-
రోడ్డును పట్టించుకునేదెవరూ ?
సాక్షి, బుగ్గారం: ధర్మపురి నుంచి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారిపై నేరెళ్ల గ్రామ సమీపంలోని గుట్ట వద్ద రహదారి పూర్తిగా శిథిలమైంది. దీంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. రహదారి అంతా గుంతలమయంగా మారడంతో రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారి గుంతలమయం కావడమే కాకుండా, మూల మలుపు ప్రాంతం కూడా కావడంతో గతంలో ఇదే ప్రాంతంలో వాహనాలు నియంత్రణ కోల్పోయి పలు ప్రమాదాలు సంభవించాయి. పలుమార్లు వాహనాలు బోల్తా పడడంతో పాటు కొంతమంది చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. -
రోడ్డే గ్రానైట్ అడ్డా!
ప్రకాశం, బల్లికురవ: అధికారం చేతిలో ఉందని మంత్రి, మరో 4 క్వారీల యజమానులు ఆర్అండ్బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోడ్డును అడ్డాగా చేసుకుని గ్రానైట్ మీటరు, ముడి రాళ్లను క్వారీ నుంచి దొర్లించటంతో తారు రోడ్డు సైతం మట్టిరొడ్డుగా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కోట్లు వెచ్చించి ఇటీవల అభివృద్ధి పరచిన రోడ్డును క్వారీదార్లు తమ ఆధీనంలోకి తీసుకున్నా అధికార్లు చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అడిగేవారే లేక పోవటంతో వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్ మోతలు అధికమయ్యాయి. బ్లాస్టింగ్ మోతలతో వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు. 7.6 కి.మీ రోడ్డు.. మండలంలోని చెన్నుపల్లి అనంతవరం ఆర్అండ్బీ రోడ్డులో కొండాయపాలెం గ్రామం నుంచి వేమవరం వరకు 7.6 కిలో మీటర్లను ఇటీవల రూ. 8 కోట్లతో డబుల్ రోడ్డుగా విస్తరించి అభివృద్ధి పరిచారు. ఈ రోడ్డులోనే కొండాయపాలెం–మల్లాయపాలెం గ్రామాల మధ్య కొణిదెన రెవెన్యూలోని ఈర్లకొండ విస్తరించి ఉంది. కొండలోని సూమారు 5 హెక్టార్లను లీజుకు తీసుకున్న మంత్రి శిద్దా రాఘవరావు ఆర్అండ్బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రే ఆధీనంలో తీసుకుంటే తమను అడిగేదెవరని మరో నాలుగు క్వారీల యజమానులు రోడ్డును ఆక్రమించి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. రోడ్డు మార్జిన్లోనే రాళ్లు ఈ రోడ్డు ఇరువైపులా మార్జిన్లో గ్రానైట్ మీటరు ముడిరాళ్లను నిల్వ చేస్తున్నారు. అక్కడే లారీలను నిలిపి లోడింగ్ చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పటంలేదు. రోడ్డుపైనే క్రేన్లతో ఇటీవల నిర్మించిన తారు రోడ్డు సైతం మూన్నాళ్ల ముచ్చటగా మారి రూపం కోల్పోతోంది. ఈ పరిస్థితులకు తోడు వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్ మోతలతో వాహన చోదకులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రెండు మండలాల వాసులకు దగ్గరి మార్గం బల్లికురవ, సంతమాగులూరు మండలాలల్లో 40 గ్రామాల ప్రజలకు చిలకలూరిపేట, చీరాల, గుంటూరు వెళ్లాలంటే ఇదే దగ్గరి మార్గం ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించి అధికారులు చేతులు దులుపుకున్నారే తప్ప పర్యవేక్షణ లేదని వాహనచోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై క్వారీలు, బ్లాస్టింగ్ మోతలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొండమీద బ్లాస్టింగ్ శబ్దానికి రాళ్లు రోడ్డు మీదకు వచ్చి పడుతున్నాయి. కొత్త వ్యక్తులు ఈ రోడ్డు ద్వారా వెళ్లాలన్నా బ్లాస్టింగ్ మోతలతో భయాందోళన చెందుతున్నారు. చెన్నుపల్లి అనంతవరం రోడ్డులో కొండాయపాలెం గ్రామసమీపంలో రోడ్డును గ్రానైట్దార్లు ఆధీనంలోకి తీసుకోవటం నేరమని ఆర్అండ్బీ జేఈ భాస్కరరావు అన్నారు. రోడ్డును పరిశీలించి బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. -
చిత్తశుద్ధి ఏదీ ?
నల్లగొండ, న్యూస్లైన్: నల్లగొండ పట్టణంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై పాలకులకు, అధికారులకు చిత్తశుద్ధి కరువైంది. పట్టణంలో రూ.56.79కోట్లు వెచ్చించి చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు అస్తవ్యస్తంగా జరిగాయి. ఓ వైపు నాణ్యతాలోపాలకు నిలువుటద్దంగా నిలుస్తుండగా, మరోవైపు నిధులు లేమితో చివరాంతం పనులు జరగక గుంతలు తేలిన మట్టిరోడ్లు వెక్కిరిస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న నల్లగొండ పట్టణ జనాభాకనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యుఐడీఎస్ఎస్ఎంటీ పథకం కింద రూ.56.79కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పథకాన్ని మంజూరు చేయించారు. పనులు దాదా పు తుది దశకు చేరుకున్నప్పటికీ గడిచిన కొంతకాలంగా స్తబ్దత నెలకొంది. నల్లగొండ మున్సిపాలిటీలో గత మార్చి31 చివరాంతం నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసి నా పనులు మాత్రం పూరిస్థాయిలో జరగలేదు. శాశ్వత పరిష్కారం దిశగా... నల్లగొండ పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, అధ్వానంగా ఉన్న వ్యవస్థీకృత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలతో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం 80 శాతం వాటా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం, మున్సిపాలిటీ మరో పది శాతం నిధులు వెచ్చించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులను వెంటనే విడుదల చేయించి వైఎస్ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభించారు. నల్లగొండలో పథకాన్ని ప్రారంభించి 18నెలల కాలంలో పూర్తి చేసేందుకు 2009 ఫిబ్రవరిలో సదరు కాంట్రాక్టు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి 2010 సెప్టెంబర్ మాసంలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా పలు కారణాలతో గడువులు పెంచుతూ 2012 మార్చి నాటికి తుది గడువు విధించారు. అయినా ఇప్పటికీ నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 205.08కి.మీకు గాను 194.12 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా 10.96కి.మీ పూర్తికావాల్సి ఉంది. ప్రధానమైన శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక మ్యాన్హోల్స్ మొత్తం 7875 గాను 7730 మాత్రమే నిర్మించగా 145 మ్యాన్మోల్స్ పెండింగ్లో ఉన్నాయి. అదే విధంగా సైడ్చాంబర్స్ 18వేలకు గాను 17వేల 738 పూర్తయ్యాయి. శుద్ధికేంద్రాల ఏర్పాటుకు చొరవ ఏదీ..? అండర్గ్రౌండ్ డ్రెయినేజి తుదిదశ అయినటువంటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు మాత్రం ఇప్పట్లో పరిష్కారం లభించేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు భూ సమస్య ప్రధాన కారణం కాగా పరిష్కారానికి చొరవచూపే వారే కరువయ్యా రు. ప్రభుత్వం నిధులు కేటాయింపుకు ససేమిరా అనడం, చివరకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పలు దఫాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు చేయడం వరకు వెళ్లింది. పొంగిపొర్లుతున్న మ్యాన్హోల్స్.. పట్టణంలో నిర్మించిన మ్యాన్హోల్స్ మురుగునీటితో పొంగిపొర్లుతున్నాయి. కాంట్రాక్టర్ గృహాలకు అనుసంధానం చేయకపోవడంతో ప్రజలు స్వయంగా కనెక్షన్లు కలుపుకున్నారు. దీంతో మ్యాన్హాల్స్ మొత్తం ఇళ్లలోని మురికినీటితో నిండి భయానకంగా తయారయ్యాయి. పస్తుతం వర్షాకాలం సీజన్ రావడంతో మురికినీటికి వర్షంనీరు తోడుకావడంతో పట్టణంలోని గంధవారిగూడెం, చైతన్యపురి కాలనీ, డీఈఓ కార్యాలయం ఎదురుగా, బోయవాడ స్కూల్ ఎదుట, సావర్కర్నగర్, ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పొంగిపొర్లుతూ రోడ్లపై ప్రవహిస్తున్నాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసి మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టకపోతే అండర్గ్రౌండ్ పైపు లు, మ్యాన్హోల్స్ ఎక్కడికక్కడ పగిలి రూ.56 కోట్ల నిధులు నిష్ఫలమయ్యే ప్రమాదముందని సాంకేతిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అండర్గ్రౌండ్ అసంపూర్తి నల్లగొండ పట్టణం లో ప్రజాప్రయోజనం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అం డర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను చేపట్టిన ప్రభుత్వం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైప్లైన్, మ్యాన్హోల్ తదితర వ్యవస్థలు పూర్తయి ఏడాదిన్నర గడిచినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్హోల్స్లకు అనధికారికంగా ప్రజలే కనెక్షన్లు కలుపుకోవడంతో నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. దీంతో పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. - చెనగోని భిక్షం, శాస్త్రినగర్, నల్లగొండ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement