-
ఆసుపత్రికి చేర్చే దిక్కులేక మృత్యుఒడికి..
బ్రాహ్మణచెరువు (పెనుమంట్ర) : మోటారు సైకిల్తో చెట్టును ఢీకొన్న ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యువకుడ్ని ఎవరూ గమనించలేదు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ఆస్పత్రికి చేర్చే దిక్కులేకపోయింది. దీంతో యువకుడు మృత్యుఒడికి చేరాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్(30) గురువారం రాత్రి బ్రాహ్మణచెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును మోటారు సైకిల్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలపాలైన గణేష్ను ఎవరూ గమనించకపోవడంతో తెల్లవారేసరికి ఘటనస్థలంలో మృతి చెందాడు. అవివాహితుడైన గణేష్ ఇటీవలనే విదేశాల నుంచి ఇక్కడకు వచ్చాడని అతని బంధువులు తెలిపారు. పెనుమంట్ర ఎస్సై జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
ఈవ్టీజింగ్ చిదిమేసింది
వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. అక్క శ్రీగౌతమి కలెక్టర్ కావాలనే సంకల్పంతో సివిల్స్కు ప్రిపేర్ అవుతోంది. చెల్లెలు పావని ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. వీళ్లిద్దరూ స్కూటర్పై వెళుతుండగా.. మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్టీజింగ్కు పాల్పడటమే కాకుండా.. కారుతో ఆ స్కూటర్ను ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో శ్రీగౌతమి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాలకొల్లు అర్బన్/నరసాపురం రూరల్ : మద్యం మత్తు, ఈవ్టీజింగ్ ఓ యువతిని బలి తీసుకున్నాయి. ఇదే ఘటనలో మృతురాలి చెల్లి తీవ్రంగా గాయపడింది. ఈ దుర్ఘటన పాలకొల్లు–నరసాపురం రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నరసాపురం పట్టణంలోని కోవెల వీధికి చెందిన దంగేటి శ్రీగౌతమి, పావని అక్కాచెల్లెళ్లు. పూలపల్లి సంధ్యామైరైన్స్లో పావని ల్యాబ్టెక్నీషియన్గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి శ్రీగౌతమి, పావని పూలపల్లి నుంచి స్కూటర్పై నరసాపురం వెళ్తుండగా, కారు ఢీకొంది. ఈ ఘటనలో శ్రీగౌతమి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. పావని తీవ్రంగా గాయపడింది. నరసాపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈవ్టీజింగే కారణం స్కూటర్పై వస్తున్న పావని, శ్రీగౌతమిని మద్యం సేవించిన కొందరు యువకులు కారులో వెంబడించారు. ఈవ్టీజింగ్కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కారు స్కూటర్ను ఢీకొంది. ఫలితంగా గౌతమి అక్కడికక్కడే మరణించింది. పావని ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. కొందరు కారులో వెంబడించారని పావని కూడా చెబుతోంది. వైజాగ్ రిజిస్ట్రేషన్తో కారు స్కూటర్ను ఢీకొన్న కారు విశాఖపట్టణంలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్టు పాలకొల్లు రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. సివిల్స్ ప్రిపరేషన్లో శ్రీగౌతమి శ్రీగౌతమి చిన్ననాటి నుంచి బాగా చదివే విద్యార్థిని. నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ చదివిన ఆమె ఎన్సీసీ నేవీ విభాగంలో సీ సర్టిఫికెట్ పొందింది. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్డే పరేడ్లోనూ పాల్గొని ప్రశంసలందుకుంది. అదే కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం సివిల్స్కి ప్రిపేర్ అవుతోంది. విశాఖపట్నంలో శిక్షణ పొందుతోంది. తండ్రి మరణం నుంచి తేరుకోకుండానే... శ్రీగౌతమి తండ్రి నరసింహరావు వ్యవసాయ పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆ దుఃఖం నుంచి కోలుకోకుండానే శ్రీగౌతమి మరణించడం, పావని ఆస్పత్రి పాలుకావడం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. బంధువులు, స్నేహితులు గౌతమి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోదిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రత్తిపాడు ఫుడ్స్ఫ్యాట్స్ వద్ద కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన అడపా రామారావు(58), అతని భార్య వరలక్షి్మ(50) పూళ్లలో ఉన్న బంధువులను పలకరించేందుకు సోమవారం ఉదయం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బంధువులకు చెందిన కారులో స్వగ్రామం ఆరుగొలను వెళ్తుం డగా ఫుడ్స్ఫ్యాట్స్ సమీపంలో డ్రైవర్ వెంకటకృష్ణకు ఫిట్స్ రావడంతో బ్రేక్కు బదులుగా ఎక్స్లేటర్ను తొక్కాడు. దీంతో కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అడపా రామారావు, అతని భార్య వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ వెంకటకృష్ణకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులను పలకరించేందుకు వెళ్లి భార్యభర్తలు మృత్యువాత పడడంతో ఆరుగొలను గ్రామం విషాదంలో మునిగింది. ఘటనాస్థలానికి బంధువులు భారీగా తరలిరావడంతో ఫుడ్స్ఫ్యాట్స్ వద్ద తణుకు – ఏలూరు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. -
పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: 9 మందికి గాయాలు
ఏలూరు అర్బన్ : ముందు వెళ్తున్న లారీని ఆటో ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నూజివీడు మండలం లైన్తండాకు చెందిన కొందరు కూలీలు పనుల కోసం రెండురోజుల కిందట ఏలూరు మండలం చొదిమెళ్ల వచ్చారు. అక్కడ పనులు ముగిసిన అనంతరం వారంతా తిరిగి సొంత ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిది మంది తమ బంధువు వడిత్యా నాగరాజు ఆటోలో బయలుదేరారు. ఆటో దుగ్గిరాల డెంటల్ కాలేజీ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా లారీ వెళ్తుంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాణోతు సంకురమ్మ, వడిత్యా రాధ, వడిత్యా నరసింహులు, బాణోతు చిలకమ్మ, వడిత్యా బుజ్జి, ఆటో డ్రైవర్ వడిత్యా నాగరాజు, వడిత్యా స్వామి , వడిత్యా ప్రసాద్, వడిత్యా శ్రీను గాయపడ్డారు. వీరిలో మహిళ వడిత్యా బుజ్జి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది బాధితులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందించిన వైద్యులు తలకు తీవ్ర గాయమైన బుజ్జిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఆలమూరు : పదహారో నంబరు జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం స్థానిక లాకుల సమీపంలో రాజమహేంద్రవరం–రావులపాలెం రహదారిలో గుర్తు తెలియని మృతదేహం ఉండడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో పాటు రక్తపు మరకలు ఉండటంతో వేకువజామునే గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. మృతుడికి 30 సంవత్సరాలు ఉండవచ్చని, ఎరుపు రంగు టీ షర్టు, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో సమాచారం ఇవ్వాలని కోరారు.ఎస్సై దొరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement