-
జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ
పాలకుర్తి : జాతీయ స్థాయి అండర్ 17 బాలుర క్రికెట్ పోటీల్లో పాల కుర్తి మండలం దర్దేపల్లికి చెందిన నిమ్మల అనిల్ అత్యుత్తమ ప్రతిభ కనబరి చాడు. ట్రెడిషనల్ ఒలిం పిక్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ హర్డోయి నగరంలో ఇటీవల ప్రథమ జాతీయ క్రీడోత్సవాలు జరి గాయి. ఈ పోటీల్లో రాష్ట్ర జట్టులో అనిల్ పాల్గొని స్వర్ణ పతకం సాధిం చాడు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ క్రికెట్లో అంతర్జాతీయ స్థాయి లో రాణించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్లో జరగనున్న అంతర్జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ఆడనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నానని, కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బం దులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి చేయూతనందించాలని అనిల్ కోరారు. -
జోరుగా బెట్టింగ్
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్ : క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యాయంటే చాలు పోలీసులు హడావుడి కనిపిస్తుంది. ప్రధాన సెంటర్లతో పాటు పలు బెట్టింగ్ స్థావరాలలోనూ, బుకీల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తారు. దీంతో పోలీసుల దాడులు ఉంటాయేమోనని పసిగట్టిన బుకీలు ప్రొద్దుటూరు వదలి వెళ్లే వారు. ఇది ఒకప్పటి మాట. కానీ ఇపుడు పోలీసుల దాడులు లేవు..భయపడి ఎక్కడికో దూరంగా పారిపోయే బుకీలు లేరు. క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయంటే ‘బుకీలకు ఇది మామూలే లే’ అని ఇక్కడి పోలీసు అధికారులు భావించడంతో క్రికెట్ బెట్టింగ్ అనేది సర్వసాధారణమైంది. వారం రోజుల నుంచి చాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. గతంలో పట్టణంలో ఉన్న ప్రధాన బుకీలతో పాటు సబ్ బుకీలు కూడా మ్యాచ్ల సమయంలో హైదరాబాద్, చెన్నై, తిరుపతి, బెంగుళూరు లాంటి న గరాలకు వెళ్లి బెట్టింగ్ నిర్వహించేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. కొన్ని రోజుల క్రితం కొందరు పేరు మోసిన బుకీలు మాత్రమే బయటి ప్రాంతాలకు వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. మరి కొందరు ప్రధాన బుకీలు, సబ్ బుకీలతో పాటు కొరియర్లు కూడా ఇక్కడే ఉంటూ విచ్చలవిడిగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన టీ దుకాణాలతో పాటు కూడళ్లలో బుకీల హడావుడి కనిపిస్తుంటుంది. వీరు బహిరంగంగానే లావాదేవీలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటే అతిశయోక్తి కాదు. బుకీలకు రాజకీయ అండ ప్రొద్దుటూరు బుకీలకు రాజకీయ అండ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ప్రధాన బుకీ వెనుక ఒక రాజకీయనాయకుడు ఉన్నాడని పోలీసు వర్గాల సమాచారం. గాంధీరోడ్డులో ఉన్న ఓ ద్వితీయశ్రేణి నాయకుడు కొందరు బుకీలకు అభయ‘హస్తం’ ఇస్తున్నట్లు సమాచారం. అతను ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు కూడా సంబంధిత బుకీల జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. అతని అండతోనే బుకీలు పట్టణంలోనే ఉంటూ విచ్చలవిడిగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకైతే పట్టణంలోని పోలీసులు ప్రధాన బుకీల స్థావరాలు కనిపెట్టి దాడులు నిర్వహించేవారు. అయితే ఇటీవల కాలంలో కొందరు కానిస్టేబుళ్లకు రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో కానిస్టేబుళ్లు బుకీలను పట్టుకోవడానికి సాహసించలేకపోతున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement