-
పబ్లిసిటీ కావాలంటే నగ్నంగా డ్యాన్స్ చెయండి!
రక్షణమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు పణజి: గోవా మీడియాలోని ఓ వర్గంపై రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసం అనవసరంగా వాగడం కంటే సదరు మీడియా దుస్తులిప్పి నగ్నంగా డ్యాన్స్ చేయడం మేలు అని, అదే తాను సలహా ఇస్తానని పేర్కొన్నారు. ఉత్తర గోవాలోని సత్తారి సబ్ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియా తన పరిమితులను గుర్తించడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. '1968లో వాటర్గేట్ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్ (అమెరికా అధ్యక్షుడు) రిచర్డ్ నిక్సన్కు సలహాలు ఇస్తూ పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు అదే నిక్సన్ కోసం మరాఠీలో సంపాదకీయాలు రాస్తామంటే ఎలా? అతను అమెరికన్. కొందరు వ్యక్తులు తమ పరిమితులను గుర్తించడం లేదు. వారు తరచూ గోల చేస్తున్నారు. వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే.. దుస్తులు విప్పి నగ్నంగా నర్తించండి. అప్పుడు ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది' అని స్థానిక దినపత్రికపై ఆయన మండిపడ్డారు. వెయ్యికాపీలు కూడా అమ్ముడుపోని సదరు దినపత్రిక అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ పొందాలని తాపత్రయపడుతున్నదని ఎద్దేవా చేశారు. -
గోవాపై నాకో డ్రీమ్ ఉంది: పారికర్
పనాజీ: తనకు గోవా విషయంలో ఒక డ్రీమ్ ఉందని, గతంలో తాను అనుకున్నవి చేశానని, మరోసారి బీజేపీకి పట్టం కడితే ఆ డ్రీమ్ కూడా నెరవేరుస్తానని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘సంతోష పట్టిక’ లో గోవా వెనుకబడిందని, దానిని అమాంతంగా పెంచేయాలన్నదే తన కొత్త కల అని ఆయన చెప్పారు. ‘మేం(బీజేపీ) సామాజిక రంగానికి బాగా పనిచేశాం. మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేశాం. కానీ, ఒకటి మాత్రం ఇంకా చేయాల్సి ఉంది. నాకు గతంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, సామాజిక రంగానికి సంబంధించి పనిచేయాలని ఒక కల ఉండేది. అది నెరవేరింది. కానీ, ఇప్పుడు అదే స్థాయిలో గోవాలో సంతోషాలు వెల్లివిరిసేలా చేయాలి. హ్యాపినెస్ ఇండెక్స్లో గోవాను ముందుకు తీసుకెళ్లాలి. ఇది చేయాలంటే మరోసారి బీజేపీకి అధికారం అప్పగించండి. డబ్బు మీకు సంతోషాన్ని ఇవ్వదు. సంతోషకరమైన పరిస్థితుల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గురించి గోవా అసెంబ్లీలో 2001లో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నేను చెప్పాను. రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా లేనంతవరకు ఇక రాష్ట్రానికి అవసరమైనవి ఏవీ లేవని చెప్పలేం. ఇది చేయాలంటే నాకు మీ మద్దతు కావాలి’ అని పారికర్ గోవా ప్రజలను కోరారు. -
హలో చెప్పరు.. కాల్చిపారేయండి!
‘మీ వెనక మేమున్నాం. ఎవరైనాసరే, ఆయుధాలతో కనిపిస్తే.. వాళ్లొచ్చి హలో చెబుతారనే అనుకోవద్దు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విచక్షణా రహితంగా కాల్చిపారేయండి’ అని సైనికుల్లో ధైర్యం నూరిపోశానని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు. కశ్మీర్ సహా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లు.. శత్రువులను మట్టుపెట్టేందుకు ఫుల్ పవర్స్ ఉన్నాయని, ఆ మేరకు మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారం సాయంత్రం గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పమాట్లాడిన పరీకర్.. కాంగ్రెస్ హయాంలో జవాన్ల కాళ్లకు బంధనాల్లాంటి నిబంధనలు ఉండేవని అన్నారు. ‘కాంగ్రెస్ హయాంలో విచిత్రమైన నిబంధనలు ఉండేవి. సాయుధులు ఎదురుపడిన సందర్భంలో ముందుగా వాళ్లు కాల్పులు జరిపితేగానీ మన జవాన్లు కాల్చకూడదనే రూల్ ఉండేది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధనలో మార్పులు చేశారు. ఎవరైనాసరే, తుపాకులు, మారణాయుధాలతో సంచరిస్తే వారిని జవాన్లు కాల్చిపారేయొచ్చని సూచించారు. ఇది సైనికుల మనోస్థైర్యాన్ని రెట్టిపు చేసింది’అని పరీకర్ వ్యాఖ్యానించారు. కీలకమైన రక్షణ శాఖ నిర్వహణ అంత సులువేమీ కాదని, శాఖ పనితీరును అర్థం చేసుకోవడానికి కనీసం ఎనిమిది నెలలు పట్టిందని మంత్రి చెప్పారు. పాక్ చెరలోని భారత జవాన్ క్షేమం! పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన తర్వాతి రోజుల్లో పొరపాటున దాయాది సరిహద్దుల్లోకి వెళ్లిన భారత జవాన్ చందు చౌహాన్ జాడపై రక్షణ మంత్రి పరీకర్ కీలక సమాచారం వెల్లడించారు. చందు చౌహాన్ పాక్ లోనే సజీవంగా, క్షేమంగా ఉన్నాడని, అతని విడుదలకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేసినట్లు మంత్రి చెప్పారు. సోమవారం ముంబై తీరంలో ఐఎన్ఎస్ చెన్నై నౌకను జలాల్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
స్కైవేల నిర్మాణాలకు సహకరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్కైవేలకు కంటోన్మెంట్ పరిధిలో భూసేకరణకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర అధికారులు బుధవారం పరీకర్తో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన రెండు స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న సుమారు 100 ఎకరాల స్థలం అవసరమని, ఈ భూమి సేకరణకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతంలో భూమి కేటాయిస్తే స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలోని భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరీకర్ చెప్పినట్లు కేటీఆర్ మీడియాతో తెలిపారు. రెండు స్కైవేల నిర్మాణానికి ప్యారడైజ్ సర్కిల్ నుంచి కొంపల్లి వరకు (ఇందులో 3.8 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది), జూబ్లీ బస్టాప్ నుంచి షామీర్ పేట వరకు (ఇందులో 10 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది) స్కైవేల నిర్మాణాలను తలపెట్టామన్నారు. వీటి నిర్మాణానికి కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 100 ఎకరాల స్థలం అవసరమవుతుందని చెప్పారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ‘కంటోన్మెంట్లో రహదారుల మూసివేతపై కూడా ఈ సందర్భంగా చర్చించాం. ఇక్కడ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించా లని కోరాం. ఈ మూడు రహదారులకు సంబంధించి భూమి బదలాయింపు కింద ఔటర్ రింగ్ రోడ్డు బయట భూమి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాం. దీనిపై సీఎంతో చర్చించి స్పష్టత ఇస్తామని హామీఇచ్చాం. వారం లోపు ఈ సమస్యను పరిష్కరిస్తాం’ అని కేటీఆర్ అన్నారు. పరీకర్ను కలసిన వారిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఏ అండ్ యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్, ఆర్అండ్బీ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తదితరులున్నారు. -
'నేను క్రమశిక్షణ గలవాడిని.. అదే నమ్ముతా'
పనాజీ: తాను ఒక క్రమశిక్షణగల స్వయం సేవక్నని, కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గోవా ఎన్నికల నేపథ్యంలో ఆరెస్సెస్కు చెందిన మరో నేత సుభాష్ వెలింకార్ మరో పార్టీ తీసుకురానున్నారని వచ్చిన ఊహాగానాలపై ఆయన పెద్దగా స్పందించలేదు. ఇది ప్రజాస్వామ్యంగల దేశం అని, ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టవచ్చని, ఏ పార్టీలోనైనా ఉండొచ్చని, ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయని, ఆప్ కూడా ఉందని పారికర్ గుర్తు చేశారు. గోవాలోని ఆరెస్సెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అయితే, తాను ఒక క్రమ శిక్షణ గల స్వయం సేవక్ నని చెప్పుకున్నారు. తాను ఎప్పటికీ ఆరెస్సెస్ నీ అనుసరిస్తుంటానని, ఎప్పటికీ అదే చేస్తానని అన్నారు. తన దృష్టిలో క్రమ శిక్షణే ప్రధానం అని, దానినే ఎక్కువగా నమ్ముతానని తెలిపారు. ఆరెస్సెస్పై తన స్పందన కావాలంటే ముందు వెళ్లి ఆరెస్సెస్నే కలవాలని ఆయన వ్యాఖ్యానించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement