-
మోకాళ్ల యాత్ర చేసినా నమ్మరు
నర్సాపూర్ : కాంగ్రెస్ నాయకులు మోకాళ్లపై యాత్ర చేసిన ప్రజలు, రైతులు వారిని నమ్మరని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఘనపూర్ ఆనకట్ట, సింగూరు అంటూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా సింగూరు, ఘనపూర్ ఆనకట్టల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. జిల్లా నుంచి నీటి పారుదల శాఖ మంత్రిగా సునీతారెడ్డి పని చేసినా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, ఘనపూర్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. అదంతా మరిచి నేడు జలదీక్ష, పాదయాత్ర అంటూ సునీతారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సింగూరు, ఘనపూర్ ఆనకట్టలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఘనపూర్ ఆనకట్టను పట్టించుకోనందున ఆయకట్టు 21 వేల ఎకరాల నుంచి పది వేల ఎకరాలకు తగ్గిందని విమర్శించారు. నిధులు ఎందుకు మంజూరు చేయలేదు.. తాము అధికారంలోకి రాగానే చరిత్రలో ఎపుడు లేని విధంగా ఘనపూర్ ఆనకట్టకు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం సాగు 21 వేల 530 ఎకరాలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభత్వం హయాంలో సింగూరు నీళ్లు జిల్లాకు ఇవ్వకుండా హైదరాబాద్కు తీసుకుపోయేవారన్నారు. తాము అధికారంలోకి రాగానే హైదబాద్కు గోదావరి నీళ్లు తెప్పించి సింగూరు నీళ్లను జిల్లాకే వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 20 ఏళ్ల చరిత్రలో ఏనాడు కాంగ్రెస్ నాయకులు రెండు టీఎంసీ నీళ్ల కన్న ఎక్కువ నీటిని సాగుకు ఇవ్వలేదన్నారు. తాము 2016– 17, 2017–18 సంవత్సరాల్లో మూడున్నర టీఎంసీల వంతున నీటిని సాగుకు ఇచ్చామన్నారు. వర్షాలు కురిసి ఏమాత్రం నీళ్లు వచ్చినా ఘనపూర్, నిజాంసాగర్ కింద సాగుకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సునీతారెడ్డి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నపుడు మంజీర, హల్దీవాగులపై చెక్ డ్యాంల నిర్మాణానికి ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లలో 14చెక్డ్యాంల నిర్మాణానికి గాను సుమారు వంద కోట్ల రూపయాలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఇదిలాఉండగా సింగూరు లిప్టును చాలా ఏళ్లు మంజూరు చేయలేదని 2008 లో లిప్టు ద్వారా నీరు ఇవవాలని ఆందోలు మండల ప్రజలు అడిగినా పూర్తి చేయలేదని ఆరోపించారు. కాగా టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండెళ్లకు 120 కోట్ల రూపాయలతో సింగూరు లిఫ్టును పూర్తి చేయడంతో ఆందోలు, పుల్కల్ మండలాల్లో 30 వేల ఎకరాలకు భూముల సాగుకు నీరు అందుతుందన్నారు. సింగూరులో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి అవసరాలకు గాను 5.7టీఎంసీల నీరు జిల్లాకు అవసరమవుతుందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చే ప్రభుత్వమని రైతులకు ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ను వారు నమ్మరన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్రెడ్డి, లక్ష్మి, అశోక్గౌడ్, హబీబ్ఖాన్లు పాల్గొన్నారు. -
బీజేపీ ఏం అన్యాయం చేసింది?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బీజేపీ అంటే పడనివారు తమపై విమర్శలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ప్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో బీజేపీ ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. గవర్నర్ న్యాయం ప్రకారమే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ మార్కులు వచ్చినందుకే గవర్నర్ పిలిచారన్నారు. కానీ ఇద్దరు కలిసి మాకు ఎక్కువ మార్కులు వచ్చాయని అంటే ఎలా కుదురుతుందని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. గోవాలో కాంగ్రెస్ వారు గవర్నర్కి లేఖ కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అయినా ఒక రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో రాష్ట్రం తీసుకోవాలని ఏముందని, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారుతుంటాయని అన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలోని ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదా అని ఆయన ప్రశ్నించారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాద ఘటన చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టకుండా బాధితులకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం వెంటనే వాటర్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జల రవాణాకు సంబంధించి బోట్లకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికే ఇవ్వాలన్నారు. -
మీ దిక్కున్న చోట చెప్పుకోండి
తిరుమలాయపాలెం : ఇన్నాళ్లు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా జవాబు చెప్పారు. సోమవారం మండలంలోని పాతర్లపాడు గ్రామంలో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సభలో మాట్లాడారు. రైతాంగానికి సాగునీరు కల్పించడంతోపాటు, 24 గంటల విద్యుత్ అందించి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేయడంతోపాటు రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద తరతమ భేదం లేకుండా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలైనా ప్రవేశ పెడతామని, కాంగ్రెస్ నాయకుల్లారా.. ‘మీ దిక్కు న్న చోట చెప్పుకోండని’ధ్వజమెత్తారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశ పెట్టామని రానున్న రోజు ల్లో వరినాట్లు వేసే యంత్రాలను కూడా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చు ట్టూ తిరగకుండా రైతులు సాగుచేసుకుంటున్న భూములను భూ యాజమాన్య హక్కు పత్రాలు కల్పించేందుకు యావత్ అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లోని రచ్చబండల వద్దకు పంపించి పైసా ఖర్చులేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వ డం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. గత ంలో లాగా దొంగ పహాణీలు, పాస్ పుస్తకాలకు అవకాశం లేకుండా పాస్ పుస్తకాలు ఇస్తూ ఆధార్తో అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ ఆనాడు సాగునీరు కల్పించే అవకాశం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రజల ఆదరాభిమానాలతో భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని, త్వరలోనే సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు కల్పిస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలేరుని అగ్రగామిగా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, జెడ్పీ సీఈఓ నగేశ్, ఆర్డీఓ పూర్ణచందర్రావు, ఎంపీపీ కొప్పుల అశోక్, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ వెంకటపతిరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మద్దినేని మధు, జిల్లా సభ్యులు, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
పాలమూరుకు వరం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా పాలమూరు జిల్లా రైతాంగానికి ఒక వరంలా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4వేల చొప్పున ఇవ్వనున్న నగదు జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేస్తుందని తెలిపారు. జిల్లాలోని మక్తల్ మండలం కాట్రేవ్పల్లి గ్రామంలో రైతుబంధు పథకాన్ని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పోచారం మాట్లాడారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో ఈ పథకం కింద దాదాపు 3.5లక్షల మంది రైతులకు రూ.354 కోట్లు, మక్తల్ నియోజకవర్గంలో 65,900 మంది రైతులకు రూ.93.16 కోట్లు, కాట్రేవ్పల్లి గ్రామంలో 357 మంది రైతులకు రూ.53లక్షలను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ప్రతీ ఎకరాకు రైతుబంధు పథకం కింద నగదు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని మంత్రి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దేశ రైతాంగానికి కొత్త ధైర్యం వచ్చినట్లయిందని వ్యాఖ్యానించారు. దేశానికి అన్నం పెట్టే రైతు రోజురోజుకు అప్పులలో కూరుకుపోతున్నాడనే ఆలోచనతో ఒక నిజమైన రైతుగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 70ఏళ్లుగా రైతుల ఓట్లతో రాజ్యమేలిన నేతలు వారి బతుకులను ఆగం చేశారని ఆరోపించారు. ప్రధానమంత్రి మొదలుకుని గ్రామ సర్పంచ్ వరకు అందరూ రైతు బిడ్డలం అని చెప్పుకుంటున్నా రైతుల పరిస్థితి ఇలా ఎందుకు తయారైందని ప్రశ్నించారు. యాసంగి పంటకు అందజేస్తాం... పెట్టుబడి సాయాన్ని ఏటా వానాకాలంతో పాటుయాసంగి సీజన్కు కూడా అందజేస్తామని మంత్రి పోచారం తెలిపారు. ప్రతీ ఏటా మే 17వ తేదీ వరకు వానాకాలం పెట్టుబడి చెక్కులు, అలాగే నవంబర్ 18 నుంచి యాసంగి పెట్టుబడి చెక్కులు అందజేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఏనాడు రైతులకు ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేసిన దాఖలాలు లేవన్నారు. వ్యాపారస్తులు తమ పిల్లలకు ఆస్తులను వారసత్వంగా అందిస్తుంటే.. రైతులు మాత్రం అప్పులను ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతుండటాన్ని తట్టుకోలేక ఒక రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం అందిస్తున్నారని తెలిపారు. అంతేకాదు గత ప్రభుత్వాల హయాంలో కరెంట్రాక, పంటలు ఎండిపోయి రాస్తారోకోలు, ఆందోళనలు జరిగేవని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్ను 24గంటల పాటు అందించేలా కృషిచేశారన్నారు. అదే విధంగా రైతు ఏదైన ప్రమాదవశాస్తు మరణిస్తే ఆకుటుంబాన్ని ఆదుకోవడం కోసం రూ.5లక్షల ప్రమాదభీమాను కల్పించారని, దానికి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అదనంగా 30 ట్రాక్టర్లు మంజూరు చేయాలని కోరారని, స్థానిక పరిస్థితులను పరిశీలించాక ఎమ్మెల్యే అడిగిన వాటికి అదనంగా మరో 20 కలిపి 50 ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే నైరుతికి వచ్చా... వాస్తు ప్రకారం రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఈశాన్య ప్రాంతమైన కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారని మంత్రి పోచారం వెల్లడించారు. అలాగే నైరుతి ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లాలో పథకం ప్రారంభానికి సీఎం ప్రతినిధిగా తనను పంపించారని తెలిపారు.అదేవిధంగా రైతు సమన్వయ నేతలు, వ్యవసాయ అధికారులు సమావేశమవడానికి క్లస్టర్ వేదికగా ‘రైతు వేదిక’ భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించామన్నారు. అందుకు అనుగుణంగా క్లస్టర్ల వారీగా స్థలాలు కేటాయించేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్కు పది సీట్లు కూడా రావు.. రైతులకు మేలు చేసే పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోందని మంత్రి పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను న్యాయస్థానాల్లో కేసుల ద్వారా అడ్డుకున్నట్లు రైతుబంధు పథకంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. కుంభకోణాలు చేసే ఆలోచనలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు.. మిగతా వారు కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. ఒకవేళ పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే సీటు మీద కూర్చోడానికి డజను మంది పోటీ పడుతున్నారని, ఒక్కడు కూర్చుంటే వంద మంది కాలు పట్టి లాగుతారన్నారని ఎద్దేవా చేశారు. చాలా ఆనందంగా ఉంది! అడ్డాకుల : పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి కోసం సాయం చేసిన ప్రభుత్వాలను చూడలేదు. నాకు 4.18 ఎకరాల భూమి ఉంటే రూ.17,800 చెక్కు వచ్చింది. వరి, పత్తి పంటలను సాగు చేయడానికి వీటిని వినియోగిస్తాను. రైతులకు మరిన్ని విధాల సాయం చేయడానికి ప్రభుత్వాలు పని చేయాలి. -
కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు
పాపన్నపేట(మెదక్): ‘కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువయ్యారు’. అంటూ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు దెప్పి పొడిచారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ విధానాలపై దేశం అంతా మెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం నొచ్చుకుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మెదక్ జిల్లాకు సాగునీరందించేందుకు కృషి చేస్తుంటే కాంగ్రెసోళ్లు కేసులు వేస్తున్నారని ఆరోపించారు. మెతుకుసీమకు ప్రాణాధారమైన మంజీరానదిలోని ప్రతినీటిబొట్టును వినియోగించుకుంటూ రైతన్నల బతుకులు మారుస్తామని స్పష్టం చేశారు. 65 యేళ్ల కాంగ్రెస్ పాలనలో 110 సంవత్సరాల ఘనపురం ఆనకట్ట చరిత్రలో రైతులు ఆందోళన చేయకుండా నోటిమాట కూడా అడక్కుండానే వారి పంట పొలాలకు సింగూర్ నుంచి సాగు నీరిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మెదక్జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. అందుకే రూ.100కోట్లతో ఆనకట్ట ఎత్తు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతోపాటు కాల్వల ఆధునీకరణ చేయడం జరిగిందన్నారు. తద్వారా ఈయేడు 25వేల ఎకరాల్లో వరిపంట పండిందన్నారు. కాంగ్రెస్పార్టీ అధికారంలో ఉంటే జిల్లాకు రైలు వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ నాటికి రైలు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్ట్లపై సీడబ్లు్యసీ చైర్మన్ మసూద్ హుస్సెన్, బిహర్, కర్ణాటక మంత్రులు మెచ్చుకుంటున్నారని తెలిపారు. హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మెదక్ ప్రజల 60యేళ్ల కలను సాకారం చేశారని తెలిపారు. మెదక్ డీఎస్పీ కార్యాలయానికి రూ.40లక్షలు, టేక్మాల్, జోగిపేట పోలీస్ స్టేషన్ భవనాలకు రూ.1కోటి, మెదక్లో సీఐ కార్యాలయానికి రూ.40లక్షలు, జోగిపేటలో రిషప్షన్ సెంటర్కు రూ.1.50కోట్లు, మెదక్లో పోలీస్ హెడ్క్వార్టర్ భవనానికి రూ.10కోట్లు, తూప్రాన్లో సీఐ కార్యాలయానికి రూ.35లక్షలు మంజూరు చేశామని తెలిపారు. జిల్లాలో సుమారు రూ.35.65కోట్ల వ్యయంతో పోలీసు భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన మెదక్ జిల్లాలో రైల్వేలైన్, హైవే, మెదక్చర్చి, ఘనపురం ఆనకట్ట, ఏడుపాయల దేవస్థాన అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కర్ణాటకలో బీజేపీ తన ఎన్నికల మెనిఫేస్టోలో పెట్టిందన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, సుధాకర్రెడ్డి, ఫరీరుద్దీన్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబుమోహన్, చింతా ప్రభాకర్, మదన్రెడ్డి, భూపాల్రెడ్డి, జెడ్పీచైర్మన్ రాజమణి, చైర్మన్ శేరి సుభాష్రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, జేసి నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement