనామాలతో అన్నదానం చేస్తారు. శాశ్వత పద్ధతిపై ఏడాదిలో ఒక్కరోజు అన్నదానానికి రూ. 1,116 నుంచి ఆపై విరాళాలు ఇవ్వవచ్చు. -
విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో విషాదం జరిగింది. కాటేజ్ హోంకు నిప్పంటుకుని భారత సంతతి యువ వ్యాపారవేత్త తాన్య బాతిజ(32) ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 14న జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఆమె పెంపుడు కుక్క కూడా చనిపోయింది. తాన్య న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ డిక్స్ హిల్స్ కాటేజ్ హోంలో నివసిస్తోంది. డెసెంబర్ 14న ఉదయం 3 గంటల సమయంలో ఆమె కాటేజ్కు నిప్పంటుకుంది. నిద్ర నుంచి లేచి అగ్నికీలలు చూసి షాక్ అయింది. వెంటనే సాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది. హుటాహుటిన రంగంలోకి దిగిన ఇద్దరు పోలీసులు తాన్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ భారీ అగ్నికీలల ధాటికి ఆమెను చేరుకోలేకపోయారు. ఫైరింజన్ పూర్తిగా మంటలు ఆర్పే సమయానికి తాన్య అగ్నికి ఆహుతైంది. ఆమె పెంపుడు కుక్క కూడా మరణించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనలో నేరపూరితంగా ఏమీ కన్పించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. చదవండి: అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్కు పాక్ మంత్రి బెదిరింపులు -
చాక్లెట్లతో ఇళ్లు కట్టేశారు!
పారిస్: ప్రతి ఒక్కరూ తమ సొంతింటిని స్వీట్ హోంగా చెప్పుకొంటుంటారు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్ల్లో తమ ఇంటి ఫొటోలు పోస్ట్ చేస్తూ... ‘మై స్వీట్ హోం’ అని చేసే పోస్టులనూ మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు తెలుసుకోబోయే ఇల్లు నిజంగానే ‘స్వీట్ హోం’. ఎందుకంటే ఈ ఇంటిని మొత్తం చాక్లెట్తో రూపొందించారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ ఇంటి గురించి తెలుసుకొని తీరాల్సిందే... పారిస్లోని సౌత్వెస్ట్రన్ శివారులో ఉందీ ఇల్లు. దీన్ని ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ చాక్లెట్ కంపెనీ యజమాని జీన్–లూక్ డిక్యుజియో నిర్మించారు. ఈ ఇంట్లోని గోడల నుంచి పైకప్పు వరకు, పుస్తకాల నుంచి గడియారాల వరకు అణువణువునూ చాక్లెట్లతోనే రూపొందించారు. అంతేకాదు ఈ చాక్లెట్లను తినడానికి వీలుండడం మరో విశేషం. మరి ఈ చాక్లెట్ కాటేజీలో ఎవరు ఉంటారనేదేగా మీ డౌట్... ఇందులో నివసించడానికి ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 5, 6 తేదీల్లో కాటేజీని బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ కాటేజీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
‘అతడితో కలిసుండటం ఓ పీడకల’
ముంబయి: బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్లు సహజంగా వస్తుంటాయి. అయితే, కొన్ని రోమాంటికల్ విషయాల్లో..ఇంకొన్ని పంచాయితీలకు సంబంధించిన విషయాల్లో.. అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్లో ఓ గాసిఫ్ వినిపిస్తోంది. అదేమిటంటే బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్, షాహిద్ కపూర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంట. రంగూన్ చిత్రంలో కలిసి నటించిన వీరిమధ్య కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి అభిప్రాయభేదాయాలేర్పడి ఒకరిపై ఒకరు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ప్రశ్నించిన మీడియాకు మాత్రం షూటింగ్ అంతా సజావుగా సాగిందని, కానీ ఒక్క కాటేజీల విషయంలోనే తమ మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చాయని కంగనా చెప్పింది. ‘మేం కొంత షూటింగ్ అరుణాచల్ ప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేశాం. అక్కడ కాటేజీలు చాలా తక్కువ. షాహిద్, నేను మా టీమ్స్తో వాటిని పంచుకోవాల్సి వచ్చింది. ప్రతి రోజు ఉదయం నేను ఉదయాన్నే షాహిద్ కారణంగా నిద్ర లేవాల్సి వచ్చేది. అతడు ఓ మ్యూజిక్ పెట్టి వ్యాయామం చేస్తూ క్రీజీ టెక్నో పాటలు పెట్టి బాగా వాల్యూమ్ పెట్టేవాడు. ఆ స్పీకర్స్ సౌండ్ కారణంగా డిస్ట్రబ్ అయ్యేదాన్ని.. అతడితో కాటేజ్ పంచుకోకూడదని నిర్ణయించుకున్న. షాహిద్తో కాటేజ్ షేర్ చేసుకోవడం అంటే ఓ పీడకల’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బైకుల చోరీ కేసులో ఐదుగురికి జైలు
ఉండాల్సింది ధైర్యం మాత్రమే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement