-
ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..
గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్ వన్ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ‘శాంత్రోవాలా’.. షారుఖ్.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్పోలో కొత్త క్రెటా ఎస్యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. గ్రేట్ వాల్ మోటర్స్ ఉత్పత్తి హవల్ ఎఫ్5 ఎస్యూవీతో మోడల్స్ ఫోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ‘ఐడీ క్రాజ్’తో సంస్థ ప్రతినిధులు జేకే మోటర్ స్పోర్ట్స్ పెవిలియన్లో రేసింగ్ కారుతో మోడల్స్ ఆటో ఎక్స్పోలో సుజుకీ హయబుసా బైక్తో మోడల్ -
మహీంద్రా 300 సీసీ బైక్ మోజో వస్తోంది..
మే నాటికి భారత్లోకి * కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా * ఏపీ, తెలంగాణలో గస్టో స్కూటర్ విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా టూ వీలర్స్ ఈ ఏడాది ఏప్రిల్-మే నాటికి భారత మార్కెట్లో 300 సీసీ బైక్ ‘మోజో’ విడుదల చేయనుంది. 2010లో తొలిసారిగా ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఈ మోడల్ను ప్రదర్శించారు. మహీంద్రా టూ వీలర్స్ నుంచి ప్రీమి యం బైక్ ఇదే. ప్రోటోటైప్ మొదలు ఇప్పటి వరకు బైక్ డిజైన్ను మారుస్తూ వస్తున్నారు. కస్టమర్ల సూచనల ఆధారంగా కొత్త డిజైన్తో మోజోను తీసుకొస్తున్నట్టు కంపెనీ సేల్స్, కస్టమర్కేర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలోకి గస్టో స్కూటర్ విడుదల సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 125 సీసీ స్కూటర్..: మహీంద్రా టూ వీలర్స్ ప్రస్తుతం స్కూటర్ల విభాగంలో ఆరు మోడళ్లు, మూడు రకాల బైక్లను విక్రయిస్తోంది. కొత్త ఫీచర్లతో ఆరు నెలల కో మోడల్ను విడుదల చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 125 సీసీ విభాగంలో మరో స్కూటర్ను ఈ ఏడాదే మార్కెట్లోకి తెస్తోంది. 150 సీసీ బైక్ల విభాగంలోకి అడుగు పెడుతోంది. 1.6 కోట్ల యూనిట్ల భారత ద్విచక్ర వాహన మార్కెట్లో మహీంద్రాకు 3% వాటా ఉంది. రెండేళ్లలో 5-7% ల క్ష్యంగా చేసుకుంది. టూ వీలర్ మార్కెట్లో అన్ని విభాగాల్లో ప్రవేశిస్తామని ధర్మేంద్ర మిశ్రా చెప్పారు. రుతుపవనాలు అనుకూలిస్తే 2015లో మార్కెట్ 10-15% వృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ ఎక్స్షోరూంలో గస్టో ధర హెచ్ఎక్స్ వేరియంట్ రూ.48,100, వీఎక్స్ రూ.50,100. -
షో షురూ...
అంగరంగ వైభవంగా 12వ భారత ఆటో షో అరంభమైంది. దేశ, విదేశీ కంపెనీలు కొత్త కొత్త వేరియంట్లు, కాన్సెప్ట్ కార్లతో ఆటో షోను ముంచెత్తుతున్నాయి. ఈ ఆటో షోతోనైనా డిమాండ్ పుంజుకుని సుదీర్ఘ మందగమనానికి తెరపడుతుందని వాహన పరిశ్రమ ఆశిస్తోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏసీఎంఏ)లు సంయుక్తంగా ఈ ఆటో షోను నిర్వహిస్తున్నాయి. స్థలాభావం చేత ఈ సారి ఆటో షో రెండు చోట్ల జరుగుతోంది. గ్రేటర్ నోయిడాలో మోటార్ షో, ప్రగతి మైదాన్లో వాహన విడిభాగాల ప్రదర్శన జరుగుతోంది. ఆటో షోలో బుధవారం ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్లు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్లు సందడి చేశారు. ఆ ఆటోషోకు ఈ నెల 7 నుంచి 11 వరకూ సందర్శకులను అనుమతిస్తారు. టికెట్లు రూ.200, రూ.500గా నిర్ణయించారు. 1. హస్టర్ బైక్(650 సీసీ)తో హీరో మోటోకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజాల్ 2. జనరల్ మోటార్స్ షెవర్లే 2014 కర్వెట్టి స్టింగ్రేతో మోడల్స్ 3. హార్లే డేవిడ్సన్ అత్యంత చౌక బైక్(ధర రూ.4.1 లక్షలు)ను ఆవిష్కరించిన హర్లే డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాశ్ 4. టాటా మోటార్స్ కాన్సెప్ట్ కారు నెక్సన్తో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ గ్రేటర్ నోయిడా: దేశ, విదేశీ వాహన కంపెనీలు కాన్సెప్ట్ కార్లు, కొత్త వేరియంట్లతో ముంచెత్తాయి. మారుతీ సుజుకి కంపెనీ రెండు కాన్సెప్ట్ కార్లు- సెడాన్ సియాజ్, క్రాసోవర్ ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్లను ఆవిష్కరించింది. స్విఫ్ట్, ఆల్టో, రిట్జ్, ఎర్టిగ, డిజైర్ వేరియంట్లతో సహా మొత్తం 14 విభిన్నమైన మోడళ్లను ఈ కంపెనీ డిస్ప్లే చేసింది. హ్యుందాయ్ కంపెనీ కొత్త జనరేషన్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ శాంటా ఫేను ఆవిష్కరించింది. ధరలు రూ. 26.3 లక్షలు నుంచి రూ.29.2 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఫోర్డ్ కంపెనీ రెండు మిడ్-సైజ్ సెడాన్లు ఫియస్టా, ఫిగో కాన్సెప్ట్లను ఆవిష్కరించింది. టాటా మోటార్స్ రెండు కాన్సెప్ట్ కార్లు-నెక్సన్(కాంపాక్ట్ ఎస్యూవీ), కనెక్ట్ నెక్స్ట్లతో పాటు మొత్తం 18 కార్లను డిస్ప్లే చేసింది. ఫ్రాన్స్కు చెందిన రెనో కంపెనీ క్విడ్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. స్ట్టీరింగ్ కుడి, ఎడమ వైపున కాకుండా మధ్యలో ఉండడం ఈ కార్ ప్రత్యేకత. జనరల్ మోటార్స్ కంపెనీఎస్యూవీ షెవర్లే ఆడ్రాను డిస్ప్లే చేసింది. ఇక టయోటా కంపెనీ కొరిల్లా ఆల్టిస్లో కొత్త మోడల్ను ఆవిష్కరించింది. ఫియట్ కంపెనీ మూడు కార్లు-అవెంచుర మల్టీ పర్పస్ వెహికల్, అబర్త్ 500 హ్యాచ్బాక్లను ఆవిష్కరించింది. హోండా కంపెనీ రెండు మోడళ్లు-హోండా మొబిలియో, థర్డ జనరేషన్ హోండా జాజ్ను ఆవిష్కరించింది. వీటితో పాటు హోండా విజన్ ఎక్స్ఎస్-1(కాన్సెప్ట్ యుటిలిటి వెహికల్), ఎస్ఎస్ఎక్స్ కాన్సెప్ట్, అకార్డ్ హైబ్రిడ్లనూ డిస్ప్లే చేసింది. ఫోక్స్వ్యాగన్ కాన్సెప్ట్ ఎస్యూవీ తైగన్ను ఆవిష్కరించింది. ఇసుజు మోటార్స్ రూ.7-9 లక్షల రేంజ్లో ధర ఉండే మల్టీయుటిలిటి పికప్ ట్రక్- ఇసుజు డి-మ్యాక్స్ స్పేస్ క్యాబ్ను ఆవిష్కరించింది. ప్రభుత్వ అనుమతులు రాగానే క్వాడ్రిసైకిల్, ఆర్ఈ60ను మార్కెట్లోకితెస్తామని బజాజ్ తెలిపింది. హార్లే డేవిడ్సన్ చౌక బైక్ ఇక టూవీలర్ల విషయానికొస్తే, హర్లే డేవిడ్సన్ అతి చౌక బైక్, స్ట్రీట్ 750ను ఆవిష్కరించింది. ధర రూ.4.1 లక్షలు. స్ట్రీట్ 750 బైక్తో పాటు ఫ్యాట్ బాయ్, స్ట్రీట్ బాబ్, స్ట్రీట్ గ్లైడ్ తదితర మోడళ్లను కూడా డిస్ప్లే చేసింది. వీటి ధరలు రూ.4.1 లక్షల నుంచి రూ.29 లక్షల రేంజ్లో ఉన్నాయి. దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ 100 సీసీ కేటగిరిల్లో రెండు కొత్త బైక్లను - స్ప్లెండర్ ప్రొ క్లాసిక్, ప్యాసన్ టీఆర్లను ఆవిష్కరించింది. లగ్జరీ కార్ల జోరు... వీఐపీల కోసం బుల్లెట్ప్రూఫ్ ఎస్యూవీ ఎంఎల్-గార్డ్ను మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. ధర రూ.2.49 కోట్లు. మరో లగ్జరీ కంపెనీ ఆడి సెడాన్ ఏ3ను లాంఛనంగా ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ కంపెనీ కూడా నాలుగు కార్లను ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ ట్యురిస్మో(ధర రూ.42.75 లక్షలు), ఎక్స్5, బీఎండబ్ల్యూ ఎ6 గ్రాన్ కూప్లను డిస్ప్లే చేసింది. ఈ కార్లను క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement