-
ఆర్బీఐ మరో సరప్రైజ్ ఇవ్వనుందా?
న్యూఢిల్లీ : ఆశ్చర్యకరమైన హాట్రిక్ సర్ప్రైజ్ ల తర్వాత, మరో ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించనుందా? రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ రివ్యూ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనుంది. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) గురువారం మరోసారి తన ద్రవ్య, పరపతి విధానాన్ని మధ్యాహ్నం 2.30 తరువాత ప్రకటించనుంది. ఇందుకోసం ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత పటేల్ అధ్యక్షతన ఈ కమిటీ బుధవారం సమావేశమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమీక్షలోనూ కీలకమైన రెపో రేటును యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. కీలక వడ్డీ రేటు లేదా రెపోరేటు 6.25 దగ్గర స్థిరంగా ఉంచే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. రాయిటర్స్ కు చెందిన 60మంది ఆర్థికవేత్తలు.. ఆరుగురు సభ్యులు ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు అక్టోబర్ నాటి స్థాయినే యధాతధంగా కొనసాగించవచ్చని అంచనా వేశారు. అయితే ఆర్బీఐ అక్టోబర్ లో అనూహ్యంగా వడ్డీరేట్ల కోత విధించింది. ఫిబ్రవరిలో కూడా ఆర్బీఐ"తటస్థ" వైఖరితో ఆశ్చర్యపరిచింది.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దుపై స్పష్టమైన అవగాహన ఏర్పడిన తర్వాతే ‘రెపో’ రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఫిబ్రవరి సమీక్షలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్బిఐ కీలకమైన వడ్డీ రేట్లను పావు శాతం అటుఇటుగా మార్చే అవకాశం ఉందని అంచనా. జీఎస్టీ, 7వ వేతన సంఘం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్నకూరగాయల ధరల ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ తీసుకునే నిర్ణయం బ్యాంకులు బాండ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఎలనినో భయాలు ఆహార ధరలను పైకి నెట్టొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 39 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఆహార, ఇంధన ధరలూ పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఎంపిసి ఈ సారి కూడా రెపో రేటు తగ్గింపువైపు మొగ్గు చూపక పోవచ్చని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు రూ.14 లక్షల కోట్ల నగదు చేరింది. దీంతో చలామణి నుంచి తొలగించేందుకు ఈ పరపతి సమీక్షలో ఆర్బిఐ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) వంటి చర్యలను ఆర్బీఐ తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకు యొక్క ప్రధాన దృష్టి తటస్థ విధానం కంటే బ్యాంకుల లిక్విడిటీని తొలగించే చర్య ఎక్కువగా ఉండనుందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త అభీక్ బారువా అభిప్రాయపడ్డారు. -
బడ్జెట్ సమావేశాలపై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందుగా, జనవరి చివరి వారంలోనే ప్రారంభించాలనే విషయంపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి సమావేశాలను ముందే ప్రారంభించి, ఫిబ్రవరి 1వ తేదీననే బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్పై 4న జైట్లీ సంప్రదింపులు: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రాల మంత్రులతో బడ్జెట్ పూర్వ సమాలోచనలు జనవరి 4 నుంచి ప్రారంభించనున్నారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం ఆయన ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement