-
హౌసింగ్ స్కీం: 5500 ఫ్లాట్లు, రూ.9.89 లక్షలకే ఫ్లాట్
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) గృహకొనుగోలుదారులకు భలే మంచి శుభవార్త అందించింది. వివిధ ప్రదేశాలలో 5,500 ఫ్లాట్లతో కూడిన కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రూ. 9.89 లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్ను అందించ నుంది. శుక్రవారం (జూన్ 30) ప్రారంభించిన ఈ పథకంలో ముందుగా వచ్చిన వారికి, ముందుగా కేటాయింపు ప్రాతిపదికన వీటిని విక్రయించ నుంది. ఫ్లాట్లలో 1-BHK, 2-BHK ,3-BHK ఇళ్లు ఉన్నాయి. అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జూన్ 14న ఆన్లైన్లో ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 4ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ఈ పథకం టోకెన్ చెల్లించి తమ కిష్టమైన ప్రాంతంలో ఫ్లాట్ను బుక్ చేసుకోవచ్చు. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) డీడీఏ హౌసింగ్ స్కీమ్లోని ఫ్లాట్ల వివరాలు 1-BHK ఫ్లాట్లు నరేలా, సిరాస్పూర్, రోహిణి, లోక్నాయక్ పురంలో ఉన్నాయి 2-BHK ఫ్లాట్లు నరేలా ,ద్వారకలో ఉన్నాయి 3-BHK ఫ్లాట్లు జసోలాలో ఉన్నాయి (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ఫ్లాట్లు: ధరలు సుమారుగా 1-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 9.89 లక్షల -రూ. 26.98 లక్షలు, లోక్నాయక్ పురంలో రూ. 28.47 లక్షలకు 2-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 1 కోటి నుండి రూ. 1.23 కోట్లకు-ద్వారకలో రూ. 1.33 కోట్లు 3-BHK ఫ్లాట్లు: రూ. 2.08 కోట్ల నుండి రూ. 2.18 కోట్లు బుకింక్ అమౌంట్ 1-BHK ఫ్లాట్లు: రూ. 50,000 (ఆర్థికంగా వెనుకబడినవారికి ), రూ. 1 లక్ష (జనరల్) 2-BHK ఫ్లాట్: రూ. 4 లక్షలు 3-BHK ఫ్లాట్: రూ. 10 లక్షలుచెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూరించి, అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిఉంటుంది. జూన్ 30 సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్. జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి (మరిన్ని అప్డేట్స్కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
ఎట్టకేలకు డీడీఏ ఫ్లాట్ల డ్రా
సాక్షి, న్యూఢిల్లీ: పలుమార్లు వాయిదా పడిన డీడీఏ హౌజింగ్ స్కీమ్-2014 లక్కీ డ్రా మంగళవారం విజయవంతంగా ముగిసింది. డ్రా ఫలితాలను సాయంత్రం డీడీఏ వెబ్సైట్పై ఉంచారు. అయినప్పటికీ డ్రా ఫలితాలను తెలుసుకోవడం కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ప్రధాన కార్యాలయం వద్దకు తరలి వచ్చారు. అన్ని సదుపాయాలతో ఫ్లాట్లను పూర్తిగా నిర్మించిన తరువాతనే విజేతలకు కేటాయిస్తామని డీడీఏ వైస్చైర్మన్ బల్విందర్కుమార్ తెలిపారు. ప్లాట్ల చెల్లింపులు ఆన్లైన్లోనే చేయాలన్నారు. డిసెంబర్ నాటికి దాదాపు అన్ని ఫ్లాట్లు సిద్ధమవుతాయని ఆయన తెలిపారు. డ్రా విజేతలు ఫ్లాట్ల కేటాయింపుల పత్రాలను స్వయంగా తీసుకోవాలని అన్నారు. డాక్యుమెంట్లు సమర్పించడం కోసం డీడీఏ 15 రోజుల పాటు వికాస్ సదన్లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తుందన్నారు. రోహిణిలో 3,914 ఫ్లాట్లు, సిరస్పుర్లో 2,840 ఫ్లాట్లు వచ్చే సంవత్సరం వరకు సిద్ధమవుతాయని ఆయన చెప్పారు. రెండు దశల్లో డ్రా..: డీడీఏ ప్రధాన కార్యాలయంలో రెండు దశలలో డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు రాండమైజేషన్ ప్రక్రియ మొదలై దాదాపు రెండు గంటల తరువాత ముగిసింది. మధ్యాహ్నం 12.15 గంటలకు కంప్యూటరైజ్డ్ డ్రా ఆప్ లాట్స్ కార్యక్రమం ప్రారంభమై 2 గంటలకు ముగిసింది. న్యాయమూర్తులు, నిఫుణులతో కూడిన త్రిసభ్య సంఘం మొదట సీడ్ నంబర్లను ఎంపిక చేశారు. ఈ కమిటీలో ఢిల్లీ ైెహ కోర్టు మాజీ న్యాయమూర్తి మంజు గోయల్, ఐఐటీ ప్రొఫెసర్ అంజుకుమార్, ఇన్ఫర్మేషన్ డైరక్టర్ మహేష్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. మొత్తం 25,040 ఫ్లాట్లలో 22 వేల ఎల్ఐజీ, 21 హెచ్ఐజీ, 49 ఎంఐజీ, 1195 జనతా, 700 ఈడబ్ల్యుఎస్ ప్లాట్లున్నాయి. వీటి కోసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట శారీరక వికలాంగుల డ్రా ప్రక్రియ నిర్వహించారు. ఆ తరువాత పదవీ విరమణ పొందిన సైనికోద్యోగులు, అమరులైన సైనికుల భార్యలు. షెడ్యుల్డు కులాలు, తెగల వారికి సంబంధించిన డ్రా నిర్వహించారు. ఫ్లాట్లలో 15 శాతం షెడ్యూల్డు కులాల కోసం. 7.5 శాతం షెడ్యూల్డు తెగలవారి కోసం, 1 శాతం అమరులైన సైనికుల భార్యల కోసం, 1 శాతం పదవీ విరమణ చేసిన సెనికోద్యోగుల కోసం, 3 శాతం ఫ్లాట్లు వికలాంగుల కోసం కేటాయించారు. డీడీఏ నిర్ణయం సరైనదే: హైకోర్టు న్యూఢిల్లీ: నగరంలో ఇప్పటికే ఆవాసం ఉన్నవారు మరొక ఫ్లాట్కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదంటూ ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నియంత్రణ విధించడాన్ని హైకోర్టు సమర్థింది. ఈ నిర్ణయం సరైనదేనని పేర్కొంది. ఇందుకు విరుద్ధం గా దాఖలైన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యా య మూర్తి జి. రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ‘ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అయినప్పటికీ ఈ నిర్ణయంలో ఎటువంటి తప్పూలేదు. ఒక్కొక్కరికి ఒకటికి మించి ఫ్లాట్ ఉం డకూడదనేదే దీని ఉద్దేశం’ అని పేర్కొంది. పిటిషన్ను రవీంద్రసింగ్ అనే అడ్వొకేట్ దాఖలు చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
'నా కొడుకు రాహుల్ని మీకు అప్పగిస్తున్నాను': సోనియా గాంధీ
అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు
చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..
తప్పక చదవండి
- ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
Advertisement