-
ఆధునిక వసతులతో కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం
-
పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్సీల్లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. క్రిటికల్ కేర్కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత) -
నర్సింగ్లో ఏడాది రెసిడెంట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: భారత నర్సింగ్ మండలి (ఐఎన్సీ) ఆస్పత్రుల్లోని క్రిటికల్ కేర్ విభాగాల్లో సేవలందించేందుకు కొత్తగా స్పెషాలిటీ కోర్సును ప్రవేశపెట్టింది. దీనిని పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ నర్సింగ్– రెసిడెన్సీగా పిలుస్తారు. ఈ కోర్సులో చేరేవారికి ఏడాదిపాటు రెసిడెంట్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. 200 పడకలున్న ఆస్పత్రులు ఈ కోర్సును బోధించేందుకు అనుమతిస్తారు. కరోనా కాలంలో క్రిటికల్ కేర్ వైద్యం అనేది కీలకంగా మారింది. దీంతో క్రిటికల్ కేర్ మెడిసిన్ వేగంగా అభివృద్ధి చెందింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల సంరక్షణ కోసం నర్సుల నైపుణ్యాలను పెంచాల్సిన అవసరముందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం నొక్కి చెప్పింది. ఐసీయూ సేవలు అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. ఈ రోగులను చూసుకోవడానికి నర్సులు ఉండాల్సిన అవసరముందని తెలిపింది. రోగికి అవసరమైన పోషకాహారం, కమ్యూనికేషన్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మొదలైన అంశాలపై వీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏడాది రెసిడెన్సీ కోర్సులో 10 శాతం థియరీ, 90 శాతం స్కిల్ ల్యాబ్, క్లినికల్ అంశాల్లో అభ్యసనం ఉంటుంది. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన వారు ఈ కోర్సును చేయవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన నర్సులను మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్లోని ఏదైనా క్రిటికల్ కేర్ యూనిట్లో మాత్రమే నియమించాలి. క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన నర్సులు అవసరమని భావించి కేంద్రం ఈ కోర్సు ప్రవేశపెట్టిందని నర్సింగ్ నిపుణులు అనిల్కుమార్, రుఢావత్ లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అత్యవసర సేవల.. క్రిటికల్ కేర్!
కండిషన్ ఎలా ఉంది...? క్రిటికల్ అట. ఈ మాటల్ని పెద్దగా చదువుకోని వారు కూడా ఉపయోగిస్తూనే ఉంటారు. చాలా సంక్లిష్టంగా అనే అర్థం వచ్చే ‘క్రిటికల్’ అనే మాటకు పూర్తి న్యాయం చేసేలా వ్యవహరిస్తుంటారు ఆ ‘కేర్’ ఇచ్చేవారు. రోగి అత్యంత సంక్లిష్టమైన దశలో ఉన్నప్పుడు అతడిని ఆ స్థితి నుంచి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం ఎంత ‘సంక్లిష్ట’మైనదో తెలియనిదేమీ కాదు. తీరా ఇంతా చేసి... మళ్లీ తమ గొప్పదనాన్ని దాచేసి నిశ్శబ్దంగా ఉండిపోయే ఆ విభాగమే... ‘క్రిటికల్ కేర్’. ఈ రోజు (అక్బోరు 9) ‘క్రిటికల్ కేర్ మెడిసిన్ డే’ సందర్భంగా ఆ విభాగం సేవలు, ప్రత్యేకతలపై అవగాహన కోసం ఈ కథనం. కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనా సరే... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండే, ఉండాల్సిన విభాగమది. దీనికోసమే అక్కడి డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. క్రిటికల్ కేర్ యూనిట్కు ఎలాంటి రోగులు...? చికిత్స అందించకుండా వదిలేస్తే కొద్ది క్షణాల్లోనే ప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న రోగులను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా ప్రమాదానికి గురైనవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్కు గురైన వారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు. అన్నింటా నిష్ణాతులు... ఈ ఇంటెన్సివిస్టులు... రోగిలో ఏ ప్రత్యేకమైన అవయవానికి లేదా వ్యవస్థకు వైద్యచికిత్స అవసరమో... ప్రధానంగా ఆ డాక్టర్తోపాటు మిగతా అనుబంధ సమస్యలు ఉన్న డాక్టర్ల బృందం వెంటనే రోగిని పర్యవేక్షించడం మొదలుపెడుతుంది. తొలుత అతడిజీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయించేలా చూస్తారు. ఇలాంటి ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. ఇలాంటి ఇంటెన్సివిస్ట్లకు కేవలం ఒక నిర్ణీతమైన వ్యవస్థ లేదా అవయవం మీదగాక... అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలన్నింటిపైనా పూర్తి పట్టు, చికిత్సలో మంచి నైపుణ్యం ఉంటుందన్నమాట. గతం కంటే ఇప్పుడు మరింత ప్రత్యేకం... గతంలో అక్కడ కేవలం కృత్రిమశ్వాస కల్పించడం లేదా వెంటిలేటర్పై ఉంచడం వంటి సేవలు లభ్యమయ్యేవి. యూరోప్ లాంటి దేశాల్లో పోలియో వ్యాధి ఒక మహమ్మారిలా వ్యాప్తిచెందుతున్నప్పుడు అత్యవసర వైద్యసేవలకోసం ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు పనిచేసేవి. కానీ ఈ ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. వాటికి కేటాయించే స్థలం, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, రోగికి సంబంధించిన అన్ని కీలకమైన రీడింగ్స్ను తీసుకునే పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా శరీరంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ అమర్చుతున్నారు. అన్నింటా పురోగతితో పాటు అత్యవసర సేవల్లోనూ... గతంలో వైద్యం అంటే కాస్త నింపాదిగా జరిగే ప్రక్రియ. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో రోగులు మరణించే ఉదంతాలే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యచికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడం, పెను ప్రమాదాల్లాంటివి సంభవించిన సందర్భాల్లోనూ అది జరిగిన మొదటి అరగంటలోగా తీసుకువస్తే దాన్ని ప్లాటినమ్ మూమెంట్స్ అని, ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మూమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మూమెంట్స్... అంటూ అభివర్ణించడం మొదలుపెట్టారు. అంటే గోల్డెన్ మూమెంట్స్లో ప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని మన వైద్యులు నిరూపించసాగారు. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్స్పెషాలిటీలు రావడం ప్రారంభించాయి. వీటికి తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు తమ తమ ప్రత్యేకతలను సంతరించుకోవడం ప్రారంభించాయి. ప్రాణాలను కాపాడేందుకు అత్యాధునిక వైద్యసేవలు అందివస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎం) అనే ప్రత్యేక విద్యార్హత/శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఎలాంటి వైద్యులీ ప్రత్యేక నిపుణులు...? మనకు ఏదైనా ఒక అవయవానికి వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమై ఉంటుంది. ఒకవేళ అది తీవ్రమైందనుకోండి. అప్పుడు పొరుగునే ఉన్న అవయవాలకు లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, వాటికి సంబంధించిన వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలవుతుందనుకోండి. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాదు. మెదడు కూడా స్తబ్ధతకు గురవుతుంది. దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోతుంటాయి. అలాగే మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడిందనుకోండి. అప్పుడు సమస్య మెదడు లేదా మెదడులోని రక్తనాళాలకు మాత్రమే పరిమితం కాదు... గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దానివల్ల ప్రభావితమైన మిగతా అవయవాలూ పనిచేయకుండా పోతున్నప్పుడు ఆ కండిషన్ను ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటుంటారు. పరిస్థితి విషమించి ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని మళ్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్గా అభివర్ణిస్తారు. ఈ పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్లోని డాక్టర్లు నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే ఆ విభాగంలో పనిచేసే వైద్యులు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... సంయుక్తంగా శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే ఇప్పుడు రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే ప్రాణాపాయాన్ని నివారించే విధులను నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి. ఏయే రోగులకు క్రిటికల్ కేర్ అవసరం...? సాధారణంగా అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక రోగి పరిస్థితి నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్లో ఉంచుతారు. వాళ్లే కాకుండా, పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చిన రోగులు, పక్షవాతం వచ్చిన వారు, అవయవాల మార్పిడి చికిత్స చేయించుకున్నవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కీమోథెరపీ తీసుకున్న తర్వాత, నీళ్లలో ముగినిపోయినవారు, మలేరియా, డెంగ్యూ, స్వైన్ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలో ప్రాణాంతకంగా మారినప్పుడు క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో విధ్వంసం సృష్టించినప్పుడు సైతం నగరంలోని చాలా కీలకమైన ఆసుపత్రుల క్రిటికల్ కేర్ యూనిట్లు అవిశ్రాంతంగా శ్రమించాయి. అనుపమాన సేవలు... అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సుల బృందం, సిబ్బంది పనిచేస్తుంటాయి. అయితే ఇంటెన్సివిస్టులు అనే ప్రత్యేక నిపుణులు మాత్రం వేళాపాళా అని చూసుకోకుండా తమ పనుల్లోకి ఉరుకుతుంటారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పనిచేస్తారు. ఇంత శ్రమపడేవారు సైతం రోగి కోలుకున్న తర్వాత మళ్లీ నిశ్శబ్దంగా మరొకరి ప్రాణాలు రక్షించే పనుల్లో నిమగ్నమవుతుంటారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో సాఫీగా పనులు జరిగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా రోగికి మేలు చేసేందుకే. అక్కడి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే పరిస్థితులను గణనీయంగా తగ్గించడానికే. అలాగే అక్కడ ఆగిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) సిబ్బందీ ఉంటారు. ఈ సేవల పురోగతిలో ఇంకా మెరుగుదల వచ్చి ప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం కోసమే క్రిటికల్ కేర్ డే సందర్భంగా ఈ ఇంటెన్సివ్ కేర్ నిపుణుల నేటి ప్రతిజ్ఞ. - నిర్వహణ: యాసీన్ ఇదొక బృందస్ఫూర్తితో కూడిన కార్యక్రమం... అత్యంత సంక్లిష్టమైన క్రిటికల్ కేర్లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాదు... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ తమ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు సాగుతుంటుంది. వీళ్లంతా టీమ్స్పిరిట్తో రోగిని సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి రక్షిస్తారు. ఉదాహరణ కోసం ఒక కేస్ ఒక వ్యక్తికి ఉదాహరణకు నిమోనియా సోకిందనుకుందాం. నిమోనియా ఊపిరితిత్తుల (శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన) సమస్య. మామూలుగానైతే నిమోనియా చికిత్స కోసం సాధారణ యాంటీబయాటిక్స్ చాలు. కానీ ఏదైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండాపోయిందనుకోండి. అప్పుడా పరిస్థితిని అధిగమించడానికి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కృత్రిమ శ్వాస కోసం వెంటిలేటర్ కావాలి. ఒకవేళ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్గా మారితే (అంటే రక్తం అంతా విషపూరితంగా మారిపోవడం) అప్పుడు యాంటీబయాటిక్స్ మాత్రమే సరిపోవు. అలాంటి పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. కొన్ని మందులను నరాల్లోకి ఎక్కిస్తూ రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చేయాలి. ఒక్కోసారి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్లంగ్ బైపాస్ అనే చికిత్సను సైతం అందించాలి. దీన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్ (ఈసీఎమ్ఓ) అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులనుంచి మూత్రపిండాలకు పాకిందనుకోండి. అప్పుడు రక్తంలోని మలినాలను కృత్రిమంగా శుభ్రం చేయడానికి ‘డయాలిసిస్’ నిర్వహించాలి. కొన్నిసార్లు రక్తం పూర్తిగా కలుషితమైతే... ఒకదారిన దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిసార్లు. దీన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో లభ్యమవుతున్న అత్యాధునిక వైద్యసేవలన్నమాట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement