-
దళిత యువకుడిని చంపి.. తల్లిని వివస్త్రను చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ కేసు విషయమై చెలరేగిన వివాదంలో దళిత యువకుడైన నితిన్ అహిర్వార్(18)ని కొట్టి చంపారు దుండగులు. మొదట అతడి ఇంటిని ధ్వంసం చేసిన ఆ ముఠా తర్వాత అతడిని కొట్టి చంపి అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి సోదరి చెప్పిన కథనం ప్రకారం.. విక్రమ్ సింగ్ ఠాకూర్ అనే యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ 2019లో కేసు దాఖలు చేసింది. ఈ కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడు కొంతమందితో కలిసి తన ఇంటికి వచ్చి మరీ బెదిరించాడని అందుకు ఆమెతోపాటు ఆమె తల్లి కూడా నిరాకరించిందని, దాంతో ఆ ముఠా తమ ఇంటిని నాశనం చేశారని తెలిపింది. వారంతా అక్కడి నుండి బస్స్టాండ్కు వెళ్లి అక్కడున్న తన సోదరుడు నితిన్ అహిర్వార్ను తీవ్రంగా గాయపరుస్తుండగా వారిని అడ్డుకోబోయిన ఆమె తల్లిని కూడా కొట్టి వివస్త్రను చేశారంది. వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా వినలేదని తనపై కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసును నమోదు చేసి ప్రధాన నిందితుడితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామని గ్రామపెద్ద భర్తతో సహా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు అడిషనల్ ఎస్పీ సంజీవ్ ఉయికే. MP News : 'मामा' का राज, लाडलियों पर अत्याचार... @ChouhanShivraj || @BJP4MP || @MPDial100 || @OfficeOfKNath || @INCMP || @Zeepramod #MadhyaPradesh #LadliBehna #ShivrajSinghChouhan #CrimeNews #TopNews #ZeeMPCG For More Updates : https://t.co/uXPUZQobFo pic.twitter.com/sfDdDqnoQL — Zee MP-Chhattisgarh (@ZeeMPCG) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
న్యాయంకోసం పాతికేళ్లుగా పోరాటం
చుండూరు హత్యాకాండ జరిగి నేటికి 25 ఏళ్లు పెండింగులోనే మూడు అప్పీళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అనాసక్తి..! ఆగస్టు 6.. 1991. గుంటూరు జిల్లా చుండూరు గుండె పగిలింది. రెండు వర్గాల మధ్య అడపాదడపా జరుగుతున్న చిన్న ఘర్షణలు చినికిచినికి గాలివానగా మారాయి. ఎనిమిదిమంది దళితులు ఊచకోతకు గురయ్యారు. ఈ దారుణం మరుసటిరోజు వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందనేది ఆ తరువాత రోజుకుగానీ బయటి ప్రపంచానికి తెలియలేదు. ఈ దారుణం తెలిసి యావద్దేశం నిర్ఘాంతపోయింది. తెనాలి: చుండూరులో దళితులపై జరిగిన హత్యాకాండ కేసులో సుప్రీంకోర్టులో అప్పీళ్లలో పురోగతి లేదు. రెండేళ్ల కిందట దాఖలైన మూడు అప్పీళ్లు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. పత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా చేశారు. సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆరోగ్యం సహకరించని పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగలేదు. దళితుల తరఫు అప్పీలుపై వాదనకు ఏర్పాటైన సీనియర్ న్యాయవాది మరణించారు. మరొకరి నియామకం లేకుండాపోయింది. దీంతో అప్పీళ్ల పెండింగ్ అనివార్యమైంది. ఇలాగే కొనసాగితే చుండూరు దళితులు మరోసారి దగా పడే అవకాశముంది. చుండూరులో దళితుల హత్యలు జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. దాడులపరంగానే కాదు.. దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు నేతృత్వంలో చుండూరు నుంచి ఢిల్లీ వరకు దళిత ఉద్యమం జరిగిన తీరు, పునరావాసం, నేరం జరిగినచోటే విచారణ, తీర్పు అనే ప్రత్యేకతలతో ఈ కేసు చారిత్రాత్మకమైంది. ప్రతిఘటనోద్యమం ఫలితంగా దళితుల రాజకీయ, సామాజిక చైతన్యం పదునుదేరి వారి ప్రస్థానాన్ని సమున్నతం చేసింది. అనేక అవరోధాలను ఎదురైనా.. అధిగమించి 16 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు దేశచరిత్రలో సంచలనమైంది. 2007 జూలై 31న చుండూరులోని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి అనిస్.. ఈ కేసులో 21 మందికి జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. మరో 35 మందికి ఏడాది జైలు, రెండువేల రూపాయల జరిమానా విధించారు. 123 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. ఈ తీర్పు అన్యాయమంటూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. తమను నిర్దోషులుగా ప్రకటించాలని ముద్దాయిలు, కేవలం 21 మందికే జీవితఖైదు విధించారని, ఏడాది శిక్ష పడిన 35 మందికి, నిర్దోషులుగా ప్రకటించిన వారికి యావజ్జీవం విధించాలని దళితులు అప్పీలు చేశారు. ప్రభుత్వం తరఫున అప్పీళ్లున్నాయి. న్యాయపరమైన అంశాలతో ముద్దాయిల అప్పీలునే హైకోర్టు విచారణకు స్వీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన సహాయకుడు కొత్తగా అప్పీళ్లు దాఖలు చేసినా, మరింత జాప్యం జరుగుతుందన్న భావనతో హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. ముద్దాయిల అప్పీలుపై విచారించి, వారిని నిర్దోషులుగా తీర్పునిచ్చారు. 2014 ఏప్రిల్ 22న వెలువడిన ఈ తీర్పుతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. ఈ కేసు వ్యవహారాలను చూసేందుకు హిమాచల్ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, నెల్లూరుకు చెందిన జస్టిస్ ఎం.ఎన్.రావును ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంను సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. హైకోర్టు తీర్పు అన్యాయమని, దిగువ కోర్టు తీర్పును వర్తింపజే సి శిక్షలు పునరుద్ధరించాలని కోరుతూ ఎం.ఎన్.రావు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు తీర్పును రద్దుచేసి.. ముద్దాయిలు, దళితులు, ప్రభుత్వం.. ముగ్గురి అప్పీళ్లను ఏకకాలంలో విచారించి తీర్పునివ్వాల్సిందిగా కేసును తిప్పిపంపించాలని మరో అప్పీలు దాఖలు చేశారు. అప్పటివరకు హైకోర్టులో పెండింగులో ఉన్న రెండు అప్పీళ్లను విచారించకుండా స్టే ఇవ్వాలని కోరారు. ఆ ప్రకారం సుప్రీంకోర్టు 2014 జూలె 30న స్టే ఉత్తర్వులు జారీచేసింది. దళితులు కూడా మరో ప్రైవేటు అప్పీలును దాఖలు చేసి, సీనియర్ న్యాయవాది ఆల్తాఫ్ అహ్మద్ను న్యాయవాదిగా నియమించుకున్నారు. కొద్దికాలం తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఎన్.రావు తన పదవికి రాజీనామా చేశారు. సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొజ్జా తారకం శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. దళితుల తరఫు న్యాయవాది అల్తాఫ్ అహ్మద్ కన్నుమూశారు. దీంతో మూడు అప్పీళ్లు పెండింగులో పడ్డాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేదు, దళితులు మరొక న్యాయవాదిని నియమించుకోలేదు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలిసిందే.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement