-
‘అమ్మహస్తం’.. అస్తవ్యస్తం
శంషాబాద్, న్యూస్లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఏడాది దాటక ముందే అస్తవ్యస్తంగా మారింది. ప్రజలకు అవసరమైన సరకులను సక్రమంగా అందించలేక పోతోంది. నాసిరకం సరుకులు తీసుకోడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కొన్ని రకాల సరుకులు గోదాములకే పరిమితమవుతున్నాయి. జనవరిలో కార్డుదారులకు ఇవ్వాల్సిన పామాయిల్ ప్యాకెట్లకు మొండిచేయి చూపిన ప్రభుత్వం అప్పట్లో డీలర్లు చెల్లించిన డీడీలను ఫిబ్రవరి నెలకు సర్దుబాటు చేస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పామాయిల్ కోటాను విడుదల చేయడానికి డీలర్ల నుంచి ఎలాంటి డీడీలను తీసుకోకూడదని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో కార్డుదారులకు అందాల్సిన ఒక నెల పామాయిల్ ప్యాకెట్లను పక్కనపెట్టేసినట్లే. పప్పు పరిస్థితి కూడా అలాగే ఉంది. డిమాండ్ ఉన్న చోట కూడా పప్పును సరిగా సరఫరా చేయడం లేదు. పప్పు కోసం రేషన్ డీలర్లు డీడీలను సమర్పించినా ఇంకా కోటా విడుదల కాలేదు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పప్పు కోటా విడుదల ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ సరకులు వద్దేవద్దు.. అమ్మహస్తం పథకం ద్వారా అందించే కారంపొడి, పసుపు, చింతపండు తీసుకోడానికి రేషన్ డీలర్లు ససేమిరా అంటున్నారు. ఈ మూ డు వస్తువులు నాసిరకంగా ఉండడంతో దాదా పు మూడునెలలుగా జిల్లాలోని ఆయా గోదాముల్లో సరుకులు మూలుగుతున్నాయి. నాసిరకంగా ఉన్న కారం పొడి గతేడాది జూన్లో ప్యా కై ఉన్నాయి. తొమ్మిది నెలల వరకు మాత్రమే వాడాల్సిన కారంపొడి ప్యాకెట్ల గడువు మార్చినెలాఖరుకు ముగియనుంది. ఒక్క శంషాబాద్ గోదాములోనే ఏడు క్వింటాళ్ల కారంపొడి ప్యాకెట్లు మూలనపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కారంపొడి ప్యాకెట్లు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పసుపు, చింతపండుల పరిస్థితి అంతే. నాసిరకం సరుకులను జనాలు గుర్తించి దూరం పెడుతున్నా సర్కారు మాత్రం నాణ్యమైన సరుకులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. -
అంతా నాసిరకం
ఉదయగిరి, న్యూస్లైన్: నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి అమలులోకి తెచ్చిన అమ్మహస్తం పథకం ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. ఈ పథకం అమలు ఇప్పుడు రేషన్డీలర్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. నాసిరకమైన సరుకులను కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులు వెనకడుగు వేస్తుండగా, ఎలాగైనా అమ్మాల్సిందేనంటూ అధికారులు హుకుం జారీ చేస్తుండటంతో డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం జిల్లాలో ఏటా రూ.535 కోట్లకు పైగా సబ్సిడీ భరాయిస్తోంది. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో ప్రభుత్వం ఖర్చుచేస్తున్న సబ్సిడీ పెద్దలపాలవుతుందే తప్ప పేదలకు ఒనగూరిందేమీ లేదు. జిల్లాలోని 1896 చౌకదుకాణాల ద్వారా 8,95,208 కార్డుదారులకు రేషన్ సరుకులు అందజేస్తున్నారు. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం ద్వారా 9 రకాల సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ సరుకుల కిట్లో బియ్యం, కిరోసిన్, అరకిలో చక్కెర, కిలో కందిపప్పు, వంద గ్రాముల పసుపు, 250 గ్రాముల కారం, అరకిలో చింతపండు , కిలో ఉప్పు, కిలో గోధుమపిండి , కిలో నూనె ఉంటాయి. వీటిని సబ్సిడీపై రూ.185కి ఇస్తున్నారు. ఈ సరుకులు ప్యాక్ చేస్తున్న కవర్లు ఆకర్షణీయంగా ఉంటున్నా కందిపప్పు, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి నాసిరకంగా ఉంటున్నాయి. చింతపండులో గింజలు తప్ప పండు కనిపించడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. కారంలో రంపపు పొడి, ఇతరత్రా పొడులు కలుపుతున్నారని, ఇది తింటే రోగాలపాలు కావల్సిందేనని దాని జోలికి వెళ్లడం లేదు. కందిపప్పు ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకడం లేదు. గోధుమపిండిలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఈ విధంగా ఒకటి, రెండు నెలల్లో సరఫరా అవుతున్నాయనుకుంటే పొరపాటే. పథకం ప్రారంభించిన ఈ 8 నెలల నుంచి ఒకటి, రెండు నెలలు తప్ప ఇదే పరిస్థితి కొనసాగుతోందని కొందరు డీలర్లు సైతం ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు బియ్యం, చక్కెర, నూనెను మాత్రం తీసుకెళుతున్నారు. మిగతా సరుకులు నాసిరకంగా ఉన్నాయని లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకమైన సరుకులు పేదలకు అంటగడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబోదిబోమంటున్న డీలర్లు సివిల్ సప్లయీస్ అధికారులు ప్రతి నెలా కచ్చితంగా అమ్మహస్తం సరుకులకు డీడీలు చెల్లించి సరుకులు తీసుకోవాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు తీసుకోక తాము ఆర్థికంగా నష్టపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. ఈ సరుకుల విషయంలో మినహాయింపు ఇస్తే పథకం మొత్తం నీరుగారిపోతుందనే ఉద్దేశంతో డీలర్లు కచ్చితంగా డీడీలు చెల్లించాలనే షరతును అధికారులు పెడుతున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
'లూసిఫర్2'లో మాఫియా డాన్గా మోహన్లాల్ లుక్ రివీల్
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement