-
‘తల్లిపాలు అమ్ముకునేవారు మా పార్టీలో లేరు’
సాక్షి ముంబై: రాజ్యసభ ఎన్నికల్లో తమ ఒక్క ఓటు కూడా చీలిపోలేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం శివసేన 55వ వార్షికోత్సవాలు ఆన్లైన్లో జరిగాయి. కాని ఈ సారి 56వ వార్షికోత్సవాలకు ఉద్ధవ్ ఠాక్రే హాజరై శివసేన కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ముఖ్యంగా విధాన పరిషత్ ఎన్నికల నేపథ్యంలో తనదైన శైలిలో శివసేన ఎమ్మెల్యేలకు సూచనలిచ్చారు. తమ పార్టీ ఓట్లు చీలిపోయే ప్రసక్తేలేదని, ఎందుకంటే శివసేనలో వెన్నుపోటు పొడిచే నాయకులు ఎవరూలేరన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా తమ ఓట్లు చీలలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హోటళ్లలో ఎమ్మెల్యేలను దాచడమంటే ప్రజాస్వామ్యమా అంటూ బీజేపీని నిలదీశారు. మా పార్టీకున్న 56 మంది ఎమ్మెల్యేల గురించి నాకు ఎలాంటి ఆందోళనలేదని స్పష్టం చేశారు. ఓట్ల చీలికల గురించి మాట్లాడుతూ, తల్లిపాలు విక్రయించేవారు మా పార్టీలో ఎవరూ లేరని అందుకే నాకు ఎలాంటి ఆందోళనలేదన్నారు. హిందుత్వం గురించి బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఉద్దవ్ ఠాక్రే తనదైన శైలిలో సమాదానం ఇచ్చారు. ‘గర్వ్ సే కహో హమ్ హిందు హై’అనే నినాదాన్ని దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే ఇచ్చారన్నది మరవద్దన్నారు. చదవండి: విపక్షాలకు దెబ్బ మీద దెబ్బ.. గోపాలకృష్ణ గాంధీ కూడా నో -
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేకు ఆధిక్యం
పాట్నా: బీహార్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ సీట్లు దక్కాయి. మొత్తం 24 స్థానాలకు జరిగిన ఎన్నికలో ఎన్డీయే 13 సీట్లను కైవసం చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వివిధ పార్టీలు కలిసి కూటమిగా అవతరించిన జనతాపరివార్కు కేవలం పది స్థానాలే దక్కాయి. ఒక సీటు మాత్రం స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నాడు. ఈ ఫలితాలతో బీహార్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపట్ల ఒక అవగాహనకు రాకపోయినా.. వీటి ప్రభావం కొంత మేర అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. ఈ విజయం కొంతమేర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వేలుకు సిరాచుక్క
ఎమ్మెల్యేలకు పరీక్ష!
గీతకార్మికుడికి గాయాలు
ప్రశాంత పోలింగ్కు పటిష్ట బందోబస్తు
పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● మూడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ ● సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ● పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్
ఓటెత్తాలి..!
ఎన్నికల విధుల్లో ఎన్సీసీ కేడెట్లు
ఎన్నికల విధుల్లో.. ఎస్సై సోదరులు
మండుటెండల్లో గాలివాన బీభత్సం
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement