-
వన్ అండ్ ఓన్లీ భారత్ అండ్ మోదీ
గౌరవాన్ని అవతలివాళ్ల నుంచి కోరుకోకూడదు.. అదే మనల్ని వెతుకుంటూ రావాలన్నాడు ఓ పెద్దాయన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.. అగ్రరాజ్యల లిస్ట్కు ఎప్పుడూ దూరమే. అలాగని సమకాలీన వ్యవహరాల్లో భారత్ పాత్రను ఏమాత్రం తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా సైతం భారత్ స్నేహం కోసం వెంపర్లాడుతుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి అమెరికా గడ్డపై లభించిన ట్రీట్మెంట్.. నెవర్ బిఫోర్గా అనిపిస్తోంది. నరేంద్ర మోదీ.. రాజకీయాలు పక్కనపెడితే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్నప్రముఖుడిగా ఉన్నారీయన. అలాగే.. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన భారత ప్రధాని హోదాలో ఆయనకు దక్కే ఘన స్వాగతం.. బహుశా మరేయితర ప్రపంచనేతలకు దక్కి ఉండదని చెబితే అతిశయోక్తి కాదేమో. తాజాగా అమెరికా పర్యటనలోనూ అలాంటి దృశ్యాలే కనిపించాయి. మూడు రోజల అమెరికా పర్యటనలో అడుగడుగునా నమోకు స్పెషల్ ట్రీట్మెంట్ దక్కింది. ఎయిర్పోర్ట్ బయట స్వాగతం మొదలు.. వైట్హౌజ్, అమెరికన్ కాంగ్రెస్(పార్లమెంట్).. అంతెందుకు ఆయన వెళ్లే తోవలో మోదీ మోదీ నినాదాలు మారుమోగాయి. ఇందులో ప్రవాస భారతీయులే కాదు.. అమెరికన్ పౌరులు సైతం పాలు పంచుకోవడం నిజంగా ప్రత్యేకమే. Goosebumps 🇮🇳#ModiInUSA pic.twitter.com/nLGH6AkJ7y — Satnam Singh Sandhu (@satnamsandhuchd) June 22, 2023 మోదీ పాదాలను తాకి.. మేరీ జోరీ మిల్బెన్.. అమెరికన్ సింగర్. వరుసగా ముగ్గురు అమెరికా అధ్యక్షుల ముందు ప్రదర్శనలు ఇచ్చిన ఏకైక గాయకురాలిగానూ ఆమెకంటూ ఓ పేరుంది. అంతేకాదు ప్రపంచంలోని పలువురు ప్రముఖుల సమక్షంలోనూ ఆమె షోలు నిర్వహించారు. అలాంటి సింగర్.. రొనాల్డ్ రీగన్ బిల్డింగ్లో జరిగిన కార్యక్రమంలో భారత జాతీయ గీతం జనగణమన ఆలాపించారు. అంతేకాదు.. ఆ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ప్రధాని మోదీ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. మరో విశేషం ఏంటంటే.. 2020 ఆగష్టులో జరిగిన 74వ స్వాతంత్ర్య వేడుకల్లోనూ ఆమె జగగణమనను ఆలాపించారు కూడా. Deeply moved by @MaryMillben's gesture of respect as she touched the feet of Prime Minister shri @narendramodi ji after delivering a captivating rendition of our #NationalAnthem. It's truly admirable when international artists embrace and honor Indian culture. 🙏🇮🇳 #Respect… pic.twitter.com/to3s3SJkEr — Pushyamitra Bhargav (@advpushyamitra) June 24, 2023 న్యూయార్క్ వీధుల్లో భారీ బ్యానర్ మోదీ అమెరికా పర్యటన(రెండోది) ప్రతిష్టాత్మకంగా కొనసాగింది. ఈ పర్యటన చారిత్రాత్మకంగా భావించి.. చాపర్ ద్వారా ఓ భారీ బ్యానర్ను న్యూయార్క్ వీధుల గుండా ఎగరేశారు. మోదీతో పాటు బైడెన్ ఫొటో కూడా ఉంది అందులో. Meanwhile in the sky of New York in United States of America 🇮🇳 pic.twitter.com/j7PcS8aHep — Kiren Rijiju (@KirenRijiju) June 23, 2023 ఆ భవనాలపై మువ్వన్నెల రంగు భారత ప్రధాని మోదీ పర్యటనలో మరో అరుదైన దృశ్యం కనిపించింది. లోయర్ మాన్హట్టన్లోని వన్ వరల్డ్ ట్రేడ్సెంటర్ భవనంపై మువ్వన్నెల జెండా రంగుల కాంతుల్ని ప్రదర్శించారు. అంతేకాదు.. న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్పైనా ఈ దృశ్యం దర్శనమిచ్చింది. గతంలో అమెరికాను ఎంతో మంది ప్రపంచ అధినేతలు సందర్శించి ఉండొచ్చు. భారత్ నుంచి కూడా ఆ లిస్ట్ ఉండొచ్చు. కానీ, ఇప్పుడు మోదీకి దక్కిన ఆతిథ్యం.. అభిమానం మాత్రం నెవర్భిపోర్ అనే చెప్పాలి. New York's Empire State Building lit up in tricolour as PM Modi is on an official State visit to the United States pic.twitter.com/gcQCeqL7dc — ANI (@ANI) June 23, 2023 #HistoricStateVisit2023#IndiaUSAPartnership Testimony to the friendship between India and the US, the iconic lower Manhattan landmark @OneWTC sparkling in the lights of tricolor, welcoming @narendramodi on the historic State Visit.@IndianEmbassyUS@ANI@Yoshita_Singh… pic.twitter.com/oZw4gSqWhU — India in New York (@IndiainNewYork) June 23, 2023 My PM My Pride 🤩#ModiInUSA pic.twitter.com/kvIDZFgtgT — Gaurav🇮🇳 (@IamGMishra) June 21, 2023 1st Standing Ovation for Prime Minister Modi at US House of Representatives 👏👏👏 There have been many advances in AI- Artificial Intelligence. At the same time, there have been even more momentous development in another AI- America and India 👏👏👏#ModiInAmerica #ModiInUSA pic.twitter.com/Cpyww6fYF0 — Rosy (@rose_k01) June 22, 2023 -
‘బంగినపల్లి’కి అరబ్ దేశాల్లో క్రేజ్
కర్నూలు(అగ్రికల్చర్): అద్భుతమైన రుచి.. ఆకట్టుకునే రూపం.. గుబాళించే సువాసన.. మన బంగినపల్లి మామిడి సొంతం. భారతీయులతోపాటు అరబ్, యూరోప్ దేశాల ప్రజలు కూడా ఈ మధుర ఫలాన్ని లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగినపల్లి (బేనీషా) మామిడికి పుట్టినిల్లు అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగుచేస్తున్న పండ్లకు అరబ్ దేశాల్లో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 25వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. గత ఏడాది సగటున ఎకరాకు 2 నుంచి 3 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 3-4 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో లక్ష టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. దీనిలో 80 నుంచి 90 శాతం వరకు బంగినపల్లి ఉంటుంది. బంగినపల్లి రకం మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో రెండు, మూడేళ్లుగా రైతులు నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గూడూరు, ఓర్వకల్, వెల్దుర్తి, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, కల్లూరు, కర్నూలు, దేవనకొండ, డోన్, క్రిష్ణగిరి తదితర మండలాల్లో కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. చీడపీడల బెడద, కెమికల్స్ ప్రభావం మామిడిపై పడకుండా ఫ్రూట్ కవర్స్ కూడా వినియోగిస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత పెరుగుతోంది. రైతులకు ఉద్యానవనశాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్న్యూస్ బడా వ్యాపారులు వచ్చి కొనుగోలు.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి బడా వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. తోటల్లోనే 20 కిలోల బాక్సుల్లో పండ్లను ప్యాకింగ్ చేసి ఆయా నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి అరబ్, యురోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పండిన పండ్లలో 40 శాతం ముంబైకి తీసుకువెళ్లి, అక్కడి నుంచి అరబ్ దేశాలైన దుబాయ్, సౌదీ, కువైట్కు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది 2,500 టన్నుల వరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. టన్ను ధర రూ.80 వేల నుంచి రూ.1.05లక్షల వరకు లభించింది. ఈ ఏడాది 5వేల టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మామిడి కొనుగోలు కోసం మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో మామిడికి ఎన్నడూ లేని విధంగా టన్ను ధర రూ.లక్షకు పైగా పలికింది. ఇటీవల మార్కెట్కు మామిడి తాకిడి పెరిగిన తర్వాత ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టన్ను ధర రూ.40 వేల వరకు లభిస్తోంది. నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడిలో నాణ్యత పెరిగింది. 50 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేశాం. ఇందులో 85 శాతం చెట్లు బేనీషా రకానికి చెందినవే. ఎగుమతులకు అనువైన నాణ్యత ఉండాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా రసాయనాలు వాడటం లేదు. ఇందువల్ల మామిడిలో నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి కావడంలేదు. ముంబై, తమిళనాడు, హైదరాబాద్ వ్యాపారులు వచ్చి మామిడి కొంటున్నారు. – గొల్ల శ్రీరాములు, గూడూరు -
ఫ్యాన్సీ నంబర్లకు పెరిగిన క్రేజ్.. ఎన్ని రూ.లక్షలు పెట్టేందుకైనా రెడీ..!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన కాన్వాయ్లోని వాహనాలన్నింటికీ వాడుతున్న ఫ్యాన్సీ నంబర్ 6666.. ఈ సంఖ్యకు ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పోటీ ఉంది. ఉమ్మడి ఏపీలో రాజకీయరంగ ప్రవేశం అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన వాహనాలకు వాడిన నంబర్లు 999, 9999... ఇటీవల టీఎస్ 09 ఎఫ్జెడ్ 9999 అనే ఫ్యాన్సీ నంబర్ కోసం ఆన్లైన్ బిడ్డింగ్లో ఓ సంస్థ వెచ్చించిన మొత్తం రూ. 9,50,999. గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో టీఎస్ 09 ఎఫ్ఎక్స్ 9999 అనే నంబర్కు పలికిన ధర ఏకంగా రూ.13.50 లక్షలు. టీఎస్ 09 జీఏ 0001 నంబర్ పొందేందుకు ఒక సంస్థ రూ.7.25 లక్షలు చెల్లించగా టీఎస్ 09 జీఏ 0007 అనే నంబర్ కోసం మరో సంస్థ రూ. 1.35 లక్షలు వెచ్చించింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్యాన్సీ నంబర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. లగ్జరీ వాహనాలకు నంబర్లు కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఆకాంక్ష వాహనదారుల్లో పెరుగుతోంది. సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై విశ్వాసం వల్లనో లేదా అదృష్టం కలసి వస్తుందనే నమ్మకంతోనో, సామాజిక హోదాను చాటేందుకో వాహనదారులు ప్రత్యేక నంబర్లపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీనటులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ సంస్థలు ఈ తరహా నంబర్లపట్ల ఎక్కువ ఆదరణ చూపుతున్నాయి. ఆర్టీఏకు భారీ ఆదాయం.. రవాణా శాఖ ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసే ప్రత్యేక నంబర్లలో ఆన్లైన్ (9999) నంబర్ ఆల్టైమ్ రికార్డు సృష్టిస్తోంది. ఈ నంబర్ ప్రతి సిరీస్లోనూ దాదాపు రూ. 10 లక్షలు పలుకుతోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉన్న 2020–21 ఆర్థిక సంవత్సరం మినహాయించి రవాణాశాఖకు ఏటా ఆదాయం పెరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం వరకు పెద్దగా ఆదరణలేని నంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ లభిస్తోంది. ప్రత్యేక నంబర్ల వేలం నిర్వహించిన ప్రతిసారీ ఖైరతాబాద్ కార్యాలయంలోనే సుమారు రూ. 30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఒక్కో నంబర్కు 10 మంది పోటీ.. ఆర్టీఏలో విడుదల చేసే కొత్త సీరిస్ నంబర్లలో 2,500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటున్నాయి. ఒక్కో నంబర్కు సగటున 5 నుంచి 10 మంది వాహన యజమానులు పోటీకి వస్తుండగా, నచ్చిన నంబర్లు లభించని వాహనదారులు తదుపరి వేలం కోసం 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా ఎదురు చూస్తున్నారు. అదృష్టం కోసమే ఎక్కువ మంది.. ► జ్యోతిషాన్ని నమ్మేవారే ఎక్కువగా తమ గ్రహస్థితి ప్రకారం అదృష్ట సంఖ్య పేరిట ఫ్యాన్సీ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ► ఒకటో నంబర్ను నాయకత్వానికి, రెండో నంబర్ను శాంత స్వభావానికి, 3ను తెలివితేటలకు, ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తున్నారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్న వాళ్లు, పోరాడేతత్వం ఉన్నవాళ్లు ‘9’ని కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తూ ఈ నంబర్ను ఇష్టపడుతున్నారు. వాహనాలకు ఆయా నంబర్ల వాడకం వల్ల తాము వృద్ధిలోకి వస్తామని చాలా మంది నమ్ముతున్నారు. నంబర్లే బహుమతులు.. ► ఇటీవల కాలంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందించడంతోపాటు వారి పుట్టినరోజు కలిసొచ్చే విధంగా రిజి్రస్టేషన్ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ► ‘1313’నంబర్ అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీన్ని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ► ‘5121’అనే నంంబర్ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లకు కూడా ఎంతో క్రేజ్ ఉంది. క్రేజ్ పెరిగింది.. గతంకంటే ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్లకు అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది.లగ్జరీ వాహనాలు బాగా పెరిగాయి. ఏటా 10 వేలకుపైగా ఖరీదైన కార్లు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అలాగే రూ. 50 లక్షల విలువైన బైక్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ వాహనాల స్థాయికి తగినట్లుగానే వాహనదారులు నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. – జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: హైదరాబాద్లో ఈస్ట్జోన్వైపే మధ్యతరగతి ప్రజల ఆసక్తి -
చాట్జీపీటీకి అంత క్రేజ్ ఇందుకే..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ అప్లికేషన్ గూగుల్ మాదిరిగానే సెర్చ్ ఇంజన్లా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఉన్న దిమ్మతిరిగే ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మంది యూజర్లను సంపాదించుకున్నదంటేనే దీని క్రేజ్ ఏంటో ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ చాట్ జీపీటీలో ఏముంది? దీన్ని ఏ కంపెనీ ఆవిష్కరించింది? గూగుల్ సెర్చ్కు దీనికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. (ఇదీ చదవండి: ఎక్కడ చూసినా ఇదే చర్చ.. చాట్ జీపీటీ! గూగుల్ని మించి? ఏది అడిగినా..) చాట్ జీపీటీ Vs గూగుల్ సెర్చ్ చాట్ జీపీటీ అంటే జెనెరేటివ్ ప్రీట్రైయిన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. గూగుల్ సెర్చ్కు ఇంటర్నెట్ అవసరం. అమెరికాకు చెందిన ఓపెన్ఏఐ సంస్థ చాట్ జీపీటీని రూపొందించింది. చాట్ జీపీటీ మనకు కావాల్సిన సమాచారాన్ని ఒకే సమాధానంగా ఇస్తుంది. వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సమయం ఆదా అవుతుంది. చదువులకు సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తుంది. కష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్స్ కూడా సెకన్లలో రాసిస్తుంది. గూగుల్ సెర్చ్లో అడిగిన దానికి సంబంధించి అనేక లింక్స్ను ఇస్తుంది. ఈ లింక్స్ నుంచి సమాచారం వెతుక్కోవాలి. చాట్జీపీటీ ముందుగా (2021 వరకు) నిక్షిప్తం చేసిన సమాచారం మాత్రమే ఇస్తుంది. (ఇదీ చదవండి: ఇక చైనా ‘చాట్బాట్’.. రేసులో ఆలీబాబా!) -
జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement