-
Ind Vs Pak: ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగబోయేది అక్కడే..!
ఆసియా కప్-2023ను (వన్డే ఫార్మాట్) ఈ ఏడాది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుగుతుందన్న వివరాలు వెల్లడి అయినప్పటికీ.. వేదికలు, ఫిక్షర్స్ ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఈ టోర్నీలో భారత్-పాక్ గ్రూప్ దశ మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్కు (ఏసీసీ) ఓ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ అనుకున్న విధంగా భారత్-పాక్ మ్యాచ్ను కొలొంబోలో కాకుండా డంబుల్లాలో నిర్వహించాలని ఏసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీసీ ఇదివరకే నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. లంకలో జరిగే మిగతా మ్యాచ్ల వేదికలు ఖరారయ్యాక, ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్లో కొలొంబోలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున భారత్-పాక్ మ్యాచ్ వెన్యూను డంబుల్లాకు మార్చాలని అనుకున్నట్లు ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పాకిస్తాన్ లెగ్ మ్యాచ్లన్నీ లాహోర్లో జరుగుతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇదివరకే ప్రకటించింది. కాగా, ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్లో 4 మ్యాచ్లు, శ్రీలంకలో 9 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోటీపడతాయి. ఓ గ్రూప్లో భారత్, పాకిస్తాన్, నేపాల్.. మరో గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. -
టీమిండియా విక్టరీ.. చుక్కలు చూపిన ఫ్యాన్స్
కోలంబో: టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో ఆతిథ్య జట్టు శ్రీలంక పేలవమైన ప్రదర్శన ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహా జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. డంబుల్లాలో మొదటి వన్డే ఓటమి తర్వాత ఏకంగా సభ్యులను ఘోరావ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆదివారం వన్డే ముగిశాక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డగించి వ్యతిరేక నినాదాలు చేశారని సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే తీవ్రంగానే యత్నించినట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. మరోవైపు జట్టులో అంతర్గత కలహాలపై కోచ్ నిక్ పోతస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు ఫిట్నెస్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నారని, అయితే సమస్యలు డ్రెస్సింగ్ రూంలోనే పుడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనకు జట్టులో స్వేచ్ఛ ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా ఆయన బోర్డుకు విజ్నప్తి చేయటం విశేషం. మరోపక్క జట్టుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మాజీ ఆటగాడు కుమార సంగక్కర స్పందించారు. ఇలాంటి సమయంలో సంయమనంతో ఉండి జట్టు సభ్యులకు మద్ధతుగా నిలవాలంటూ సంగక్కర ఓ వీడియో సందేశంలో పిలుపునిచ్చారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement