-
సీఐడీ బాస్ ముందు భారీ సవాళ్లు
- అన్ని కేసులూ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనవే - ఏళ్లకేళ్లుగా పెండింగ్లోనే కేసుల దర్యాప్తు - ఒత్తిళ్లు జయించి కేసుల్లో పురోగతి సాధించేనా? సాక్షి, హైదరాబాద్: కొత్తగా సీఐడీ అదనపు డీజీపీగా బాధత్యలు స్వీకరించిన గోవింద్ సింగ్కు అనేక సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించిన ప్రతిష్టాత్మక కేసులన్నీ పెండింగ్లోనే ఉండిపోయాయి. గతంలో పనిచేసిన అధికారులు ఆ కేసుల జోలికి పోకుండా సాదాసీదా దర్యాప్తు నిర్వహించారు. కానీ వీటిలో కొన్ని కేసులు చార్జిషీట్ దశకు చేరుకోగా, మిగతా కేసులు నత్తనడకన సాగుతున్న దర్యాప్తు దశలో ఉండిపోయాయి. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు.. మరోవైపు దర్యాప్తు అధికారుల పనితీరు సీఐడీ అదనపు డీజీపీని ఇబ్బంది పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేసుల్లో పురోగతి ఏది? రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కే చంద్రశేఖర్ రావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవ కతవకలపై దర్యాప్తు ఆదేశించారు. మూడేళ్లు గడుస్తున్నా ఈ కేసులో ఇప్పటివరకు నింది తులను అరెస్ట్ చేయడం కాదు కదా కనీసం నోటీసులిచ్చే దశకు కూడా తీసుకెళ్లలేదు. పైగా ఈ విచారణ జరిగిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో కేసుకు ఎలాంటి ముగింపు ఇవ్వాలో తెలియక గతంలో పనిచేసిన అధికారులు పక్కన పెట్టేశారు. ఇకపోతే సీఎంఆర్ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) స్కాంలోనూ సీఐడీ త్వరితగతిన దర్యాప్తు చేపట్టి 16 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసింది. కానీ చివర్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సి ఉండగా రాజకీయ ఒత్తిడితో కేసును పెండింగ్లోనే పెట్టేశారు. భూదాన్ భూముల వ్యవహారంలోనూ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇప్పటివరకు ఆ కేసు దర్యాప్తు పట్టాలెక్కలేదు. అదేవిధంగా అగ్రిగోల్డ్ కేసులో రెండు కేసులు నమోదయినా.. ఈ కేసుల దర్యాప్తులో అంగుళం కూడా అభివృద్ధి కనిపించలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల స్వాధీనం, వేలం వరకు సీఐడీ తీసుకెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఏఎస్ఐ మోహన్రెడ్డి కేసులో అరెస్టు జరిగిపోయినా చార్జిషీట్ పెండింగ్లో పెట్టారు. పట్టుబడని ‘ఎంసెట్ లీకేజీ’ నిందితుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎంసెట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో అసలు నిందితుడు ఇప్పటివరకు చిక్కలేదు. ఈ కేసులో బ్రోకర్లందరినీ అరెస్ట్ చేసినా.. కీలక వ్యక్తి పరారీలో ఉండటంతో లింక్ తెగిపోయి నట్లైంది. వాణిజ్య పన్నుల శాఖ బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కోట్ల రూపాయల నకిలీ చలాన్ల స్కాంలో ఏ1 అరెస్టయినా కస్టడీ లోకి తీసుకొని విచారించలేక పోతున్నారు. ఈ కేసులో రైస్ మిల్లర్ల నుంచి ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉం దని పోలీస్ ఉన్నతాధికారులు బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. ఇలాంటి సమయాల్లో పెండింగ్లో ఉన్న కేసులను ఏ విధంగా లాజికల్ ఎండింగ్కు తీసుకువస్తారు? అందరి దారిలోనే ఆయన కూడా నడుస్తారా? లేకా చార్జిషీట్ల వరకు తీసుకువస్తారా అన్నది సీఐడీలో చర్చనీయాంశమైంది. -
ఇక్కడ గిట్టుబాటు కాకే..ఈ పాట్లు!
ఎచ్చెర్ల:ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు విఫలం కావడం, మిల్లర్లు సరైన ధర ఇవ్వకపోవడం వల్లే ఇతర జిల్లాల వర్తకులకు ధాన్యం అమ్మడానికే ఇష్టపడుతున్నారు. దాని పర్యవసానంగానే తూర్పు గోదావరి జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం లోడ్లు తరలిపోతున్నాయి. అలా వెళుతున్న 30 లారీలను ఆదివారం అర్ధరాత్రి చిలకపాలెం వద్ద పౌరసరఫరా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పట్టుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఆ మేరకు ఈ ఖరీఫ్లో లెవీ సేకరణ లక్ష్యాన్ని రెండు లక్షల క్వింటాళ్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. కొండంత లక్ష్యం ముందున్నా వేరే జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం తరలిపోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రైతుల వాదన వాస్తవ పరిస్థితులను కళ్లకు కడుతోంది. వారి వాదన ప్రకారం.. ధాన్యం కొనుగోలుకు వంద కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినా .. ఆ స్థాయిలో కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమన కేంద్రాల్లోనూ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. దళారులే నేరుగా కళ్లాల్లోకి వచ్చి ధాన్యం కొని ఇతర జిల్లాల మిల్లర్లకు అమ్ముతున్నారు. రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే కంటే దళారులకు అమ్మడానికే ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువపరిమాణంలో ధాన్యం పండించే రైతులు దాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోవడమే దీనికి కారణం. కొనుగోలు కేంద్రాల్లోగానీ, జిల్లాలోని మిల్లర్లు గానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోవడం మరో కారణం. మద్దతు ధర కావాలా.. ముదరా ఇవ్వండి ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలు రూ.1400, సాధారణ రకం రూ.1360 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ రేటు ఇవ్వాలంటే క్వింటాలుకు ఆరు కిలోలు ఎక్కువ ధాన్యం ఇవ్వాలని జిల్లాలోని పలువురు మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారన్నది రైతుల ఆరోపణ. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో స్థానిక మిల్లర్ల కంటే ఇతర జిల్లాల మిల్లర్లే మంచి ధర ఇస్తున్నారని, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తున్నారని నరసన్నపేట మండలం బద్రి గ్రామానికి చెందిన రైతులు చెప్పారు. అందువల్లే వరి ఎక్కువగా సాగు చేసే పోలాకి, గార, నరసన్నపేట, జలుమూరు, శ్రీకాకుళం రూరల్ మండలాల నుంచి ధాన్యం నిల్వలు తూర్పుగోదావరి జిల్లాకు తరలిపోతున్నాయంటున్నారు. మద్దతు ధర విషయంలో విఫలమైన అధికారులు ఇతర జిల్లాలకు తరలివెళుతున్న ధాన్యాన్ని పట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే అధికారుల దాడుల్లో రైస్ మిల్లర్లు పాల్గొనడమేమిటని నిలదీస్తున్నారు. దళారీ వ్యవస్థను, ఇతర జిల్లాలకు ధాన్యం రవాణాను అరికట్టాలనుకుంటే ముందు మద్దతు ధర ఖచ్చితంగా అమలు చేయడంతోపాటు గ్రామం యూనిట్గా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. ఇప్పటికే తుపాను కారణంగా దిగుబడి తగ్గిందని, ఈ పరిస్థితుల్లో ధాన్యం ఇతర జిల్లాలకు తరలిపోతే, ముందు ముందు జిల్లా బియ్యం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన ధాన్యంపై విచారణ ఇదిలా ఉండగా జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్ప్లాజా సమీపంలోఆదివారం ఆర్ధరాత్రి వరకు పట్టుకున్న 30 ధాన్యం లారీలను ఎచ్చెర్ల పోలీస్ సే ్టషన్కు తరలించి, విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి, జిల్లా పౌరసర ఫరాల అధికారి ఆనందరావు, పౌరసరఫరాల సంస్థ ఏఎస్వో తిలగ, ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావు తదితరలు పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మిన రైతులు కొందరు కూడా స్టేషన్కు వచ్చి తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ధాన్యం కొనుగోలు ర సీదులు, ఆధార్ కార్డులు చూపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని ఆధారాలు ఉన్న ధాన్యం లారీలను విడిచిపెడతామని, ఆధారాలు చూపని లారీలపై 6(ఎ) కేసులు నమోదు చేసి జేసీ కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు పూర్తి రికార్డులు ఉన్న రెండు లారీలను విడిచి పెట్టాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. మరోపక్క పోలీస్స్టేషన్కు వచ్చిన నరసన్నపేట మండలానికి చెందిన కొందరు రైతులు తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మితే తప్పేమిటని అధికారులను ప్రశ్నించారు. కాగా గతంలో ఎప్పుడూ ఇటువంటి అభ్యంతరాలు రాలేదని కొందరు లారీ డ్రైవర్లు చెప్పారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement