-
దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు
Suriya, Naresh Movies Won DadaSaheb Phalke Film festival Award: తమిళ స్టార్ హీరో సూర్య ‘జై భీమ్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Suriya’s ‘Jai Bhim’ bags two awards at the Dadasaheb Phalke International Film Festival 2022 "The film won the award for the Best Film and actor Manikandan won the Best Supporting Actor awards at the film festival reportedly on May 3." - TOI #JaiBhim pic.twitter.com/DZ5iL493i6 — ♂️ ᴿᵃᵗᵉᵈ®️ˢᵘᵖᵉʳ ˢᵗᵃʳ🌟 ᵀʰᵃˡᵃᵖᵃᵗʰʸ🥇MSD7️⃣⚓ (@VIIJAYism) May 4, 2022 చదవండి: వైరల్: ఎయిర్పోర్ట్లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును విజయ్ అందుకున్నారు. దీంతో నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్కి అభినందనలు తెలుపుతున్నారు. This is the proud moment for me and my Naandhi team about my Darling @vijaykkrishna receiving the Dadasaheb Phalke Film Festival 2022 Award as the best Debut Director. In this joy, the responsibility of all our friends is further increased more.. @allarinaresh @varusarath5 pic.twitter.com/zd7rxxEKoq — Brahma Kadali (@brahmakadali) May 1, 2022 చదవండి: విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గుల్జార్కు ఫాల్కే పురస్కారం
అవార్డు కింద స్వర్ణకమలం.. రూ. 10 లక్షల నగదు ఐదు దశాబ్దాలకుపైగా సినీ రంగానికి సేవ చేసిన గుల్జార్ న్యూఢిల్లీ: ‘తుజ్సే నారాజ్ నహీ..’, ‘తెరె బిన జిందగీ సే..’ లాంటి మధురమైన పాటలకు ప్రాణం పోసిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దర్శక నిర్మాత గుల్జార్ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఐదు దశాబ్దాలకుపైగా తన సాహిత్యంతో గుల్జార్ సినీ ప్రేక్షకులనే కాక.. ఆసేతు హిమాచలాన్నీ మైమరపింపజేశారు. గుల్జార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలతోనే కాదు.. కథ, మాటల రచయితగా.. దర్శకునిగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కేకు 2013 సంవత్సరానికి గుల్జార్ను ఏడుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 45వ ప్రజ్ఞాశాలి గుల్జార్. ఈ అవార్డు కింద ఆయనకు స్వర్ణ కమలంతో పాటు, పది లక్షల రూపాయల నగదు పురస్కారం, శాలువా అందజేస్తారు. 79 ఏళ్ల గుల్జార్ అసలు పేరు సంపూరణ్సింగ్ కల్రా. 1934లో పాకిస్థాన్లోని పంజాబ్లో జన్మించారు. దేశ విభజన అనంతరం గుల్జార్ కుటుంబం అమృత్సర్ చేరింది. అయితే గుల్జార్ ముంబై చేరుకుని గ్యారేజ్ మెకానిక్గా పనిలో చేరారు. ఖాళీ సమయంలో కవిత్వం రాసేవారు. 1956లో సినీ గేయ రచయితగా గుల్జార్ సినీ జీవితం ప్రారంభమైంది. బిమల్ రాయ్ చిత్రం ‘బందినీ’తో గుల్జార్ దశ తిరిగింది. ఆ చిత్రం విజయంతో ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత ఎస్డీ బర్మన్, సలీల్ చౌధురి, శంకర్ జైకిషన్, హేమంత్ కుమార్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, మదన్ మోహన్, రాజేశ్ రోషన్, అనూ మాలిక్, శంకర్-ఎహ్సాన్-లాయ్ తదితర ప్రముఖ సంగీత దర్శకులతో కలసి పని చేశారు. ఆర్డీ బర్మన్, ఏఆర్ రెహ్మాన్, విశాల్ భరద్వాజ్తో కలసి పలు అల్బమ్లకు, ప్రోగ్రామ్లకు ఆయన పనిచేశారు. దర్శకుడిగానూ ఎన్నో కళాత్మక చిత్రాలను రూపొందించారు. 1971లో ‘మేరే ఆప్నే’ చిత్రంతో గుల్జార్ తొలిసారి మెగాఫోన్ చేపట్టారు. పరిచయ్, కోషిష్, ఆంధ్రీ, మౌసమ్, అంగూర్, నమ్ఖీన్, ఖుష్బూ వంటి మేటి చిత్రాలు రూపొందించారు.ఆయన చివరిసారిగా టబు నటించిన ‘తుహుహు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నటి రాఖీని గుల్జార్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మేఘనా. మేఘనకు ఏడాది వయసు ఉండగా రాఖీ, గుల్జార్ విడిపోయారు. తండ్రిబాటలోనే నడిచిన మేఘన ఫిల్హాల్, జస్ట్ మ్యారీడ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. 2002లో గుల్జార్ను సాహిత్య అకాడమీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. ఆయన అందుకున్న జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులకు లెక్కలేదు. 2009లో స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రంలోని ‘జయ హో’ పాటకుగానూ ఏఆర్ రెహ్మన్తో కలసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో జయహో పాటకు గ్రామీ అవార్డు దక్కింది. గొప్ప గౌరవం: గుల్జార్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వచ్చిన సందర్భంగా గుల్జార్ స్పందిస్తూ.. ‘‘ఈ పురస్కారం దక్కడం గొప్ప గౌరవం. దీంతో పరిపుర్ణత సాధించినట్టు భావిస్తున్నా. ఇది ఒక పాట, స్క్రీన్ ప్లే రాసినందుకు వచ్చింది కాదు. ఒక వ్యక్తి చేసిన అన్ని సేవలకు దక్కిన గౌరవం. నన్ను ప్రేమించి, మద్దతు ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. గుల్జార్కు ఫాల్కే అవార్డు దక్కడంపై గాన కోకిల లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, అనుపమ్ ఖేర్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement